ఓటీఎస్... ఓ కాల్మనీ
పేదల నుంచి డబ్బు గుంజేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ పథకం పేరుతో కాల్మనీని ప్రోత్సహిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనాతోనూ, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోనూ పనుల్లేక అప్పుల్లో కూరుకుపోయిన
అది పేదల మెడకు ప్రభుత్వం బిగిస్తున్న ఉరితాడు
తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు
ఈనాడు, అమరావతి: పేదల నుంచి డబ్బు గుంజేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ పథకం పేరుతో కాల్మనీని ప్రోత్సహిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనాతోనూ, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోనూ పనుల్లేక అప్పుల్లో కూరుకుపోయిన పేదలు ఓటీఎస్ ఎందుకు కట్టాలని ఆయన నిలదీశారు. సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి జగన్ది దివాళాకోరుతనం. ఓటీఎస్ పథకం పేదల మెడకు ఉరితాడు. అయినా పట్టాలివ్వడానికి జగన్ ఎవరు? ఆయనేమైనా వారి కోసం భూమి కొన్నారా? రుణం ఇచ్చారా? ఇళ్లు కట్టారా? 30, 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హయాంలో మొదలైన పేదలకు పక్కా ఇళ్ల పథకాన్ని తర్వాత నేను కొనసాగించాను. పేదల భద్రతకు భరోసా ఎలా ఇవ్వాలి? వారికి మరింత మెరుగ్గా ఇల్లు ఎలా నిర్మించాలని మేం ఆలోచిస్తే.. జగన్ మొత్తం దోపిడీ చేస్తూ, పేదల మెడకు ఉరితాడు వేస్తున్నారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. పులిచింతల పాజ్రెక్టు నిర్మాణానికి ఇళ్లు వదులుకుని, పునరావాస కాలనీల్లో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారినీ ఓటీఎస్ కట్టమనడం కంటే దారుణం ఏముంటుందని ధ్వజమెత్తారు. ఓటీఎస్ కింద ప్రజలెవరూ డబ్బు చెల్లించవద్దని, సహాయ నిరాకరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పేదలకు ఇళ్లపట్టాల్ని ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెదేపా అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుందన్నారు.
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చట్టవిరుద్ధం
ఓటీఎస్లో డబ్బు చెల్లించిన వారికి గ్రామసచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామనడం చట్టవిరుద్ధమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్రిజిస్ట్రార్కే ఉంటుంది గానీ, జగన్రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో చేస్తామంటే కుదరదు. రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ పత్రాల్ని కూడా వైకాపా రంగుల్లో తయారుచేయడం వాళ్ల ఉన్మాదానికి పరాకాష్ట. నెల్లూరు జిల్లా బాలాయపాలెం మండలంలో ప్రతి రోజు ఒక్కరితోనైనా ఓటీఎస్ కట్టించాలని జేసీ విదేహ్ ఖరే లక్ష్యాలు పెట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో డ్వాక్రా మహిళల పొదుపు ఖాతా నుండి సొమ్ము తీసుకునేలా బలవంతపు తీర్మానాలు చేయించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎంపీడీవో.. ఓటీఎస్ కట్టనివారికి కుల ధ్రువీకరణపత్రాలు కూడా ఇవ్వొద్దని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఓటీఎస్ లక్ష్యాలు పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు’ అని ధ్వజమెత్తారు.
‘ఓటీఎస్ కింద డబ్బు కట్టకపోతే పింఛను నిలిపేస్తామని సంతబొమ్మాళిలో సచివాలయ కార్యదర్శి నోటీసిచ్చారని ప్రశ్నించిన తెదేపా నాయకులపై కేసులు బనాయించారు. ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేయిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పినందుకు జగన్పైనే చీటింగ్ కేసు పెట్టాలి. బొబ్బిలిలో పొల్లూరి బుల్లెమ్మ వాళ్ల అబ్బాయికి వైద్యం కోసం రూ.15 వేలు రుణం తీసుకుంటే వాటిని బలవంతంగా ఓటీఎస్ కింద కట్టించుకున్నారు. వాళ్లకు మానవత్వం ఉందా’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఆ అబ్బాయి చికిత్స ఖర్చును తెదేపా భరిస్తుందని ప్రకటించారు. ఆ అబ్బాయి వైద్యానికయ్యే ఖర్చు తానుభరిస్తానంటూ మునిరత్నం అనే విశ్రాంత ప్రభుత్వోద్యోగి ముందుకు వచ్చారు.
ఓటీఎస్ వసూళ్లపై పౌరుల ఆగ్రహంతో వీడియో
‘మా ఇంటి పట్టాను మాకు మీరు రిజిస్ట్రేషన్ చేసేదేంటి? నా భార్యను మళ్లీ నాకిచ్చి పెళ్లి చేస్తాం అన్నట్టుంది మీ పద్ధతి’- ఓటీఎస్ కింద డబ్బు కట్టాలని, స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పేందుకు వచ్చిన ఉద్యోగిపై ఒక పౌరుడి ఆగ్రహం ఇది. ఇలాంటి పలువురి ఆవేదనలతో ‘ఓటీఎస్ వసూళ్లు... పేదల మెడకు ఉరితాళ్లు’ పేరుతో తెదేపా రూపొందించిన వీడియోను చంద్రబాబు విలేకర్ల సమావేశంలో ప్రదర్శించారు.
అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలి
అంబేడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ‘2016లో అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 125 అడుగుల ఎత్తైన విగ్రహం పెట్టాలని నిర్ణయించాం. ఆ ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం నాశనం చేసింది’ అన్నారు. అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం నిర్మించాలని డిమాండ్ చేశారు.
ప్రతి గ్రామంలో గౌరవ సభలు
తెదేపా వ్యూహకమిటీ తీర్మానం
ఈనాడు, అమరావతి: ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో జగన్, వైకాపా ఎమ్మెల్యేలు మహిళలను అవమానించేలా వ్యవహరించడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గౌరవ సభలు నిర్వహించాలని, సీఎం విధానాలను ఎండగట్టాలని తెదేపా తీర్మానించింది. తెదేపా జాతీయ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సోమవారం పార్టీ వ్యూహ కమిటీ సమావేశమైంది. 17న తిరుపతిలో అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తెదేపా సంఘీభావం తెలపాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
కిర్గిజ్స్థాన్లో దాడులు.. ఇక్కడి తల్లిదండ్రుల్లో ఆందోళన
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్స్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
సిట్ పర్యటన వేళ పల్నాడులో కేసులు
పోలింగ్ నేపథ్యంలో జరిగిన గొడవలు, దాడుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న వేళ.. పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. -
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ పోయొద్దు
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపవద్దని పెట్రోలు బంకుల యాజమాన్యాలను జిల్లాల ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జూన్ 10 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, వాహనాలకు మాత్రమే వాటిని నింపాలని కలెక్టర్(పౌరసరఫరాలు) పేరుతో నోటీసులు పంపారు. -
ఎన్ని కేసులు పెట్టారు.. ఎంతమందిని అరెస్టు చేశారు?
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రిలలో పోలింగ్నాడు, ఆ తరువాత జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ బృందాలు శనివారం వేర్వేరుగా దర్యాప్తు చేశాయి.