ఎవరిదీ వైఫల్యం?
చాలినంత సమయం ఉన్నా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టులో ఇంత తీవ్ర సమస్య ఏర్పడిందా? కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో కలిపి 60 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే మిగిలింది. అదీ మట్టి పని. వరదల కాలం, కరోనా నెల తీసేసినా ఈ పని చేయడానికి చాలినంత సమయం ఉంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా భవిష్యత్తు ఇబ్బందులను అంచనా వేయకుండా వ్యవహరించడం వల్లే 2020 వరదల్లో విధ్వంసం జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాత్సారం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ విధ్వంసం
సమయం ఉన్నా కాఫర్ డ్యాంలు ఎందుకు పూర్తి చేయలేదు?
కొత్త టెండర్లు అనర్థదాయకం అని పోలవరం అథారిటీ చెప్పలేదా?
అయినా పనులు ఆపేసి కాలహరణ చేయలేదా?
నిపుణులు, విశ్రాంత అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఏవీ?
ఈనాడు - అమరావతి
చాలినంత సమయం ఉన్నా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టులో ఇంత తీవ్ర సమస్య ఏర్పడిందా? కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో కలిపి 60 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే మిగిలింది. అదీ మట్టి పని. వరదల కాలం, కరోనా నెల తీసేసినా ఈ పని చేయడానికి చాలినంత సమయం ఉంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా భవిష్యత్తు ఇబ్బందులను అంచనా వేయకుండా వ్యవహరించడం వల్లే 2020 వరదల్లో విధ్వంసం జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో జరిగిన చర్చలు, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ సమావేశాల మినిట్స్ ఆధారంగా పరిశీలిస్తే పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం, అత్యవసర పనులు కూడా... ఉన్న సమయంలో పూర్తి చేయకపోవడమే పెను సమస్యలకు దారి తీసిందన్న వాదనకు బలం చేకూరుతోందని విశ్రాంత ఇంజినీరింగు అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త టెండర్లు పిలవొద్దని, అలా చేస్తే ప్రాజెక్టు భవితవ్యమే అనిశ్చితిలో పడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2019 ఆగస్టులోనే హెచ్చరించినా వారి సందేహాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి.
2018 నవంబరులో ఎగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించారు. మే నెల వరకు అంటే ఏడు నెలల్లో 38.12 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తిచేశారు. దిగువ కాఫర్ డ్యాంలో అంత కన్నా ఆలస్యంగా పనులు ప్రారంభించారు. 3.37 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తిచేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో ఇక చేయాల్సింది కేవలం మట్టి పని మాత్రమే. ఆ పనులు పూర్తి చేసేందుకు 2020 వరదల కాలం వరకు చాలా సమయం ఉన్నా పూర్తిచేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2020 మే నాటికి కాఫర్ డ్యాంలు పూర్తిచేయాలని చెప్పింది. 2020 వరదల్లో గోదావరి నదీగర్భం కోసుకుపోయింది. డయాఫ్రం వాల్ దెబ్బతింది. ఇప్పుడు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలా అన్న సవాలు ఎదురయింది. రూ.వందల కోట్ల అదనపు భారం పడబోతోంది. పోలవరంలో అనవసర కాలయాపన చేయకుండా పనులు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న వాదన నిపుణుల నుంచి వినిపిస్తోంది.
పనులు ఆపేయడమే అసలు సమస్య కాదా?
పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలు సమాంతరంగా చేయాలని పాత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పని చేసుకుంటూ వెళ్లింది. స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు సమాంతరంగా చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీలూ ఆమోదించాయి. పోలవరంలో ఏ పని చేయాలన్నా వారి ఆమోదం తప్పనిసరి. 2019 జూన్ నాటికే ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తిచేయాలనేది లక్ష్యం. 2019 ఏప్రిల్లో ఎన్నికలు రావడంతో పోలవరం పనులు మందగించాయి.
* 2019 మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పోలవరం పనులను నిలిపివేసింది. కొత్తగా రివర్స్ టెండర్లు పిలుస్తామని ప్రకటించింది. 2019 అక్టోబరులో టెండర్ల కార్యక్రమం నిర్వహించింది.
పోలవరం అథారిటీ అడ్డు చెప్పలేదా?
పోలవరం పనులు ఆపేయడం తగదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కొత్తగా టెండర్లు పిలిస్తే చాలా సమస్యలు ఎదురవుతాయంది. పోలవరం పనుల్లో తగిన పురోగతి ఉన్నందున గుత్తేదారుణ్ని మార్చవలసిన అవసరం లేదంది. ప్రస్తుత వర్షాకాలంలో డిజైన్లు ఖరారు చేసుకుంటే ఆ తర్వాత పనులు త్వరగా పూర్తిచేయొచ్చని సూచించింది. కొన్ని అంశాలు లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం పట్టించుకోకుండా పనులు నిలిపివేసి రివర్స్ టెండర్లు నిర్వహించింది. 2019 నవంబరులో కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించింది. తర్వాత కూడా పనులు వేగంగా సాగలేదు. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు (కరోనా ఉద్ధృతి పెరిగే వరకు) ఆరు నెలల సమయం ఉన్నా ఎగువ కాఫర్ డ్యాంలో గ్యాప్ల్లో మిగిలి ఉన్న పని, దిగువ కాఫర్ డ్యాం పని చేసి ఉంటే ఈ విధ్వంసం వాటిల్లే అవకాశం లేని మాట వాస్తవం కాదా అన్నది చర్చనీయాంశమవుతోంది.
35.82 లక్షల క్యూ.మీ. పని చేయలేరా?
మొత్తం ఎగువ కాఫర్ డ్యాం పని 73.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని. 2019 మే నాటికే అందులో 38.12 లక్షల క్యూబిక్ మీటర్ల పని ఆరు నెలల్లోనే చేశారు. అందువల్ల మిగిలిన 35.82 లక్షల క్యూబిక్ మీటర్ల పని కూడా అదే సమయంలో చేయొచ్చు. వరదల వల్ల ఈ డ్యాంలు పూర్తి చేసుకోవడమే ముఖ్యమైన నేపథ్యంలో ఆ ఒక్క పనిమీదే దృష్టిసారిస్తే ఇంకా ఎక్కువ యంత్రాలు వినియోగిస్తే అంతకన్నా తక్కువ సమయంలోనే చేయొచ్చని చెబుతున్నారు. అలాంటిది 2020 జులైలో వరదలు వచ్చేవరకూ ఏకంగా ఏడాది కాలం అందుబాటులో ఉంది. పైగా నవంబరు నుంచి జూన్ వరకు 8 నెలల కాలం ఉంది. కరోనా ఏప్రిల్ నెలాఖరుకు పెరిగింది. ఆ నెల తీసేసినా ఏడు నెలల కాలం ఉంది. దిగువ కాఫర్ డ్యాంలో మిగిలి ఉన్న పని కూడా 25.46 లక్షల క్యూబిక్ మీటర్లే. ఈ రెండూ మట్టితో నిర్మించే డ్యాంలే. కొత్త ప్రభుత్వం వాటిని పూర్తి చేయకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందనే అభిప్రాయం విశ్రాంత ఇంజినీరింగు అధికారుల నుంచి వినిపిస్తోంది.
ఎప్పుడు ఈ విధ్వంసం? పనులకు చాలినంత సమయం లేదా?
2020 వరదల్లోనే పోలవరంలో విధ్వంసం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ మార్చి 22న అసెంబ్లీలో పోలవరంపై చర్చలో స్వయంగా ఇదే విషయం చెప్పారు. ఆ వరదల వరకూ ఉన్న సమయాన్ని ప్రభుత్వం సరిగా వినియోగించుకుని ఉంటే ఈ సమస్య తలెత్తి ఉండేదా?
