మంత్రి కన్వెన్షన్ సెంటర్లో జూద క్రీడలా?
మంత్రి కొడాలి నాని పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుడివాడలో క్యాసినో ఏర్పాటుచేసి రాష్ట్రం పరువు గంగలో కలిపారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంత్రికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్లో
పండగ రోజు కొడాలి నాని కనుసన్నల్లో మహిళలతో రికార్డింగ్ డ్యాన్సులు
సంక్రాంతి సంబరాల ముసుగులో ఇంత జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు?
రాష్ట్ర పరువు గంగలో కలిపిన మంత్రిపై చర్యలు తీసుకోవాలి
తెదేపా నేతల మండిపాటు
చంద్రబాబు అధ్యక్షతన పార్టీ వ్యూహ కమిటీ సమావేశం
ఈనాడు, అమరావతి: మంత్రి కొడాలి నాని పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుడివాడలో క్యాసినో ఏర్పాటుచేసి రాష్ట్రం పరువు గంగలో కలిపారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంత్రికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్లో కోడి పందేలు, గుండాట, పేకాట, రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారని మండిపడ్డారు. సంక్రాంతి సంబరాల ముసుగులో జూద క్రీడలు యథేచ్ఛగా సాగుతుంటే... ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఆన్లైన్లో జరిగిన పార్టీ వ్యూహకమిటీ సమావేశంలో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పండగ వేళ మంత్రి కనుసన్నల్లో మహిళల చేత రికార్డింగ్ డ్యాన్సులు వేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి బాధ్యులైన మంత్రిపైన, పోలీసు అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండు చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సులభతర వాణిజ్యం ఇతర ఎన్నో కార్యక్రమాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిస్తే... జగన్ హయాంలో క్యాసినో సంస్కృతి, పేకాట క్లబ్బులు, మాదకద్రవ్యాలు, గంజాయి, అశ్లీల నృత్యాల్లో రాష్ట్రం నం.1గా నిలిచిందని, అభివృద్ధి అంటే ఇదేనా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా థర్డ్వేవ్ విజృంభించి, ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని ధ్వజమెత్తారు. 12కుపైగా రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినా... ఆంధ్రప్రదేశ్లో మాత్రం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రభుత్వం పాఠశాలలు నిర్వహించడం దుర్మార్గమన్నారు. ‘రాష్ట్రంలో వారం రోజుల్లో కరోనా పాజిటివిటీ రేటు 4.05 నుంచి 15.22 శాతానికి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడటం సబబు కాదు. తరగతులు తక్షణం నిలిపివేయాలి’ అని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు అమెరికాకు చెందిన వైద్యుడు ఈదర లోకేశ్వరరావుతో కలసి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, పార్టీ కేడర్ సంయుక్తంగా సేవలందించాలని సమావేశంలో నిర్ణయించారు.
చంద్రయ్యది రాజకీయ హత్య కాదని ఎస్పీ ఎలా చెబుతారు?
‘తెదేపా నాయకుడు చంద్రయ్యది రాజకీయ హత్య కాదని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఎస్పీ అలా చెబుతుంటే.. మరోపక్క జొన్నలగడ్డలో వైఎస్ విగ్రహం తొలగింపు, చంద్రయ్య హత్యకు ప్రతీకార చర్యగా జరిగిందని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొనడం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది’ అని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో పండ్లు పంచడం, రక్తదాన శిబిరాలు వంటివి నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. పార్టీ ప్రారంభించిన చైతన్యరథం ఇ-పేపర్ 30 లక్షల మందికి వాట్సప్ ద్వారా చేరుతోందని వివరించింది. సమావేశంలో సీనియర్ నేతలు కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య, దేవినేని ఉమా, బండారు సత్యనారాయణమూర్తి, బోండా ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, రాజేంద్రప్రసాద్, టీడీ జనార్ధన్, పట్టాభిరాం పాల్గొన్నారు.
* ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.
సమావేశంలో తీసుకున్న మరికొన్ని ముఖ్య నిర్ణయాలు, చర్చించిన అంశాలివి..
* ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో చెల్లింపులు చేస్తామన్న ప్రభుత్వం... రైతుల్ని మోసగించింది. మిర్చి, కంది రైతులు తీవ్రంగా నష్టపోయినా వారికి పరిహారం అందించలేదు. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
* ఉద్యోగులకు ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు, పింఛన్లు 15వ తేదీ దాటినా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రమబద్ధీకరణ కోసం ఆందోళన చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తెదేపా అండగా నిలుస్తుంది.
* ప్రత్యేక హోదా, పోలవరం, విభజన అంశాలు, రైల్వే జోన్ సాధనకు, రాష్ట్ర హక్కుల్ని కాపాడేందుకు వచ్చే పార్లమెంటు సమావేశంలో తెదేపా ఎంపీలు గళమెత్తుతారు.
* ప్రభుత్వానికి ఆదాయం, అప్పులు రెండూ పెరిగాయని కాగ్ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 నవంబరు వరకు రూ.88,618 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక ఆదాయం. ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.49,570 కోట్ల అప్పులు చేసింది. 30 నెలల పాలనలో రూ.3,64,104 కోట్ల అప్పులు తెచ్చారు. జగన్రెడ్డి మాత్రం ఆదాయం తగ్గిందని, తక్కువ అప్పులు చేశామని అబద్ధం చెబుతున్నారు. కాగ్ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పు రూ.6.65 లక్షల కోట్లకు చేరింది. రెవెన్యూ లోటు 805 శాతానికి పెరిగింది.
* తిరుపతి విమానాశ్రయంలో ఒక మంత్రి వచ్చినప్పుడు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించిన సిబ్బంది ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేయడం వైకాపా నేతల ఉన్మాదానికి పరాకాష్ఠ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు