CBSE: సీబీఎస్ఈ పాయే.. ఐబీ వచ్చే!
రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 24.3% మంది ‘క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్, బస్’ తదితర ఆంగ్ల పదాలను చదవలేకపోతున్నట్లు అసర్ సర్వే బహిర్గతం చేసింది.
ప్రాథమిక స్థాయిలోనే అంతర్జాతీయ సిలబస్
వచ్చే ఏడాది నుంచే అమలుకు చర్యలు
17న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
విద్యార్థుల ప్రమాణాలు విస్మరించి, రెండేళ్లకే పాఠ్య ప్రణాళిక మార్పు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 24.3% మంది ‘క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్, బస్’ తదితర ఆంగ్ల పదాలను చదవలేకపోతున్నట్లు అసర్ సర్వే బహిర్గతం చేసింది. పరిస్థితి ఇలా ఉంటే సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ అంటూ సీఎం జగన్ గొప్పలకు పోతున్నారు. సోమవారం విద్యాశాఖపై సమీక్షిస్తూ, రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలు దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఐబీ సిలబస్ను ఎల్కేజీ, యూకేజీ నుంచే అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే, ఆచరణలో అనేక చిక్కులు ఎదురవుతాయని విద్యావర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అశాస్త్రీయ విధానాలతో పాఠశాల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. విద్యార్థుల అభ్యసనం, వారి మానసిక పరిణతి, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పట్టించుకోకుండా సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక తొలుత రాష్ట్ర సిలబస్లోని పుస్తకాలను మార్చారు. 2022-23 నుంచి సీబీఎస్ఈ సిలబస్ను తెచ్చారు. దీన్ని ఈ ఏడాది తొమ్మిదో తరగతి వరకు పొడిగించారు. గతేడాది వెయ్యి పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు లభించింది. రెండేళ్లైనా పూర్తికాలేదు అంతలోనే, ఇంటర్నేషనల్ బాకలారియెట్(ఐబీ) సిలబస్ అమలుపై ఈనెల 17న ఒప్పందం చేసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఐదో తరగతి వరకు వచ్చే ఏడాది ఐబీ సిలబస్ తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఐదో తరగతి వరకు సీబీఎస్ఈ చదివిన వారు ఐబీలోకి మారాల్సి ఉంటుంది. తదనుగుణంగా పాఠ్యపుస్తకాలను కొత్తగా ముద్రించాలి. ఈ ఏడాది మిగిలిన కోట్ల పుస్తకాలు నిరుపయోగంగా మారతాయి. 4-9 తరగతుల విద్యార్థులకు ఇచ్చిన బైజూస్ కంటెంట్ కూడా మూలన పడనుంది.
వీటిని పట్టించుకోరా?
ఐబీ సిలబస్ను పూర్వ ప్రాథమిక విద్య (ఎల్కేజీ, యూకేజీ) నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్య లేదు. అంగన్వాడీల్లోనే బోధిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లను పదో తరగతి అర్హతతో నియమించారు. వీరు ఐబీ సిలబస్ ప్రమాణాలను అందుకొని, బోధించగలరా? బోధనతోపాటు ఇతర విధులను సమన్వయం చేసుకోగలరా? అన్నవి ప్రశ్నలు.
- పాఠశాలల ఉపాధ్యాయులకు ఇటీవల సీబీఎస్ఈ సిలబస్పై శిక్షణ ఇచ్చినా, ఇంకా గాడిన పడలేదు. ఇప్పుడు ఐబీకి సన్నద్ధం కావాలంటే వారి పరిస్థితేంటి? ప్రాథమిక పాఠశాలల విలీనం కారణంగా చాలాచోట్ల 1, 2 తరగతులే మిగిలాయి. పిల్లలు తక్కువగా ఉన్నారని, 9,602 బడులను ఏకోపాధ్యాయులతో కొనసాగిస్తున్నారు. ఒకే గదిలో అన్ని తరగతులకు కలిపి ఐబీ బోధన సాధ్యమా? నియామకాలు లేకపోవడంతో చాలాచోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. రెండేసి తరగతులకు ఒక టీచర్ ఐబీ సిలబస్ ఎలా బోధిస్తారో ప్రభుత్వమే చెప్పాలి.
మనవాళ్లకు ఐఐటీల్లో సీట్లు వద్దా?
ఐఐటీ, నిట్, ట్రిపుల్ఐటీ, వైద్య విద్య ప్రవేశ పరీక్షలకు ఎన్సీఈఆర్టీ సిలబస్సే ఆధారం. వీటికి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తున్నాయి. సర్కారీ బడుల్లో ఐబీ సిలబస్ తీసుకొస్తే వీరికి సీట్లు ఎలా వస్తాయన్నది ప్రశ్న. బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చారు. ఐబీ అమలుచేస్తే, బైజూస్ కంటెంట్ వృథానే కదా? కేంద్రం నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చేందుకు 33 ఏళ్లకు పైగా పట్టింది. కానీ, ఏపీ ప్రభుత్వం రెండేళ్లకోసారి పాఠ్యప్రణాళిక మార్చేస్తోంది. ఐబీ సిలబస్ విదేశాలకు వెళ్లేవారికి ఉపయోగపడొచ్చు. రాష్ట్రంలో చదువుతున్న 70లక్షల మంది విద్యార్థులో ఎంతమంది విదేశాలకు వెళ్తున్నారు? అక్కడ చదివేందుకు అయ్యే వ్యయాన్ని భరించగల సామర్థ్యం ఉన్నవారు ప్రభుత్వ బడుల్లో ఎందరుంటారు? రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ బడులకు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపునిచ్చింది. ఏటా కొన్ని స్కూళ్ల చొప్పున సీబీఎస్ఈ గుర్తింపు సాధిస్తామని చెప్పిన సీఎం.. అంతలోనే ఐబీ సిలబస్కు మళ్లడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!
-
సైబర్ మాయగాళ్ల ఉచ్చులో విశాఖ యువత.. కాంబోడియాలో నరకయాతన
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి