
Borewell: బోర్ల పథకం బోర్లా
రైతుల భూముల్లో ఉచిత బోర్ల తవ్వకాలు అంతంతే
తవ్విన చోట విద్యుత్తు సదుపాయం అరకొర
ఈనాడు, అమరావతి: రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వి మోటార్ ఏర్పాటు చేసే ‘వైఎస్ఆర్ జలకళ పథకం’ అమలు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 2 లక్షల బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేస్తామని 2020 సెప్టెంబరులో పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,940 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,10,786 మంది రైతులు దరఖాస్తులు చేశారు. వీటిలో నుంచి 1,74,931 మంది అర్హులుగా అధికారులు గుర్తించారు.
20 నెలల్లో తవ్వింది 12,567 బోర్లే!
పథకాన్ని ప్రారంభించాక గత 20 నెలల వ్యవధిలో 12,567 బోర్లే తవ్వారు. లక్ష్యం ప్రకారమైతే ఈపాటికే 50 వేలకుపైగా బోర్లు తవ్వాలి. తొలి ఏడాది పనులు జోరుగా సాగినా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు కొన్నాళ్లు పనులు నిలిపివేశారు. గతంలో నిత్యం 40 నుంచి 50 బోర్లు తవ్విన సందర్భాలున్నాయి. ఇప్పుడు 10-15 తవ్వడం గగనమవుతోంది.
బోరు వేసేందుకు అడుగుకు రూ.112 నుంచి రూ.145 వరకు చెల్లించేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ గుత్తేదారులతో మొదట ఒప్పందం చేసుకుంది. అప్పట్లో రూ.87 ఉన్న డీజిల్ లీటర్ ధర.. ప్రస్తుతం రూ.100కి చేరుకుంది. దీంతో అడుగుకి రూ.160 చొప్పున చెల్లించాలని గుత్తేదారులు డిమాండ్ చేస్తున్నారు.
329 బోర్లకే విద్యుత్తు సదుపాయం
బోర్లు తవ్విన వాటిలో ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా విద్యుత్తు సదుపాయం కల్పించాలన్నది ఉద్దేశం. రాష్ట్రంలో ఇప్పటివరకు తవ్విన మొత్తం బోర్లలో 7,425 మంది రైతులు విద్యుత్తు సదుపాయం పొందేందుకు అర్హులని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు గుర్తించి ఆ జాబితాలను విద్యుత్తు పంపిణీ సంస్థలకు పంపారు. వీటిలో గత ఆరేడు నెలల వ్యవధిలో 329 బోర్లకే విద్యుత్తు సదుపాయం కల్పించారు. కృష్ణా, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఇలాంటి బోర్లు పదిలోపే ఉన్నాయి. విద్యుత్తు స్తంభాలు, కండక్టర్, ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్తు పంపిణీ సంస్థలు సమకూర్చి పనులు పూర్తి చేస్తే.. తరువాత నిధులు సమకూర్చాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. దీంతో పలు పంపిణీ సంస్థల పరిధిలో ఈ పనుల నిర్వహణకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agnipath: ఆర్మీ, నేవీలో ‘అగ్నిపథ్’ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయ్..!
-
General News
HMDA: హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం... తొర్రూరులో గజం రూ.35,550
-
General News
Telangana News: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
-
Business News
Whatsapp accounts: మే నెలలో 19 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్
-
Movies News
Shruti Haasan:పెళ్లిపై స్పందించిన శ్రుతి హాసన్.. ఈసారి ఏమన్నారంటే?
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి