నవంబరు 19, 20 తేదీల్లో గుంటూరులో ఏఐకెఎస్‌ సమావేశాలు

అఖిలభారత కిసాన్‌ సభ (ఏఐకెఎస్‌) జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు నవంబరు 19, 20 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య, ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు వెల్లడించారు.

Published : 07 Oct 2022 02:45 IST

గుంటూరు(నెహ్రూనగర్‌), న్యూస్‌టుడే: అఖిలభారత కిసాన్‌ సభ (ఏఐకెఎస్‌) జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు నవంబరు 19, 20 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య, ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు వెల్లడించారు. గురువారం గుంటూరులో సంఘం జిల్లా అధ్యక్షులు శివశంకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షులుగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు, అధ్యక్షులుగా ఆచార్యులు వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శిగా అజయ్‌కుమార్‌, కార్యదర్శిగా శివశంకర్‌, ఉపాధ్యక్షులుగా పాశం రామారావుతోపాటు మరో 40 మందితో కమిటీని ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని