ఇంతకంటే.. విఫల సీఎం ‘కలరా’!
నా అక్కచెల్లెళ్లారా... నా అన్నదమ్ముల్లారా... మీ జగనన్న పాలనలో... తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు... చిత్తూరు నుంచి కర్నూలు వరకు... మన మార్కు కనిపిస్తోందంటూ పదేపదే బాకా ఊదుతున్నారు!
తాగునీటి స్వచ్ఛత మరచిన వైకాపా సర్కారు
ఏడాది పొడవునా ప్రజల్ని పిండేస్తున్న అతిసార
తాజాగా గుంటూరులో కలరా కేసులు బహిర్గతం
నా అక్కచెల్లెళ్లారా...
నా అన్నదమ్ముల్లారా...
మీ జగనన్న పాలనలో...
తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు...
చిత్తూరు నుంచి కర్నూలు వరకు...
మన మార్కు కనిపిస్తోందంటూ పదేపదే బాకా ఊదుతున్నారు!
అవును నిజమే...
జగన్ ఐదేళ్ల పాలన ఫలితంగా...
పైపుల్లో శుద్ధమైన తాగునీరు... మచ్చుకైనా రావడంలేదు!
వానలప్పుడు మాత్రమే పలకరించే...
అతిసార ఇక్కడే తిష్ఠ వేసింది!
ఎప్పుడో కానీ బాధించని...
వాంతులు, విరేచనాలు ఏడాదంతా పీడిస్తున్నాయి!
దాదాపుగా వెళ్లిపోయిందనుకున్న ‘కలరా’ మళ్లీ కనిపించింది!
మొత్తానికి ప్రజారోగ్యం గాలిలో దీపమైంది...! ఇదేనా జగన్ మీ మార్కు పాలన?
మనిషి జీవించేందుకు నీరు ఎంత అవసరమో... దాని నాణ్యత అంతకంటే ముఖ్యం. స్వచ్ఛమైన తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కు. కనీస అవసరాల్లో అత్యంత కీలకమైన శుద్ధి చేసిన తాగునీటిని ప్రజలకు అందించడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా కలుషిత నీటిని తాగుతూ అన్ని ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అతిసార కారణంగా మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సంఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం, తర్వాత తనదైన శైలిలో మొద్దు నిద్రపోవడం మినహా శాశ్వత ప్రతిపాదికన చర్యలు తీసుకోవడాన్ని జగన్ ప్రభుత్వం మానేసింది. పైగా నీటి నమూనాల పరీక్షల ఫలితాలను సైతం పూర్తిస్థాయిలో వెల్లడించకుండా దాపరికాన్ని ప్రదర్శిస్తోంది. ఫిబ్రవరిలో గుంటూరు నగరంలో అతిసారతో ముగ్గురు మృతి చెందడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వాంతులు, విరేచనాలతో వందల మంది చికిత్స పొందారు. 345 మంది బాధితుల మల నమూనాలను పరీక్షిస్తే... ముగ్గురికి కలరా సోకినట్లు తేలడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిగా పదేళ్ల క్రితం అంటే 2014 సంవత్సరంలో కలరా కేసు నమోదైంది. అందరూ మరచిపోతున్న తరుణంలో గుంటూరులో కలరా వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ విషయాన్ని బయటకు రానీయకుండా వైకాపా ప్రభుత్వం జాగ్రత్త పడుతుండటం గమనార్హం.
‘జల్జీవన్’ సర్వేలో డొల్లతనం వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగుల పరీవాహకాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అనంతపురం, కడప, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతి, విజయనగరం తదితర నగరాల్లో ఇళ్ల నుంచి వచ్చే మురుగును, మానవ వ్యర్థాలను నామమాత్రంగా శుద్ధి చేస్తున్నారు. చాలాభాగం నేరుగా నదుల్లో కలిపేస్తున్నారు. ఈ కారణంగానే... గతంలో వర్షాకాలం ఆరంభంలో మాత్రమే వెలుగు చూసే అతిసార కేసులు ప్రస్తుతం ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో సరఫరా చేస్తున్న తాగునీటిలో 35% కలుషితమవుతోందని, పైపుల లీకేజీలు, నిర్వహణ లోపాలు ఇందుకు కారణమని జల్జీవన్ మిషన్ అధ్యయనంలో తేలింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2022 ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్ 25 వరకు పది బృందాలు 58 రోజులపాటు అధ్యయనం చేశాయి. పైపులైన్లలో 30% లీకేజీలు ఉన్నట్లు గుర్తించాయి. రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు నిధుల కొరత 40%ఉందని, కొన్ని పథకాల అమలులో 30% వరకు మానవ వనరుల కొరత ఉందని పేర్కొ న్నాయి.
కీలక శాఖల మధ్య సమన్వయం కరవు
గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి పైపులు లీకవుతున్నా, మురుగు నిలిచి దోమలు పెరుగుతున్నా ఆశా, ఆరోగ్య కార్యకర్తలు... పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, రెండు శాఖల మధ్య
సమన్వయం ఉండడంలేదు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించాలని చెబుతున్నా కాగితాలకే పరిమితం అవుతోంది.
అనుమతులు లేని ఆర్వో ప్లాంట్లతోనూ ముప్పు
గ్రామాల నుంచి పట్టణాల వరకు అత్యధికులు ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి మినరల్ వాటర్ను కొంటున్నారు. వీటిని నడిపే వారు భూగర్భ జల వనరులు, స్థానిక సంస్థలు, తూనికలు, కొలతల శాఖ, జీఎస్టీ, విద్యుత్తు, వైద్యారోగ్య శాఖల నుంచి అనుమతులు పొందాలి. కానీ ఇవేమీ జరగడంలేదు. ఎవరికి తోచినట్లు వారు ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. నీటి నాణ్యతపై ఏ దశలోనూ తనిఖీలు జరగడంలేదు.
ఘోరంగా నీటి పరీక్షల కేంద్రాల నిర్వహణ
తాగునీటి నమూనాలను గ్రామాల్లో... గ్రామీణ నీటి పారుదల శాఖ వారు, పట్టణాల్లో... ప్రజారోగ్య శాఖ అధికారులు కనీసం రెండు వారాలకోసారి తప్పనిసరిగా సేకరించాలి. కానీ... ఇది ఆచరణలో జరగడంలేదు. నీటిలో ఫ్లోరైడ్, కాల్షియం, ఫాస్పరస్ తదితరాల మోతాదును తెలుసుకోవడానికి, ఇతర పరీక్షలు చేసేందుకు అవసరమైన రసాయనాల కొనుగోలుకు నిధులను సకాలంలో ఇవ్వడంలేదు. రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ, జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాలలు, నీటి పరీక్షల కేంద్రాలు మొత్తంగా 11 నడుస్తున్నాయి. వీటిల్లో 143 పోస్టులకుగానూ 35 మందే పనిచేస్తుండటంతో నిర్వహణ ఘోరంగా తయారైంది.
- నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పలుకూరులో 2023 జూన్లో అతిసారతో 50 మంది, అదే ఏడాది నవంబరులో కర్నూలు జిల్లా కల్లూరు పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో 70 మంది, చిత్తూరు సమీపంలోని తుమ్మిందలో 16 మంది, విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలోని ఎం.గుమడాంలో పది మంది ఆసుపత్రుల పాలయ్యారు.
- కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు గ్రామంలో 2022 మేలో 15 మంది అతిసార బారినపడ్డారు. చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు ప్రాణం విడిచారు. అదే ఏడాది మేలో కాకినాడ పదో డివిజన్ దుమ్ములపేటలో 20 మంది డయేరియాతో బాధపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం మూలగరువులో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. జూన్లో చిత్తూరు జిల్లా బాలాయపల్లి మండలం అక్కసముద్రంలోనూ పలువురు అతిసార బారిననపడ్డారు.
- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలో 2023 ఆగస్టులో డయేరియాతో ముగ్గురు వలస కార్మికులు మృతిచెందారు. ఇదే జిల్లా అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో 2022 జులైలో పది మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
- విజయవాడ గన్నవరం సమీపంలో 2022 జులైలో అతిసార సోకి ముగ్గురు మృతిచెందగా 50 మంది అనారోగ్యం పాలయ్యారు.
- నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇసుకపాళెంలో 2023 జులైలో వాంతులు, విరేచనాలతో 32 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ వారిలో నలుగురు ప్రాణాలు విడిచారు.
- విజయనగరం జిల్లా డెంకాడ మండలం పినతాడివాడ, గునుపూరు గ్రామాల్లో 2023 సెప్టెంబరులో 40 మంది కలుషిత నీటి కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఇదే జిల్లా గంట్యాడ మండలం లక్కిడాంలో 2022 జులైలో 40 మందికిపైగా అతిసార బారినపడ్డారు.
- నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పగిడ్యాల, బీరవోలు, ఆంజనేయనగర్లలో 2023 నవంబరులో 100 మంది అతిసారతో ఆసుపత్రుల్లో చేరారు.
- గుంటూరు జిల్లా మంగళగిరి నగర పాలిక పరిధిలోని 12వ సచివాలయ పరిధిలో రంగుమారిన నీరు కారణంగా పలువురు వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
కిర్గిజ్స్థాన్లో దాడులు.. ఇక్కడి తల్లిదండ్రుల్లో ఆందోళన
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్స్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
సిట్ పర్యటన వేళ పల్నాడులో కేసులు
పోలింగ్ నేపథ్యంలో జరిగిన గొడవలు, దాడుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న వేళ.. పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. -
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ పోయొద్దు
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపవద్దని పెట్రోలు బంకుల యాజమాన్యాలను జిల్లాల ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జూన్ 10 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, వాహనాలకు మాత్రమే వాటిని నింపాలని కలెక్టర్(పౌరసరఫరాలు) పేరుతో నోటీసులు పంపారు. -
ఎన్ని కేసులు పెట్టారు.. ఎంతమందిని అరెస్టు చేశారు?
-
5 రోజుల్లో రూ.7,546 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఫైనాన్స్ కోడ్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
భయపెడుతున్న రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు రూ.55 లక్షల జరిమానా
బోధన నిపుణుల కొరత, ఇతర లోపాల కారణంగా రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) జరిమానాలు విధించింది. ఎంబీబీఎస్ సీట్లు, ఇతరత్ర వాటి గుర్తింపు పునరుద్ధరణకు కళాశాలల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఎన్ఎంసీ అధికారులు పలు లోపాలు గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!