ఆస్తి పన్ను మోత మొదలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలకు ఆస్తి పన్ను మోత మొదలైంది. ఇకపై ప్రతి ఏటా ఇది కొనసాగుతుంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానం స్థానే... ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను వేసే విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం కడుతున్న పన్నుని 10 నుంచి 15 శాతం పెంచుతూ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో పెంచిన మొత్తాలతో డిమాండ్ నోటీసుల జారీ
నెలాఖరుకల్లా అందరికీ పంపిణీ
ఇక ఏటా వాత తప్పదు
ఈనాడు - అమరావతి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలకు ఆస్తి పన్ను మోత మొదలైంది. ఇకపై ప్రతి ఏటా ఇది కొనసాగుతుంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానం స్థానే... ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను వేసే విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం కడుతున్న పన్నుని 10 నుంచి 15 శాతం పెంచుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు సంబంధించిన డిమాండ్ నోటీసులను (పన్ను తాఖీదులు) జారీ చేస్తోంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో సుమారు 33.67 లక్షల అసెస్మెంట్లు (నివాస, వాణిజ్య, ఇతర భవనాలు) ఉండగా... ఇప్పటికే సగానికిపైగా భవనాల యజమానులకు నోటీసులు వెళ్లాయి. ఈ నెలాఖరులోగా మొత్తం నోటీసులు జారీ చేయనున్నారు. ఆస్తి మూలధన విలువను ఎలా లెక్కించారు? గతానికీ... కొత్త విధానానికీ పన్ను ఎంత శాతం పెరుగుతోంది? వంటి వివరాలన్నీ ఆ డిమాండ్ నోటీసులో స్పష్టంగా పేర్కొంటున్నారు.
అద్దె ఆధారిత పన్ను విధానం నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని అమల్లోకి తేవడం వల్ల పెరిగిన భారాన్ని ప్రజలపై ఒకేసారి వేయకుండా... పెంచాల్సిన పన్ను 15 శాతం కంటే ఎక్కువ ఉంటే... మొదటి సంవత్సరం 15 శాతమే పెంచాలని ప్రభుత్వం నిర్దేశించింది. వ్యత్యాసం 10-15 శాతం మధ్య ఉంటే... అది ఎంత శాతమైతే అంతా పెంచాలని, 10 శాతం కంటే తక్కువ ఉంటే కనీసం 10 శాతం పెంచాలని నిర్ణయించింది. అంటే ఇప్పటివరకు కడుతున్న పన్నుపై ఎవరికైనా సరే మొదటి సంవత్సరం కనిష్ఠంగా 10 శాతం, గరిష్ఠంగా 15 శాతం పెంపు ఉంటుంది. ఇది ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న భవనాలకు మాత్రమే.
* విజయవాడలో 34వ డివిజన్లో ఉంటున్న ఒక వ్యక్తి తన ఇంటికి ఇప్పటివరకు ఆరు నెలలకు రూ.318 చొప్పున ఏడాదికి రూ.636 పన్ను చెల్లిస్తున్నారు. కొత్త విధానంలో ఆయనకు ఆరు నెలలకు పన్ను రూ.1,038 (సంవత్సరానికి రూ.2,076)గా నిర్ణయించినట్టు నగరపాలక సంస్థ డిమాండ్ నోటీసు పంపింది. ఇప్పుడు కడుతున్న పన్ను కంటే సంవత్సరానికి రూ.1440 (228 శాతం) పెరిగింది. అయితే మొదటి సంవత్సరం గరిష్ఠంగా 15 శాతానికి మించి పెంచకూడదన్న నిబంధనతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు రూ.366 (సంవత్సరానికి రూ.732) పన్ను చెల్లించాలని పేర్కొంది. 2022-23లో రూ.732పై మరో 15 శాతం పెంచి రూ.841 వసూలు చేస్తుంది. అలా ఏటా 15 శాతం చొప్పున రూ.2,076తో సమానమయ్యేదాకా పెంపు నిరంతరంగా ఉంటుంది.
* అనంతపురంలోని 12వ డివిజన్కు చెందిన ఒక భవన యజమాని ఇప్పటివరకు సంవత్సరానికి రూ.6,038 పన్ను చెల్లిస్తున్నారు. ఆస్తి మూలధన విలువ ఆధారంగా చూస్తే ఏడాదికి రూ.12,640 పన్ను కట్టాల్సి ఉంటుందని నోటీసు పంపింది. అంటే 109 శాతం పెరిగింది. మొదటి సంవత్సరం పన్ను పెంపు గరిష్ఠంగా 15 శాతానికి పరిమితం చేయాలన్న నిబంధన వల్ల 2021-22లో రూ.6,944 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త భవనాలకు...
* కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చే నాటికి లేదా వచ్చిన తర్వాత నిర్మాణం పూర్తి చేసుకుని, ఇంకా పన్ను వేయని భవనాలకు మాత్రం... మూలధన విలువ ఆధారంగా లెక్కించిన మొత్తం పన్నునే వసూలు చేస్తారు. అయితే ప్రస్తుతం వేయడం లేదు. వాటికి ఒకేసారి భారీగా వేస్తే జనంలో వ్యతిరేకతకు దారితీస్తుందనే ప్రస్తుతానికి వాటికి పన్నులు వేయడం లేదన్న అభిప్రాయం చెల్లింపుదారుల్లో ఉంది.
* పాత భవనాల్లో ఏమైనా మార్పులు చేసి ప్లింత్ ఏరియా పెంచుకున్నా, అదనపు అంతస్తులు నిర్మించినా, ప్రస్తుతం నివాసంగా ఉన్నదాన్ని ఏ వాణిజ్య భవనంగానో వినియోగించుకోవాలనుకున్నా, పై కప్పుగా ఏ ఆస్బెస్టాస్ రేకులో ఉంటే, వాటిని తీసేసి శ్లాబ్ వేసుకోవడం వంటి మార్పులు చేసినా కూడా... మొత్తం భవనానికి ఆస్తి మూలధన విలువ ఆధారంగా లెక్కించిన పన్ను మొత్తాన్ని అప్పటి నుంచి వసూలు చేస్తారు. వారికి ఏటా 15 శాతం చొప్పున పెంపు నిబంధన వర్తించదు. ఆ విషయాన్ని డిమాండ్ నోటీసుల్లో స్పష్టంగా చెబుతోంది.
* చాలా నగరాలు, పట్టణాల్లో గత ఏడాది అక్టోబరు-నవంబరు తర్వాత నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలకు ఇంతవరకు పన్ను వేయలేదు. వారందరికీ ఒకేసారి పన్ను వేయనున్నారు.
* రిజిస్ట్రేషన్ విలువలు సవరించినప్పుడల్లా వాత తప్పదు..!
* కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.198లో... ఆస్తి మూలధన విలువలో నివాస భవనాలకు 0.10 శాతం నుంచి 0.50 శాతం వరకు, వాణిజ్య భవనాలకు 0.20 శాతం నుంచి 2 శాతం వరకు పన్నుగా నిర్ణయించవచ్చని పేర్కొంది. ఆ పరిధిలో పన్ను శాతాన్ని నిర్ణయించుకునే అధికారాన్ని పాలకమండళ్లకు వదిలేసింది. విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో నివాస భవనాలకు 0.13 శాతం, వాణిజ్య భవనాలకు 0.30 శాతంగా, అనంతపురం వంటి నగరాల్లో నివాస భవనాలకు 0.15 శాతం, వాణిజ్య భవనాలకు 0.30 శాతంగా పన్ను నిర్ణయించింది.
* ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన ప్రతిసారీ ఆ మేరకు పన్ను మొత్తం పెరుగుతూనే ఉంటుంది. పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు అనేది ఇక నిరంతర ప్రక్రియ.
* పాత పద్ధతిలో ఐదేళ్లకు ఒకసారి ఆస్తి పన్ను సవరించాలన్న నిబంధన ఉన్నా అది అమలయ్యేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు సవరించారు. ఇకపై ఏటా పన్ను పెరుగుతూ పోతుంది.
* ఇప్పుడుకడుతున్న పన్నుపై మొదటి సంవత్సరం 15 శాతమే పెంచినా.. రానురాను మోయలేని భారంగా మారుతుందని పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..