Andhra News: ఇక వేచి చూడం.. చర్చలకు ఉద్యోగులు పిలిస్తేనే వస్తాం
పీఆర్సీలో అభ్యంతరాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇక వారి కోసం వేచి చూడదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
చర్చలకు సిద్ధమని ఉద్యోగులు పిలిస్తేనే వస్తాం
కమిటీ సభ్యులు బొత్స, పేర్ని నాని, సజ్జల
ఈనాడు, అమరావతి: పీఆర్సీలో అభ్యంతరాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇక వారి కోసం వేచి చూడదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధమని ఉద్యోగులు పిలిస్తేనే వస్తామని వెల్లడించారు. సచివాలయంలో మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రతి రోజూ వచ్చి వారి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాలుగు రోజులుగా వచ్చి వెళ్తున్నాం. ఉద్యోగులు చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. మేం చర్చలకు రమ్మని పిలుస్తుంటే అలుసుగా తీసుకుంటున్నారు. జీతాలు పెరుగుతాయా? లేదా? అనేది ఒకటో తేదీన పే స్లిప్ చూస్తే తెలుస్తుంది. ఏ ఉద్యోగికీ ఒక్క రూపాయి కూడా జీతం తగ్గదు. ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణకు దిగొద్దు. మంత్రుల కమిటీకి చట్టబద్ధత లేదంటే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాంటి కమిటీతో చర్చలకు ముందుకు రాకుంటే ఎలా? యాజమాన్యంతో విభేదాలు వస్తాయి. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలా లేదా? చర్చలకు రాకుండా ఇదేదో కొత్త సంస్కృతిని ఉద్యోగ సంఘాలు తీసుకొస్తున్నట్లుంది. ఉద్యోగ సంఘాల నేతలు సజ్జల గురించి మాట్లాడినా.. మంత్రి నానిపై మాట్లాడినా... మేం దాన్ని పట్టించుకోం. మాకు ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చిందో.. దాన్ని గుర్తెరిగి ఈ సమస్యను పరిష్కరిద్దామని భావించాం. నాలుగు మెట్లు దిగే చెప్పాం. మేం ఇంట్లో కూర్చుంటాం.. వచ్చేది లేదని ఉద్యోగులు అంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు వ్యవహరించాలి...’’ అని బొత్స పేర్కొన్నారు. ఇప్పటికీ ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని పిలుస్తున్నామని, వాళ్లు అర్థం చేసుకోవడం లేదని సజ్జల చెప్పారు. ‘‘జనవరి నెల జీతాలను కొత్త పీఆర్సీ ప్రకారమే చెల్లిస్తాం. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘాల నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలకు వచ్చినట్లయితే జనవరిలో పాత జీతాలను వేసే అంశాన్ని ప్రభుత్వం కూడా పరిశీలించి ఉండేదేమో? కొత్త పే స్కేళ్లతో వేతన బిల్లులను రూపొందిస్తున్న ఖజానా సిబ్బందిని పనిచేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. హెచ్ఆర్ఏ శ్లాబ్లతో నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే వారితో చర్చించడానికి సిద్ధమే...’’ అని సజ్జల పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!