2019 వరదల్లోనే డయాఫ్రం వాల్ దెబ్బతిందని ప్రభుత్వంలోని ఒకరిద్దరు చెబుతున్నారు. 2020 జనవరి 24న పోలవరం ప్రాజెక్టు అథారిటీ 11వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డయాఫ్రం వాల్ ధ్వంసం విషయాన్ని మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. 2019 డిసెంబరు 27-31 మధ్య కేంద్ర నిపుణుల కమిటీ పోలవరాన్ని సందర్శించిన తర్వాతే ఈ సమావేశం జరిగింది. తదుపరి డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ సమావేశం ముందు కొన్ని సాంకేతిక సమస్యలను ఎజెండా అంశాలుగా చర్చిస్తున్నామని ఎస్ఈ పోలవరం అథారిటీకి తెలియజేశారు. ఆ ఎజెండాలో డయాఫ్రం వాల్ దెబ్బతిన్న అంశమే లేదు. 2019 వరదల్లో పోలవరానికి ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని ఆ మినిట్స్ ద్వారా అర్థమవుతోంది.కొత్త ప్రభుత్వం పోలవరంలో చేసింది ఏమిటి? ఎంత స్థాయి పని?
కొత్ర ప్రభుత్యం పోలవరంలో చేసింది ఏమిటి? ఎంత స్థాయి పని?
2021 జనవరిలో ప్రస్తుత ప్రభుత్వ అధికారులే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో స్పష్టంగా 2019కి ముందు, ఆ తర్వాత కొత్త ప్రభుత్వ హయాంలో అప్పటివరకు ఎంత పని జరిగిందో స్పష్టంగా వివరించారు. ఈ ప్రభుత్వం పోలవరంలో ఎంత పని చేసిందో ఈ అధికారులే స్పష్టంగా పేర్కొన్నారు.
* 2019 మే నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత పోలవరం పనులు ఆపేసింది. 2019 నవంబరులో మేఘా ఇంజినీరింగు కంపెనీ పోలవరం పనులు చేపట్టింది. ఆ తర్వాత 2021 జనవరిలో జగన్ ప్రభుత్వంలోని అధికారులు సిద్ధం చేసిన నివేదిక చెప్పినది ఇదీ..
పోలవరం ప్రధాన డ్యాంలో మొత్తం ఎంత పని చేయాలి? 2019 మే చివరి నాటికి పాత ప్రభుత్వంలో ట్రాన్స్ట్రాయ్, నవయుగ కలిసి ఎంత పని చేశాయి...ఆ తర్వాత కొత్త ప్రభుత్వ హయాంలో ఎంత జరిగింది?
పెను సమస్యలు ఏంటి?
? 2020లో గోదావరికి వచ్చిన వరదలతో డయాఫ్రం వాల్ 1290 మీటర్ల నుంచి 1447 మీటర్ల వరకు కోసుకుపోయింది. ఎడమ వైపున మరికొంత కోత ఏర్పడింది. మొత్తం 300 మీటర్ల మేర డయాఫ్రం వాల్ ధ్వంసమైంది. 2.5 నుంచి 3.5 మీటర్ల లోతులో డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఇంజినీర్లు గుర్తించారు. దీన్ని ఎలా సరిదిద్దాలన్నది ప్రశ్న.
? అదే 2020 వరదలకు నదీగర్భంలో ప్రధాన రాతి, మట్టికట్ట నిర్మించాల్సిన చోట మొదటి గ్యాప్లో 30 మీటర్ల మేర, రెండో గ్యాప్లో 36.5 మీటర్ల మేర గుంత ఏర్పడింది. 12 మీటర్ల లోతు నుంచి ఇసుక కోసుకుపోయి ఈ గుంతలు ఏర్పడ్డాయి. అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయి... ప్రధాన రాతి, మట్టికట్టతో డ్యాం నిర్మించాలంటే ఇసుక నింపి గట్టిదనం ఏర్పరచాలి. అక్కడ మళ్లీ ఇసుకతో నింపడం పెద్ద సమస్యగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