YS Jagan: జంగారెడ్డిగూడెంలో అన్నీ సహజ మరణాలే
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవన్నీ సహజ మరణాలే. దేశ, రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2 శాతంగా వేసుకున్నా అక్కడ నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాలవల్ల చనిపోతుంటారు
అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో నెలకు ఆ ఊళ్లో 90 మంది సాధారణంగానే చనిపోతుంటారు
అక్రమ మద్యంవల్ల జరిగినవే అన్నట్లు తెదేపా యాగీ చేస్తోంది
మద్యం ధరలు తగ్గించాక.. కల్తీ మద్యం ఎందుకు ప్రబలుతుంది: సీఎం జగన్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవన్నీ సహజ మరణాలే. దేశ, రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2 శాతంగా వేసుకున్నా అక్కడ నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాలవల్ల చనిపోతుంటారు. సహజ మరణాలను అక్రమ మద్యం వల్ల జరిగినవే అన్నట్లుగా తెదేపా భ్రమ కల్పిస్తోంది. ఇలాంటి అన్యాయమైన పనిని మానుకోవాలని తెదేపా సభ్యులకు సభ ద్వారా తెలియజేస్తున్నా.
- శాసనసభలో ముఖ్యమంత్రి జగన్
ఈనాడు, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవన్నీ సహజ మరణాలేనని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశ, రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2 శాతంగా వేసుకున్నా నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాలవల్ల సహజంగానే అక్కడ చనిపోతుంటారని చెప్పారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ‘జంగారెడ్డిగూడెం జనాభా 2011 లెక్కల ప్రకారం 48,994. ఈ దశాబ్ద కాలంలో 12 శాతం వృద్ధిరేటుగా తీసుకుంటే అక్కడ 54,880 మంది నివాసం ఉంటున్నారు. ఇంత పెద్ద పురపాలక సంఘంలో మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. మొత్తం పురపాలక సంఘం పరిధిలో జరిగినవి. ఈ 18 మంది సహజ మరణాలను వక్రీకరించి మాట్లాడడం మనం ఇక్కడే చూస్తున్నాం. ప్రతి నెలా 60-70 మంది గుండెపోటు, అనారోగ్యాలతో సహజంగా చనిపోతుంటారు. కల్తీ మద్యం తయారు చేసేవాళ్లకు ప్రభుత్వం ఎందుకు మద్దతిస్తుంది? కల్తీ మద్యం తయారీ ఇప్పుడు కొత్తగా జరుగుతోంది కాదు.. చంద్రబాబు హయాంలోనూ జరిగింది. అప్పుడూ ఇప్పుడూ అక్కడక్కడా జరుగుతోంది. దీన్ని నేను కాదనడం లేదు’ అని తెలిపారు.
లాభాపేక్ష వద్దనే..
‘గతంలో లాభాపేక్షతో మద్యాన్ని విచ్చలవిడిగా బెల్టు దుకాణాల ద్వారా అమ్మేవారు. బడి, గుడి పక్కన గ్రామంలో ఎక్కడపడితే అక్కడ దొరికేది. లాభాపేక్ష ఉంటే వీటిని ఆపలేమనే ఉద్దేశంతో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతోంది. గతంలో అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి, ఇష్టమొచ్చినట్లు తాగించే పరిస్థితి. ఇప్పుడు వేళలు కచ్చితంగా పాటిస్తున్నారు. నిర్ణీత సమయాల్లోనే మద్యం అందుబాటులో ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. అక్రమ మద్యం తయారీని అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ ఫోర్సును ఏర్పాటు చేసి, ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టమైన సంకేతాలిచ్చాం. మా తపనంతా మద్యం వినియోగాన్ని తగ్గించాలనే. అధికారంలోకి వచ్చిన వెంటనే 43వేల బెల్టు దుకాణాలను పూర్తిగా లేకుండా చేశాం. గతంలో 4,380 మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్లకు అనుమతిచ్చారు. అక్కడే 50-60 మంది కూర్చుని, మద్యం తాగుతుంటే.. మహిళలు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడేవారు. మనం అధికారంలోకి వచ్చాక పర్మిట్ రూమ్లను రద్దు చేశాం’ అని వెల్లడించారు. ‘వినియోగదారులకు షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంచాం. దీంతో వినియోగం తగ్గినా.. ధరలు పెంచటంతో అక్రమ మద్యం ఎక్కువగా వస్తోంది. ధరలు తగ్గిస్తేనే అక్రమ మద్యాన్ని అడ్డుకోగలమని ఎస్ఈబీ నివేదిక ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీలూ అదే చెప్పేసరికి సదుద్దేశంతో ధరలు తగ్గించాం. చంద్రబాబు హయాంలో ఉన్న ధరలే మళ్లీ తీసుకొచ్చాం. అలాంటప్పుడు కల్తీ మద్యం ఎలా ప్రబలుతుంది? కల్తీ మద్యం తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అక్రమ మద్యంపై ఎస్ఈబీ 13 వేల కేసులు నమోదు చేసింది. సహజ మరణాలను అక్రమ మద్యం వల్ల జరిగినవే అన్నట్లుగా భ్రమ కల్పిస్తూ నానారకాలుగా యాగీ చేయడం తప్పని, ఇలాంటి అన్యాయమైన పనిని మానుకోవాలని తెదేపా సభ్యులకు సభ ద్వారా తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
బాధపడకండి..ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాణ్యమైన మద్యం అందేలా చూస్తా..! నాటుసారా జోలికి పోకండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
కిర్గిజ్స్థాన్లో దాడులు.. ఇక్కడి తల్లిదండ్రుల్లో ఆందోళన
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్స్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
సిట్ పర్యటన వేళ పల్నాడులో కేసులు
పోలింగ్ నేపథ్యంలో జరిగిన గొడవలు, దాడుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న వేళ.. పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం.