Covaxin టీకా ధర తగ్గింపు

రాష్ట్రాలకు సరఫరా చేసే ‘కొవాగ్జిన్‌’ టీకా డోసు ధరను భారత్‌ బయోటెక్‌ తగ్గించింది. ఇంతకు ముందు ఒక్కో డోసు టీకాను రూ.600 ధరకు

Updated : 30 Apr 2021 12:14 IST

ఒక్కో డోసు రూ.400కే రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాలకు సరఫరా చేసే ‘కొవాగ్జిన్‌’ టీకా డోసు ధరను భారత్‌ బయోటెక్‌ తగ్గించింది. ఇంతకు ముందు ఒక్కో డోసు టీకాను రూ.600 ధరకు రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని రూ.400 కు తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ‘‘ప్రజారోగ్యం తీవ్రమైన సంక్షోభంలో ఉన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు టీకాను రూ.400 ధరకు సరఫరా చేయాలని నిర్ణయించాం’’ అని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొవిషీల్డ్‌ టీకాను డోసుకు రూ.400గా ప్రకటించి, తదుపరి రూ.300కు తగ్గించిన సంగతి విదితమే. కేంద్రప్రభుత్వ సంప్రదింపుల మేర కంపెనీలు టీకా ధరలను తగ్గించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని