Polavaram: పోలవరానికి పాత ధరలే
పోలవరం ప్రాజెక్టులో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1,383 కోట్ల మేర బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. గతంలో విభాగాల వారీగా పరిమితులు...
2013-14 ప్రకారమే ఖర్చులను చెల్లిస్తున్నాం
కొత్త ఒప్పందం ఆధారంగా ఇవ్వలేం
రూ.551 కోట్ల బిల్లులు వెనక్కి..
మొత్తం రూ.1,383 కోట్లను తిరస్కరించిన పోలవరం అథారిటీ
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టులో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1,383 కోట్ల మేర బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. గతంలో విభాగాల వారీగా పరిమితులు పెట్టి, అంతకన్నా మించి ఖర్చు చేసిన రూ.831.93 కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించబోమని తేల్చిచెప్పింది. ఇప్పుడు వాటికి అదనంగా ఇతర కారణాలను చూపుతూ మరో రూ.551.37 కోట్ల బిల్లులను తిరస్కరించింది. స్పిల్వే, విద్యుత్కేంద్రం, ప్రధాన రాతి, మట్టి కట్టడాల నిర్మాణానికి అదనపు ధరల పేరుతో పెట్టిన బిల్లులను ఇవ్వబోమంది. ‘‘మేం 2013-14 ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నాం. అందువల్ల కొత్త ఒప్పందం ప్రకారం సమర్పిస్తున్న వాటిని చెల్లించబోం’ అంటూ అథారిటీ వాటిని వెనక్కి పంపింది.
* కొత్త ఒప్పందం ప్రకారం ఖర్చు చేసిన మొత్తంలో వివిధ పనుల కింద జలవనరుల శాఖ పంపిన బిల్లులను ఇటీవల పోలవరం అథారిటీ తిరస్కరించింది. ఈమేరకు రూ.324.84 కోట్ల బిల్లులను వెనక్కి పంపింది. వాటిలో ఒప్పందాన్ని దాటి ఉన్నాయని
రూ.137.47 కోట్లు, అదనపు ధరల రూపంలో ఉన్నాయని రూ.94.66 కోట్లు, తాజా ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయని డీ వాటరింగ్ (నీటిని ఎత్తిపోసినందుకు) పేరిట సమర్పించిన రూ.95.71 కోట్ల బిల్లులపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది.
* పోలవరం విద్యుత్కేంద్రం నిర్మాణానికి డిసెంబరు వరకు చేసిన ఖర్చులకు సంబంధించిన రూ.133.97 కోట్ల బిల్లులను తిరస్కరించింది. విద్యుత్కేంద్రం కోసం నిధులు ఇవ్వబోమని ఇప్పటికే కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్కేంద్రం నిధులు అడగబోవడం లేదు. అయితే అక్కడ జరిగే మట్టి తవ్వకం పనులకు నిధులు ఇవ్వాలని, అది విద్యుత్కేంద్రం కాంపొనెంట్ కిందికి రాదని వాదిస్తోంది. ఇందుకు పోలవరం అథారిటీ ససేమిరా అంటోంది.
* కుడి కాలువలో తాత్కాలిక నిర్మాణాల కోసం చేసిన రూ.71.37 కోట్ల ఖర్చును ఇచ్చేందుకూ ఒప్పుకోవడం లేదు. అవి పట్టిసీమ నీటిని వినియోగించుకునేందుకు తాత్కాలికంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన బిల్లులని తేల్చింది.
విభాగాల వారీగా ఖర్చులూ మీరలేం...
పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖలు 2013-14 ధరల ప్రకారం ఏ ఖర్చులు అయితే ఉన్నాయో అంత మొత్తమే ఇకపై చెల్లిస్తామని గతంలో పేర్కొన్నాయి. 2020 సెప్టెంబరు నాటికి మిగిలి ఉన్న రూ.7,053 కోట్ల మేర మాత్రమే పోలవరానికి నిధులు ఇవ్వగలమన్నాయి. అప్పటి నుంచి పోలవరానికి సవరించిన అంచనాల మేరకు 2017-18 ధరల ప్రకారం కేంద్రం పెట్టుబడి అనుమతులు ఇవ్వలేదు. పోలవరం అథారిటీ కొర్రీలపై కొర్రీలు వేస్తూనే ఉంది. దీంతో అందులో వివిధ కాంపొనెంట్ల కింద పాత ధరల కింద ఎంత ఆమోదం పొందిందో అంతకుమించి నిధులు ఇచ్చేది లేదని అథారిటీ చెబుతోంది. ఆయా పరిమితుల మేరకు ఇప్పటికే రూ.831 కోట్లను తిరస్కరించింది.
అథారిటీకి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ
కొత్త ఒప్పందం ప్రకారం చేస్తున్న పనులకు ప్రధాన డ్యాం పరిధిలో నిధులు ఇవ్వబోమని చెప్పడం సరికాదని పోలవరం అధికారులు వాదిస్తున్నారు. ఈ మేరకు పోలవరం అథారిటీ సీఈవోకు లేఖ రాశారు. పోలవరంలో చేపట్టే ఏ అదనపు పనులైనా అవి కేంద్ర జలసంఘం నిపుణులు, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ సూచనల మేరకే మార్చాల్సి వస్తోందని అందులో వారు పేర్కొన్నారు. ఆకృతుల కమిటీ సిఫార్సుల మేరకు అదనంగా చేసే పనులకు నిధులు ఇవ్వబోమంటే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర నిపుణుల సిఫార్సుల మేరకు చేసిన అదనపు పనులు, ఆకృతుల మార్పునకు, అదనపు పరిమాణాల్లో చేసిన పనులకు నిధులను ఇవ్వాల్సిందేనని కోరారు. ఈ కోణంలో చూసినప్పుడు తిరస్కరించిన కొన్ని బిల్లులను పరిశీలిస్తామన్న హామీ లభించినట్లు తెలిసింది. వాటిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారికంగా ప్రాసెస్ చేయాల్సి ఉంది.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో ఘట్టం పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద ఏర్పాటు చేస్తున్న జలవిద్యుత్తు కేంద్రానికి సంబంధించిన 12 ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఒక్కోటి సుమారు 168 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు ఉన్నాయి.
- న్యూస్టుడే, దేవీపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!