YS Sowbhagyamma: ఇంటి శత్రువును ఆలస్యంగా గుర్తించాం
‘వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటెయ్యొద్దన్న నా కుమార్తె సునీత పిలుపుతో నేనూ ఏకీభవిస్తున్నా. ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు నేనూ పిలుపునిస్తున్నా.
నా భర్త హంతకుల్ని జగన్ కాపాడుతున్నారు
వివేకా హత్య గురించి జగన్కు ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదు?
న్యాయం కోసం వెళితే నా కుమార్తె, అల్లుడిపైనే నేరం మోపాలనుకున్నారు
జగన్ సహకరించరని తెలిశాకే... నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తోంది
జగన్కు ఓటెయ్యొద్దని నేనూ పిలుపునిస్తున్నా
‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ
ఈనాడు - కడప
‘వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటెయ్యొద్దన్న నా కుమార్తె సునీత పిలుపుతో నేనూ ఏకీభవిస్తున్నా. ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు నేనూ పిలుపునిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోంది’ అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పేర్కొన్నారు. ‘నా భర్త హంతకుల్ని ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. వివేకా హత్య గురించి బాహ్యప్రపంచాని కంటే ముందే జగన్కు, ఆయన సతీమణి భారతికి తెలుసన్న అనుమానం ఉంది’ అని ఆమె తెలిపారు. వివేకా హత్య విషయం తెల్లవారుజామునే జగన్కు తెలిసినా సాయంత్రం వరకు పులివెందుల ఎందుకు రాలేదని
ప్రశ్నించారు.
వాళ్ల దగ్గర అధికారం ఉంది కాబట్టే ఎంపీ అవినాష్రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని, న్యాయం జరగకుండా తొక్కిపెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘జగన్ సీఎం అయ్యాక న్యాయం కోసం మా కుటుంబమంతా జగన్ వద్దకు వెళ్లింది. కానీ ఆయన మాతో విడిగా మాట్లాడకుండా, ఇతరుల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడారు. నా కుమార్తె, అల్లుడిపైనే వేలు చూపించారు. శత్రువులు మా ఇంట్లోనే ఉన్నారని ఆలస్యంగా గ్రహించాం. అక్కడి నుంచి వచ్చేసి ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నాం’ అని తెలిపారు. వివేకా హత్య జరిగి అయిదేళ్లయినా ఇప్పటి వరకు కేసు దర్యాప్తు కొలిక్కిరాకపోవడం, హంతకులకు శిక్షపడకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వివేకా అయిదో వర్ధంతి సందర్భంగా ‘ఈనాడు- ఈటీవీ’ ముఖాముఖిలో సౌభాగ్యమ్మ తన మనసులో గూడుకట్టుకున్న ఆవేదనను వెల్లడించారు.
జగన్కు ముందే ఎలా తెలుసు?
నా భర్త హత్యపై మాకు అనేక అనుమానాలున్నాయి. ఆయన హత్య విషయం జగన్కు ముందే ఎలా తెలుసు? వివేకా మరణించారన్న విషయం తెలియగానే మేమంతా హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయల్దేరి వచ్చేశాం. మరి జగన్ సాయంత్రం వరకు పులివెందుల ఎందుకు రాలేదు? ఇలాంటి ప్రవర్తనే అనేక అనుమానాలకు తావిస్తోంది.
అండగా ఉండకపోగా... ఆడపిల్లను ముప్పుతిప్పలు పెడతారా?
నా భర్తను రాజకీయ కారణాలతోనే హత్య చేశారు. తండ్రిని చంపిన హంతకుల్ని బోనులో నిలబెట్టేందుకు నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తుంటే.. జగన్ అండగా ఉండకపోగా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. పైగా నా కుమార్తె న్యాయం కోసం వెళితే అవమానకరంగా మాట్లాడారు. వివేకా హత్య విషయంలో నా కుమార్తెను, అల్లుణ్ని ఎందుకు అనుమానించకూడదన్నట్టుగా మాట్లాడారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసే చివరి క్షణంలో కూడా... హంతకులకు శిక్షపడేలా చేయడంలో సహకరించాలని జగన్ను సునీత కోరింది. కానీ అతను పట్టించుకోకుండా లెక్కలేకుండా మాట్లాడారు. మరో దారిలేక సునీత ఒంటరి పోరాటం చేస్తోంది. చివరకు న్యాయమే గెలుస్తుంది.
నా బిడ్డపైనే నేరం మోపాలనుకున్నారు
వివేకా హత్యకు కారకులెవరో తేల్చాలని సునీత పట్టుబట్టడంతో నేరాన్ని ఆమెపైనా, ఆమె భర్తపైనా నెట్టేయాలని చూశారు. నిజంగా వారే తప్పు చేసి ఉంటే మీరే విచారించి శిక్షించొచ్చు కదా!
నా బిడ్డ పోరాటం చూసి కుమిలిపోతున్నా
భర్తను కోల్పోయిన బాధ ఒకపక్క.. న్యాయం కోసం నా బిడ్డ కష్టం చూసి మరోపక్క కుమిలిపోతున్నా. ఆమె ఒంటరి పోరాటం చూసి బాధగా ఉన్నా... అతిపెద్ద శక్తులకు ఎదురొడ్డి కేసును ఇంత వరకు తెచ్చిన తెగువ, పట్టుదల చూసి గర్వపడుతున్నా. వివేకానందరెడ్డి, రాజశేఖరరెడ్డి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అన్నకు వివేకా లక్ష్మణుడిలా మెలిగేవారు. వివేకా మంచి మనిషి. మృదుస్వభావి. ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి కొందరు ఓర్చుకోలేకపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు. ఎన్నో ఇబ్బందులు పెట్టి పక్కకు తోసేయాలని భావించారు. ఆ కక్షను మేం గ్రహించలేకపోయాం. ఎన్ని విభేదాలున్నా జగన్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని వివేకా తపించారు. కానీ ఇంట్లోనే శత్రువులున్నారని ఆలస్యంగా గ్రహించాం.
వైఎస్ మరణించాకే కుట్రలు మొదలయ్యాయి
రాజశేఖరరెడ్డి ఉన్నంత వరకు మా మధ్య అనుబంధాలు బాగానే ఉన్నాయి. ఆయన మరణించాకే కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. కానీ మేం మంచిగా ఆలోచించబట్టి వాటిని గ్రహించలేకపోయాం. వాళ్లు, వీళ్లు అన్న తేడా లేకుండా మసలుకునేవాళ్లం. మాకు గ్రూపు రాజకీయాలు తెలియవు. ఇప్పుడు మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
మా ఇంట్లోనే హత్యలు జరుగుతాయని ఊహించలేదు
పూర్వం మా ప్రాంతంలో తరచూ హత్యలు, దాడుల గురించి వినేవాళ్లం. రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చాక హత్యా సంస్కృతి చాలా వరకు తగ్గి, ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ చివరకు మా ఇంట్లోనే హత్యలు జరుగుతాయని ఊహించలేదు.
మాకే ఈ పరిస్థితి ఎదురైతే.. సామాన్యుల మాటేంటి?
ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో ప్రజలు బతుకుతున్నారు. సమావేశం పెట్టుకోవడానికి మాకే పులివెందులలో కల్యాణ మండపం ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో మేం కడపకు మార్చుకోవాల్సి వచ్చింది. మా పరిస్థితే అలా ఉంటే.. ఇక సామాన్యుల మాటేంటి?
నా రాజకీయ ప్రవేశాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుంది
నేను ఏదీ కోరుకోలేదు. రాజకీయ ప్రవేశంపై సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను.
రాష్ట్రానికి మంచి పాలకుడు రావాలి
జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలని వివేకా కలలుగన్నారు. కానీ ఇలాంటి పాలన కోసం కాదు. జగన్ పాలన బాగాలేదు. ప్రజావేదిక కూల్చేసినప్పుడే ఏంటీ పరిపాలన అనుకున్నాను. వచ్చే ఎన్నికల్లోనైనా రాష్ట్రానికి మంచి నాయకుడు పాలకుడు రావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..