షర్మిల, సునీత, బీటెక్‌ రవి పిటిషన్ల కొట్టివేత

వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించి బహిరంగంగా మాట్లాడవద్దని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన మూడు వెకేషన్‌ పిటిషన్లను కొట్టివేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పారు.

Published : 09 May 2024 07:36 IST

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే: వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించి బహిరంగంగా మాట్లాడవద్దని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన మూడు వెకేషన్‌ పిటిషన్లను కొట్టివేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పారు. వివేకా హత్య కేసుపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ జిల్లా వైకాపా అధ్యక్షుడు సురేష్‌బాబు గత నెలలో కడప కోర్టులో సివిల్‌దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ కేసుకు సంబంధించి ఎవరూ మాట్లాడవద్దని ఏప్రిల్‌ 16న ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని రద్దు చేయాలని వైఎస్‌ షర్మిల, సునీత, బీటెక్‌ రవిలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా, కడప కోర్టుకే వెళ్లాలని సూచించింది. దీంతో వారు ఇక్కడ పిటిషన్లు వేశారు. విచారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఉత్తర్వులను రద్దు చేసేందుకు తగిన ఆధారాలు చూపలేదని, వాటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. పిటిషన్‌ ఖర్చుల కింద ముగ్గురూ రూ.10 వేల చొప్పున జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు