Budget 2023: మోదీ సర్కారు ఆ ఐదు నిర్ణయాలపై ఆసక్తి..!
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉండటంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ప్రస్తుత ప్రభుత్వానికి లేదు. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్(Budget 2023)తోనే మోదీ సర్కారు ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐదు కీలక అంశాల్లో సర్కారు నిర్ణయాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది. భారత్ పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. దీని ప్రభావం కొంతైనా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతను మొదలుపెట్టాయి. దీంతో ప్రజల వ్యయశక్తి తగ్గి ప్రభుత్వ ఆదాయం తగ్గనుంది. ఈ క్రమంలో ఎక్కడ అభివృద్ధికి బ్రేకులు పడకుండా ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం మోదీ సర్కారుకు కత్తిమీద సాములా మారనుంది. ప్రభుత్వం వ్యయ నియంత్రణ ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా ద్రవ్యలోటు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మార్కెట్ నుంచి కేంద్రం నిధులు సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇది వడ్డీరేట్లపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపుతప్పే ప్రమాదముంది.
తక్కువ ద్రవ్యలోటు..
గోల్డ్మన్ శాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం ద్రవ్యలోటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చు. భారత్ దీనిని తన జీడీపీలో 5.9గా నిర్ధారించే అవకాశలున్నాయి. అభివృద్ధి పనులను ఆపకుండానే ఈ సారి సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామీణ పథకాలు, హౌసింగ్ పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ నిపుణులు అండ్రూ టిల్టన్, శాంతను సేన్ గుప్తా అభిప్రాయపడ్డారు.
పన్ను శ్లాబుల్లో మార్పులు..
బడ్జెట్ (Budget 2023) అనగానే మధ్య తరగతి జీవి ఆశగా ఎదురు చూసేవి పన్ను శ్లాబుల్లో మార్పులు. ప్రస్తుతం రూ.2.5లక్షల ఆదాయంపై పన్ను లేదు. 2014-15లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనలో ఇప్పటి వరకూ మార్పు లేదు. చిరు ఉద్యోగులకు పెరుగుతున్న ఖర్చులకు (ద్రవ్యోల్బణానికి) సరిపడా మాత్రమే జీతాలు పెరిగినా ఆ మేరకు పన్ను పోటు కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇంధన, ఆహారధరల్లో వృద్ధితో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో పన్ను లేని ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతుందనే అంచనాలున్నాయి.
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు..
ఆదాయపు పన్ను లెక్కింపులో కీలకమైన స్టాండర్డ్ డిడక్షన్ పరిధిపై కూడా చాలా రోజులగా అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం ఇది రూ.50,000గా ఉంది. దీనిని కనీసం రూ.లక్షకు పెంచాలన్న డిమాండ్లు బలంగా ఉన్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకొని దీనిలో ప్రభుత్వం కొంత వెసులుబాటు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
గృహ రుణ వడ్డీ చెల్లింపులపై మినహాయింపు పెంపు
గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ఇప్పటి వరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24(బీ) ప్రకారం మినహాయింపు లభిస్తుంది. దీనికి అత్యధికంగా రూ.2,00,000 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. కొవిడ్ తర్వాత మళ్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకొంది. ఇళ్ల రేట్ల ధరలు ఏటా కనీసం 3.5శాతం చొప్పున పెరిగాయి. మరో పక్క వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. కొవిడ్ సమయంలో 6.5 వద్ద ఉన్న వడ్డీ రేటు 8.5 దాటేసింది. దీంతో వినియోగదారులపై చెల్లింపుల భారం కూడా పెరిగింది. ఈ సమయంలో సెక్షన్ 24(బీ) పరిధిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది.
మౌలిక వసతులు, సంక్షేమ పథకాలకు నిధులు పెంపు..
2024 పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టే బృహత్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు ఈ బడ్జెట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. 2024లో కేవలం తాత్కాలిక బడ్జెట్ కావడంతో అప్పుడు ప్రభుత్వానికి పెద్దగా అవకాశాలు ఉండవు. దీనిని దృష్టిలో ఉంచుకొనే నయా ప్రాజెక్టుల ప్రకటనలు ఉండొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్లో మహీంద్రా వాహన అమ్మకాలు 70,471 యూనిట్లు
2024 ఏప్రిల్లో మహీంద్రా వాహన అమ్మకాలు 13 శాతం పెరిగి 70,471 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
Amazon- Flipkart: అమెజాన్, ఫ్లిప్కాట్ ఏటా వేసవిలో నిర్వహించే సేల్స్ మొదలయ్యాయి. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లపై ఓ లుక్కేయండి. -
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
Boult Soundbars: బౌల్ట్ హోమ్ ఆడియో డివైజ్ల రంగంలోకి ప్రవేశించింది. తాజాగా సౌండ్బార్లను ప్రవేశపెట్టింది. -
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128, నిఫ్టీ 37 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
Vivo V30e: మొబైల్ తయారీ కంపెనీ 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్తో కొత్త మొబైల్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
WhatsApp: ఇకపై వాట్సప్లో ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎవరెవరు వస్తారో కూడా తెలుసుకోవచ్చు. వారికి నోటిఫికేషన్ ద్వారా గుర్తు చేయొచ్చు. అందుకు అనుగుణంగా కమ్యూనిటీలో ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది వాట్సప్. -
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
ATM Scam: ఎప్పటికప్పుడు దుండగులు కొత్త రకం స్కామ్లకు తెరతీస్తున్నారు. తాజాగా ఏటీఎం మెషీన్లోని కార్డు రీడర్ను తొలగించి మోసాలకు పాల్పడుతున్నారు. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతోంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వసూళ్లలో జైఎస్టీ (జీఎస్టీ)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. -
సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM