Ap News: కాకినాడ ఎమ్మెల్యేకు ఎయిడెడ్ సెగ
ఎయిడెడ్ పాఠశాల మూసేయొద్దని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి
ద్వారంపూడిని నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు
స్కూలు మూసేస్తే ఆందోళన తప్పదని హెచ్చరిక
కాకినాడ జగన్నాథపురం ప్రాంతంలోని సెయింట్ యాన్స్ ఎయిడెడ్ బాలికల ఉన్నత పాఠశాల
విలీనాన్ని నిరసిస్తూ నగర ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డిని చుట్టుముట్టిన తల్లిదండ్రులు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: ఎయిడెడ్ పాఠశాల మూసేయొద్దని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిని చుట్టుముట్టి నిరసన తెలిపారు. నగరంలోని జగన్నాథపురం ప్రాంతంలోని సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ బాలికల ఉన్నత పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పాఠశాల ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రైవేటు ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహించక తప్పదని.. అందుకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం కోసం సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడంతో తల్లిదండ్రులు మంగళవారం ఆ పాఠశాలకు భారీగా చేరుకున్నారు.
ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం
ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి పాఠశాలకు సమీపంలో వైద్యశిబిరం ప్రారంభానికి వస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఫీజు కట్టాలని పాఠశాల యాజమాన్యం చెబుతోందని.. కూలిపనులు చేసుకుని బతికే తాము అధిక ఫీజులు ఎలా చెల్లించగలమని వాపోయారు. ఇక్కడ చదువుతున్న రెండు వేల మంది పిల్లల భవిష్యత్తుకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే వాహనం చుట్టూ జనం చేరి కదలనివ్వలేదు. వారు ఎంతకూ శాంతించక పోవడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తంచేశారు. సమస్యపై ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎలాంటి ఫీజులూ కట్టొద్దని, ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచే డీఈవో అబ్రహంతో ఫోనులో మాట్లాడారు. యాజమాన్యంతో ప్రజాప్రతినిధులు మాట్లాడతారనీ, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామని భరోసా ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. తర్వాత ఉప మేయర్లు, కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులు, యాజమాన్యంతో కలిసి చŸర్చించారు. ఈనెల 28న కోర్టులో తీర్పు వస్తుందనీ, దానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని, అప్పటి వరకూ ఆగాలని సూచించారు.
మా స్కూలు తీసుకోవద్దు...
‘మా స్కూలును, టీచర్లను తీసుకోవద్దు.. దండం పెడుతున్నాం మీరిచ్చే రూ.15 వేలు తీసుకోండి’ అని పలువురు విద్యార్థులు ఆవేదన చెందారు.
మర్యాద నిలబెట్టుకోవాలి..
‘జగనన్నయ్య, మామయ్య అని ఇంత గౌరవంగా పిల్లలతో పిలిపించుకుంటున్నారంటే ఆ మర్యాద నిలబెట్టుకోవాలి. రూ.వేలలో ఫీజులంటే తల్లిదండ్రులు ఎలా కడతారు. మేం భోజనాలు పెట్టమని అడగట్లేదు. ఈ స్కూల్లోనే చదివిస్తాం. ఫీజులు కట్టం. మాకు అమ్మఒడి వద్దు. మా పిల్లలకు ఇచ్చిన డబ్బు సిస్టర్లకు, టీచర్లకు ఫీజుల కింద ఇచ్చేయమనండి’
- మల్లాడి ఆదిలక్ష్మి, విద్యార్థిని తల్లి
ముఖ్యమంత్రే చూసుకోవాలి
నేను ఇదే స్కూల్లో చదివా. మా పాపను ఇక్కడే చదివిస్తున్నా. ఈ స్కూల్లో ఉన్న భద్రత మా పిల్లలకు ఇంకెక్కడా దొరకదు. ఇదే స్కూలును ప్రభుత్వ పాఠశాలగా ప్రకటించి అన్నీ అందించాలి. జగన్ని అన్న అని అనుకుంటున్నామంటే మా పిల్లలను ఆయనే చూసుకోవాలి. మా పిల్లలను మంచిగా చదివించుకోవాలంటే ముఖ్యమంత్రి మాకు ఈ సహాయం చేయాలి.
- పల్లవి, విద్యార్థిని తల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి