AP PRC:‘ఖజానా’లో కలవరం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. జీతాల బిల్లుల తయారీపై తమపై ఒత్తిడి తెస్తోందని ఖజానా శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. ఫిబ్రవరి 6న అర్ధరాత్రి
కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల బిల్లులు సమర్పించండి
నేటి ఉదయం 11 కల్లా మీ శాఖవి పూర్తిచేయండి
ఆర్థిక శాఖ నుంచి నిరంతర సమీక్షలు
ఆందోళనలో ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. జీతాల బిల్లుల తయారీపై తమపై ఒత్తిడి తెస్తోందని ఖజానా శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఇప్పటికే నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి.. ప్రస్తుతానికి పాత విధానంలోనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఖజానా, పే అండ్ అకౌంట్స్ విభాగాల ఉద్యోగ సంఘాలు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం తాము బిల్లులు చేయబోమని తేల్చిచెప్పాయి. అయినా ప్రభుత్వం జనవరి జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారమే చెల్లించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు అవగతమవుతోంది. ఆర్థికశాఖ ఉన్నతాధికారుల నుంచి తమ విభాగంపై నిత్యం అదేపనిగా ఒత్తిళ్లు పెరిగాయని ఖజానా ఉద్యోగుల సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు కొత్త ఉత్తర్వులు, వీడియో కాన్ఫరెన్సులు, మౌఖిక హెచ్చరికలు అందుతున్నట్లు తెలిపారు.
ఉత్తర్వుల మీద ఉత్తర్వులు
* ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సహా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఎన్ఎంఆర్, తదితర ఉద్యోగులందరికీ కొత్త వేతన స్కేళ్ల ప్రకారమే జనవరి నెల జీతాలు చెల్లించాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. అందుకు మార్గదర్శకాలను ఉటంకిస్తూ తాజాగా మంగళవారమూ ఆదేశాలు పంపించారు. సీఎఫ్ఎంఎస్లో పొందుపర్చిన విధివిధానాల ప్రకారమే బిల్లులు తయారుచేయాలని, దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
* ఖజానా శాఖ సంచాలకులు బుధవారం సబ్ ట్రెజరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ (డీడీవో)ల నుంచి ఏ మేరకు బిల్లులు వచ్చాయో ఆరా తీశారు. ఇతర ప్రభుత్వ శాఖల డీడీవోలు బిల్లులు సమర్పించని నేపథ్యంలో తొలుత ఖజానా శాఖలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.
* గురువారం ఉదయం 11 గంటలకు ఖజానా శాఖలోని ఉద్యోగులందరి జీతాల బిల్లులను కొత్త పీఆర్సీకి అనుగుణంగా అక్కడి డీడీవోలు సమర్పించాలి. సబ్ ట్రెజరీ అధికారులు వాటిని పరిశీలించి, సీఎఫ్ఎంఎస్కు సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే సీసీ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరికలు అందినట్లు ఖజానా విభాగం అధికారులు చెబుతున్నారు.
* పోలీసు శాఖకు ఇంటి అద్దె భత్యం సహా కొన్ని విషయాల్లో కొత్త పీఆర్సీ వర్తించడం లేదు. దీంతో ఆ శాఖకు సంబంధించి కొత్త పీఆర్సీ మేరకే డీడీవోలు బిల్లులు సమర్పించినట్లు తెలిసింది.
అంత సులువేమీ కాదు
కొత్త పీఆర్సీ అమల్లో భాగంగా తప్పుల్లేకుండా బిల్లులు రూపొందించాలని, డీడీవోలు పంపించిన వివరాలను ఖజానా, పే అండ్ అకౌంట్స్ విభాగాల్లోని అధికారులు సరిచూసుకొని సమర్పించాలని ఇప్పటికే ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తప్పులు జరిగితే బాధ్యత వహించడంతో పాటు చర్యలకూ సిద్ధపడాలని హెచ్చరికలు వెళ్లాయి. ‘ప్రతి ఉద్యోగి ఎస్ఆర్ను పరిశీలించాలి. ఇంక్రిమెంట్లు చేర్చడం నుంచి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని వేతన స్థిరీకరణ చేయాలి. ఇందుకు మార్చి 31 వరకు ప్రభుత్వమే గడువు ఇచ్చింది. అయినా ఆర్థిక శాఖ మమ్మల్ని తొందర పెడుతోంది. ఇంత హడావుడిగా వేతన స్థిరీకరణ చేస్తే భవిష్యత్తులో మేం ఇబ్బంది పడాల్సి వస్తుంద’ని ఖజానా విభాగం ఉద్యోగులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి