Borewell: బోర్ల పథకం బోర్లా
రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వి మోటార్ ఏర్పాటు చేసే ‘వైఎస్ఆర్ జలకళ పథకం’ అమలు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది.
రైతుల భూముల్లో ఉచిత బోర్ల తవ్వకాలు అంతంతే
తవ్విన చోట విద్యుత్తు సదుపాయం అరకొర
ఈనాడు, అమరావతి: రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వి మోటార్ ఏర్పాటు చేసే ‘వైఎస్ఆర్ జలకళ పథకం’ అమలు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 2 లక్షల బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేస్తామని 2020 సెప్టెంబరులో పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,940 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,10,786 మంది రైతులు దరఖాస్తులు చేశారు. వీటిలో నుంచి 1,74,931 మంది అర్హులుగా అధికారులు గుర్తించారు.
20 నెలల్లో తవ్వింది 12,567 బోర్లే!
పథకాన్ని ప్రారంభించాక గత 20 నెలల వ్యవధిలో 12,567 బోర్లే తవ్వారు. లక్ష్యం ప్రకారమైతే ఈపాటికే 50 వేలకుపైగా బోర్లు తవ్వాలి. తొలి ఏడాది పనులు జోరుగా సాగినా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు కొన్నాళ్లు పనులు నిలిపివేశారు. గతంలో నిత్యం 40 నుంచి 50 బోర్లు తవ్విన సందర్భాలున్నాయి. ఇప్పుడు 10-15 తవ్వడం గగనమవుతోంది.
బోరు వేసేందుకు అడుగుకు రూ.112 నుంచి రూ.145 వరకు చెల్లించేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ గుత్తేదారులతో మొదట ఒప్పందం చేసుకుంది. అప్పట్లో రూ.87 ఉన్న డీజిల్ లీటర్ ధర.. ప్రస్తుతం రూ.100కి చేరుకుంది. దీంతో అడుగుకి రూ.160 చొప్పున చెల్లించాలని గుత్తేదారులు డిమాండ్ చేస్తున్నారు.
329 బోర్లకే విద్యుత్తు సదుపాయం
బోర్లు తవ్విన వాటిలో ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా విద్యుత్తు సదుపాయం కల్పించాలన్నది ఉద్దేశం. రాష్ట్రంలో ఇప్పటివరకు తవ్విన మొత్తం బోర్లలో 7,425 మంది రైతులు విద్యుత్తు సదుపాయం పొందేందుకు అర్హులని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు గుర్తించి ఆ జాబితాలను విద్యుత్తు పంపిణీ సంస్థలకు పంపారు. వీటిలో గత ఆరేడు నెలల వ్యవధిలో 329 బోర్లకే విద్యుత్తు సదుపాయం కల్పించారు. కృష్ణా, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఇలాంటి బోర్లు పదిలోపే ఉన్నాయి. విద్యుత్తు స్తంభాలు, కండక్టర్, ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్తు పంపిణీ సంస్థలు సమకూర్చి పనులు పూర్తి చేస్తే.. తరువాత నిధులు సమకూర్చాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. దీంతో పలు పంపిణీ సంస్థల పరిధిలో ఈ పనుల నిర్వహణకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!