వృద్ధాశ్రమానికి రామోజీ ఫౌండేషన్‌ చేయూత

చిత్తూరు జిల్లా పుంగనూరులోని తెలుగుతల్లి వృద్ధాశ్రమానికి రామోజీ ఫౌండేషన్‌ రూ.20 లక్షల గృహోపకరణాలు, ఇతర సామగ్రిని శుక్రవారం వితరణగా అందజేసింది.

Published : 26 Nov 2022 04:41 IST

రూ.20 లక్షల సామగ్రి వితరణ

పుంగనూరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పుంగనూరులోని తెలుగుతల్లి వృద్ధాశ్రమానికి రామోజీ ఫౌండేషన్‌ రూ.20 లక్షల గృహోపకరణాలు, ఇతర సామగ్రిని శుక్రవారం వితరణగా అందజేసింది. రెండు గదులను బాగుచేసి టైల్స్‌తో తీర్చిదిద్దింది. ఆశ్రమానికి అవసరమైన మంచాలు, పరుపులు, వాటర్‌ఫిల్టర్‌, ఫ్రిజ్‌, వాషింగ్‌మిషన్‌, నీటిని తోడే మోటారు, ఇన్వర్టర్లు, కుర్చీలు, డైనింగ్‌ టేబుళ్లు, దుప్పట్లు, భోజనం ప్లేట్లు, గ్లాసులు, బీరువాలు, టీవీ, ఇతర పరికరాలను ఆశ్రమ నిర్వాహకులు రేవతి, నటరాజకు ‘ఈనాడు’ తిరుపతి యూనిట్‌ ఇన్‌ఛార్జి బి.చంద్రశేఖర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈనాడు-ఈటీవీ’ సంస్థల అధినేత రామోజీరావు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘రామోజీ ఫౌండేషన్‌’ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం స్టోర్‌ రూంను విశ్రాంత వైద్యాధికారి, రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షురాలు డాక్టర్‌ విజయకుమారి ప్రారంభించారు. రామోజీ ఫౌండేషన్‌ సేవలను వక్తలు కొనియాడారు. ఆశ్రమ నిర్వాహకులు రేవతి, నటరాజలను.. పలువురు అభినందించారు. ఆశ్రమంలో ఫౌండేషన్‌ ద్వారా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు