Covaxin టీకా ధర తగ్గింపు
రాష్ట్రాలకు సరఫరా చేసే ‘కొవాగ్జిన్’ టీకా డోసు ధరను భారత్ బయోటెక్ తగ్గించింది. ఇంతకు ముందు ఒక్కో డోసు టీకాను రూ.600 ధరకు
ఒక్కో డోసు రూ.400కే రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రాలకు సరఫరా చేసే ‘కొవాగ్జిన్’ టీకా డోసు ధరను భారత్ బయోటెక్ తగ్గించింది. ఇంతకు ముందు ఒక్కో డోసు టీకాను రూ.600 ధరకు రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని రూ.400 కు తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ‘‘ప్రజారోగ్యం తీవ్రమైన సంక్షోభంలో ఉన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు టీకాను రూ.400 ధరకు సరఫరా చేయాలని నిర్ణయించాం’’ అని భారత్ బయోటెక్ ప్రకటించింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొవిషీల్డ్ టీకాను డోసుకు రూ.400గా ప్రకటించి, తదుపరి రూ.300కు తగ్గించిన సంగతి విదితమే. కేంద్రప్రభుత్వ సంప్రదింపుల మేర కంపెనీలు టీకా ధరలను తగ్గించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..