Margadarsi: మార్గదర్శిపై మరో పెద్ద కుట్ర
మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై నిరాధార, ఊహాజనిత, కల్పిత, తర్కం లేని ఆరోపణలతో సీఐడీ కేసులు నమోదు చేసి వేధిస్తున్న జగన్ ప్రభుత్వం... కక్షసాధింపు కోసం తాజాగా మరో కుట్రకు తెరలేపింది.
ష్యూరిటీలు సమర్పించని చందాదారు ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పోలీసుల కేసు
చిట్ పాడుకుని సరైన ష్యూరిటీలు సమర్పించని ముష్టి శ్రీనివాస్
నాలుగుసార్లు లేఖలు రాసినా స్పందించని వ్యక్తిని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపులు
ఈనాడు - అమరావతి
మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై నిరాధార, ఊహాజనిత, కల్పిత, తర్కం లేని ఆరోపణలతో సీఐడీ కేసులు నమోదు చేసి వేధిస్తున్న జగన్ ప్రభుత్వం... కక్షసాధింపు కోసం తాజాగా మరో కుట్రకు తెరలేపింది. మార్గదర్శి చిట్ఫండ్పై చందాదారుల్లో ఉన్న అచంచల విశ్వాసాన్ని నాశనం చేయాలని ఇంకో ప్రయత్నం చేసింది. అన్ని రకాల చట్టాలు, నియమ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ 60 ఏళ్లుగా ఆర్థిక క్రమశిక్షణ, స్థిరత్వం, అద్భుతమైన ట్రాక్ రికార్డుతో సాగిస్తున్న వ్యాపారాన్ని జరగనీయకుండా చూడాలన్న దురుద్దేశంతో వ్యవహరిస్తోంది. సక్రమంగా వాయిదాలు చెల్లించని, అర్హమైన ష్యూరిటీలు సమర్పించని చందాదారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా... మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసేలా బురద చల్లటమే లక్ష్యంగా.. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సివిల్ పోలీసులతో కేసు నమోదు చేయించింది. ఈ కేసులో ఫిర్యాదుదారైన ముష్టి శ్రీనివాస్... చిట్ పాడుకున్నా ఆ ప్రైజ్మనీ పొందేందుకు చట్ట నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన అర్హమైన ష్యూరిటీలు మార్గదర్శికి ఇవ్వలేదు. యూనియన్ బ్యాంకులో కుదువ పెట్టిన ఓ ఆస్తిని ష్యూరిటీగా చూపించారు. అంతేకాదు, ఆ బ్యాంకు నుంచి ఆయన తీసుకున్న రుణం కూడా పారు బకాయి (ఎన్పీఏ)గా ఉంది. అలాంటి ష్యూరిటీ ఆధారంగా అతనికి ఏ సంస్థ అయినా ప్రైజ్మనీ ఎలా చెల్లిస్తుంది? ప్రైజ్మనీ తీసుకున్న తర్వాత అతను నెలనెలా చందా సొమ్ము కట్టకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? అలా చేస్తే సంస్థ మనుగడ సాధ్యపడుతుందా? ఆ చిట్ గ్రూపులోని మిగతా చందాదారుల ప్రయోజనాలు ఏం కావాలి? వారి ప్రయోజనాలు పరిరక్షించాల్సిన బాధ్యత మార్గదర్శిపైన ఉంటుంది కదా! కానీ మార్గదర్శిని వేధించటం, వ్యాపారాన్ని దెబ్బతీయమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే విజయవాడ నగర పోలీసులకు మాత్రం ఇవేవీ పట్టలేదు.
అర్హమైన ష్యూరిటీలు సమర్పించని చందాదారు ఫిర్యాదివ్వటమే తరువాయి..
చందాదారుల ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు మార్గదర్శి పాటుపడుతుంటే.. అర్హమైన ష్యూరిటీలు సమర్పించని చందాదారు అలా ఫిర్యాదు ఇవ్వటమే తరువాయి.. అందులో నిజానిజాలేంటో పరిగణనలోకి తీసుకోకుండానే దాని ఆధారంగా విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసేశారు. ఆ వెనువెంటనే ఏదో ఉగ్రవాదిని పట్టుకుంటున్నట్లుగా లబ్బీపేట బ్రాంచి మార్గదర్శి మేనేజర్ బి.శ్రీనివాసరావు ఇంటికి మఫ్టీలో వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అసలు వచ్చినవాళ్లు ఎవరు.. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారనే కనీస సమాచారం ఇవ్వలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు మాత్రలు వేసుకునే అవకాశం సైతం ఇవ్వకుండా తమతో తీసుకెళ్లారు. ఆయనపట్ల దురుసుగా, దౌర్జన్యంగా వ్యవహరించారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో విజయవాడ సీపీ కాంతిరాణా టాటా విలేకర్ల సమావేశంలో చెప్పేవరకూ ఆయన్ను ఎవరు, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు ఇవ్వగానే ఒక ఐజీ స్థాయి అధికారి ఏదో అంతర్జాతీయ కుట్రను ఛేదిస్తున్నంత స్థాయిలో ఫిర్యాదుదారుడిని పక్కన కూర్చోబెట్టుకుని మరీ ప్రెస్మీట్ పెట్టారు. అంతేకాదు, తొలుత ప్రెస్మీట్ ఉందని చెప్పి, ఆ తర్వాత లేదని.. రద్దయిందని మెసేజిలు పెడుతూ దోబూచులాడారు. ఈలోపు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయటం, వాంగ్మూలాలు నమోదు చేసుకోవటం, చిట్ రిజిస్ట్రార్కు లేఖ రాయటం.. ఇలా అన్నీ ఒకే రోజు గంటల వ్యవధిలో యుద్ధప్రాతిపదికన చేసేశారు. అంతా ముందస్తు ప్రణాళికతో ఉన్నట్లుగా వ్యవహరించారు.
సీపీ ఆరోపణలు సత్యదూరం
ఈ చిట్ గ్రూపులో మొత్తం 50 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా, 30 మందే ఉన్నారని ప్రెస్మీట్లో విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా ఆరోపించారు. అది పూర్తి సత్యదూరమని మార్గదర్శి సంస్థ పేర్కొంది.
తగిన ష్యూరిటీ సమర్పించకపోవటం వల్లే
ముష్టి శ్రీనివాస్ విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచిలో సీటీ20వీపీ.3 నంబరు చిట్లో చేరారు. అది రూ.50 లక్షల విలువైన చిట్. 2023 మార్చి 26న ఆయన చిట్ పాడుకున్నారు. మర్నాడే ఆయనకు ష్యూరిటీ దరఖాస్తుతో పాటు ఇంటిమేషన్ లెటర్ను కూడా మార్గదర్శి సంస్థ పోస్టులో పంపించింది. కానీ అతను మాత్రం ఆ ష్యూరిటీ దరఖాస్తు తిరిగి పంపలేదు. దీంతో ఏప్రిల్ 11న మార్గదర్శి బ్రాంచి సిబ్బంది అతనికి రిమైండర్ పంపించారు. దానికీ స్పందన లేకపోవటంతో ఏప్రిల్ 27న మరోసారి అతనికి పోస్టు ద్వారా దరఖాస్తు పంపించారు. దానికి స్పందించిన ముష్టి శ్రీనివాస్ మే 13న లబ్బీపేట బ్రాంచికి వెళ్లి ఓ ఇంటిని ష్యూరిటీగా చూపనున్నట్లు పేర్కొంటూ మేనేజర్కు లేఖ సమర్పించారు. అయితే ఆ ఆస్తి యూనియన్ బ్యాంకు గవర్నర్పేట బ్రాంచ్లో కుదువ పెట్టి ఉండటంతో వేరే ఆస్తి పత్రాలు సమర్పించాలని లబ్బీపేట బ్రాంచి మేనేజర్ కోరగా... ముష్టి శ్రీనివాస్ అవేవీ సమర్పించలేదు. మే 16న మరోసారి అతనికి రిమైండర్ పంపించినా స్పందన లేదు. దీంతో ఫ్యూచర్ లయబిలిటీ కింద ఆస్తిని మార్ట్గేజ్ చేసేందుకు వీలుగా న్యాయసలహా తీసుకుని ఆస్తికి సంబంధించిన ఏయే పత్రాలు అవసరమో పేర్కొంటూ జూన్ 9న మరోసారి లేఖ పంపించారు. దీనికి ముష్టి శ్రీనివాస్ స్పందిస్తూ తన ఆస్తి విలువ రూ.3 కోట్లని, మార్గదర్శికి తానున్న ఫ్యూచర్ లయబిలిటీ రూ.50 లక్షలేనని, అందుకే యూనియన్ బ్యాంకు నుంచి ఎన్వోసీ సమర్పిస్తానని సమాధానమిచ్చారు. దీంతో జూన్ 12న మార్గదర్శి ప్రతినిధి ఒకరు ముష్టి శ్రీనివాసరావు కార్యాలయానికి వెళ్లి, అతని నుంచి ష్యూరిటీ దరఖాస్తును తీసుకుని, తమ కార్పొరేట్ కార్యాలయానికి పంపించారు. ఆ ఆస్తి పత్రాలపై మార్గదర్శి కార్పొరేట్ కార్యాలయం న్యాయసలహా తీసుకోగా... ‘‘ష్యూరిటీగా చూపించిన ఆస్తి ఎన్పీఏ కింద ఉండటం, వన్టైమ్ సెటిల్మెంట్ ఖరారు కాకపోవటంతో ఆ ఆస్తి కోర్టు కేసుల్లో పడే అవకాశం ఉంది. అందుకే దాన్ని ష్యూరిటీగా తీసుకోవటం సరికాదు’’ అని న్యాయవాది సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చట్టప్రకారం ముష్టి శ్రీనివాస్ పాడుకున్న చిట్ మొత్తాన్ని మార్గదర్శి రెండో ఖాతాలోకి పంపించింది. ఆయన ష్యూరిటీలు సమర్పిస్తే ఆ ప్రైజ్మనీని ఆయనకు చెల్లిస్తుంది. ఇక్కడ మార్గదర్శి పూర్తిగా చట్టప్రకారం, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించింది. పోలీసులు మాత్రం కక్ష సాధింపుతో కేసు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు.