Kodi Kathi Case: కోడికత్తిని సమకూర్చింది బొత్స మేనల్లుడే
‘కోడికత్తి దాడి సంఘటనకు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కారణం. సంఘటన జరిగిన రోజు కోడికత్తిని తీసుకొచ్చి ఈ కేసులో సాక్షిగా ఉన్న దినేష్కుమార్కు ఆయనే ఇచ్చారు.
సాక్షి దినేష్కుమార్కు ఆయనే అందించారు..
విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయనే జగన్ రావడం లేదు.
విలేకరులతో నిందితుడు శ్రీను తరఫు న్యాయవాది వ్యాఖ్యలు
న్యాయస్థానంలో ‘కోడికత్తి’ కేసు విచారణ సెప్టెంబరు 6కు వాయిదా
ఈనాడు, ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ‘కోడికత్తి దాడి సంఘటనకు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కారణం. సంఘటన జరిగిన రోజు కోడికత్తిని తీసుకొచ్చి ఈ కేసులో సాక్షిగా ఉన్న దినేష్కుమార్కు ఆయనే ఇచ్చారు. నేరాన్ని జనపల్లి శ్రీనుపై నెట్టారు. జగన్మోహన్రెడ్డి విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయనే భయంతోనే రావడం లేదు. కేసులో కుట్ర, రాజకీయ కోణమే ఉంది’ అని నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం ఆరోపించారు. కోడికత్తి కేసుపై విశాఖ ఎన్ఐఏ న్యాయస్థానం మంగళవారం విచారించాక ఆయన బయట విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల కోసమే కేసును వాయిదాలు వేస్తూ సాగదీస్తున్నారని విమర్శించారు. ‘రావాలి జగన్.. చెప్పాలి వాదన.. ఇవ్వాలి ఎన్వోసీ.. అనేది మా వాదన. ఈ కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ చెప్పింది’ అని ఆయన వివరించారు.
జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడిపై నమోదైన కేసు విచారణ ఇన్నాళ్లు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సాగింది. అక్కడినుంచి విశాఖకు బదిలీ చేశాక తొలిసారి విచారణ జరిగింది. వాదనల అనంతరం విచారణ సెప్టెంబరు 6కు వాయిదా పడింది. కేసులో నిందితుడైన జనపల్లి శ్రీనివాసరావు (శ్రీను)ను రాజమహేంద్రవరం జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య మూడో అదనపు న్యాయస్థానంలో ఉదయం 10.45కు ఎన్ఐఏ పోలీసులు హాజరుపరిచారు. ఇప్పటివరకు విజయవాడ కోర్టులో సమర్పించిన రికార్డులను పరిశీలించి విచారణ ముందుకు తీసుకెళ్లడానికి సెప్టెంబరు 18 వరకు గడువునివ్వాలని ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధిరాములు న్యాయస్థానాన్ని కోరారు.
పరిశీలనకు అంత సమయం అవసరం లేదంటూ సెప్టెంబరు 6కు న్యాయమూర్తి మురళీకృష్ణ వాయిదా వేశారు. అదే రోజు నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై వాదనలు వినే అవకాశాలున్నాయి. విచారణ వాయిదా వేశాక శ్రీనివాసరావును విశాఖ జైలుకు పంపిస్తారని తొలుత అందరూ భావించగా, తిరిగి రాజమహేంద్రవరం కారాగారానికే తరలించారు. రాజమహేంద్రవరం, విశాఖ ఏ జైలైనా ఫర్వాలేదు.. న్యాయం జరిగితే చాలంటూ నిందితుడు శ్రీను మీడియా ఎదుట మాట్లాడారు. శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజులు మంగళవారం ఉదయమే కోర్టుకు చేరుకున్నారు. శ్రీనుతో తల్లి చాలాసేపు మాట్లాడారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
విదసం నాయకుల గృహనిర్బంధం
‘ముఖ్యమంత్రి గారూ.. కోడి కత్తి కేసులో కోర్టుకు రండి.. ఎన్వోసీ ఇవ్వండి’ అనే డిమాండ్తో వివిధ దళిత సంఘాలు (విదసం) ఐక్య వేదిక విశాఖలోని జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు సమాయత్తమైంది. ధర్నాకు పోలీసులు ఇచ్చిన అనుమతి రద్దు చేయడంతోపాటు సోమవారం అర్ధరాత్రి నుంచి విదసం నాయకులను గృహనిర్బంధం చేశారు. తమను నిర్బంధించడం దారుణమని విదసం ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మండిపడ్డారు.
చనిపోదామనుకున్నా
- సావిత్రి, శ్రీను తల్లి
ఎంతో కష్టపడి వాయిదాలకు వస్తున్నాం. ముఖ్యమంత్రి వస్తే ఒక నమస్కారం చేసి ఇక్కడే చనిపోవాలనుకున్నా. ఇన్నేళ్లుగా ఎందుకు తిప్పిస్తున్నారు? ఆరోగ్యం సహకరించకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చా. నా కొడుకును ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఐదేళ్లయినా ఎటూ తేలడం లేదు. సీఎం ఒక్కసారైనా రావాలి కదా! నన్ను పొడిచాడనో, లేదనో.. ఏదో ఒకటి చెప్పాలి. ఠాణేలంక పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తే పోలీసులు గృహనిర్బంధం చేశారు. కోర్టులు మారుతున్నాయే తప్ప న్యాయం జరగడం లేదు.
న్యాయం కోసం భిక్షాటన చేస్తాం
- సుబ్బరాజు, శ్రీను సోదరుడు
ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు రావాలని గతంలో సీఎంవో నుంచి ఫోన్ వస్తే ఆశగా వెళ్లాం. ఆయనకు తీరిక లేదని, మరోసారి పిలుస్తామని చెప్పడంతో తిరిగి వచ్చేశాం. నాలుగేళ్లుగా మా సోదరుడు జైల్లో మగ్గుతున్నాడు. ముఖ్యమంత్రి వస్తేనే కేసు పరిష్కారమవుతుంది. ఇప్పటికైనా ఎన్వోసీ ఇప్పించాలి. ఈ కేసులో చట్టప్రకారం మూడున్నరేళ్ల శిక్ష పడే అవకాశముంది. కానీ.. ఐదేళ్లుగా కఠిన జైలు జీవితం గడుపుతున్నాడు. దళిత, నిరుపేదలమైన మాకు న్యాయం జరగడం లేదు. బతకలేకపోతున్నాం. న్యాయం కోసం రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తాం. ప్రతి జిల్లాలో దళిత నాయకులు మాకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!