Adani Cement: అదానీ సిమెంట్ 3.5 బిలియన్ డాలర్ల లోన్ రీఫైనాన్స్
Adani Cement: ఏసీసీ, అంబుజా సిమెంట్ను కొనుగోలు కోసం తీసుకున్న రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి 10 అంతర్జాతీయ బ్యాంకులు ముందుకు వచ్చినట్లు అదానీ సిమెంట్ వెల్లడించింది.
దిల్లీ: హిండెన్బర్గ్ నివేదిక తర్వాత సడలిన ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడం కోసం అదానీ గ్రూప్ (Adani Group) అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా ఆ దిశగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 3.5 బిలియన్ డాలర్లు విలువ చేసే రుణాన్ని రీఫైనాన్స్ (Refinance) చేయడానికి అంతర్జాతీయ బ్యాంకులు అంగీకరించినట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. రీఫైనాన్స్ అంటే రుణగ్రహీతకు మరిన్ని అనుకూలమైన షరతులతో పాత రుణ స్థానంలో కొత్త రుణాన్ని ఇవ్వడం.
ఏసీసీ, అంబుజా సిమెంట్ను కొనుగోలు చేయడం కోసం అదానీ గ్రూప్ (Adani Group) వివిధ సంస్థల నుంచి రుణం తీసుకుంది. 3.5 బిలియన్ డాలర్ల ఆ రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి 10 అంతర్జాతీయ బ్యాంకులు ముందుకు వచ్చినట్లు అదానీ సిమెంట్ తెలిపింది. వీటి కాలపరిమితి మూడేళ్లని వెల్లడించింది. ఈ పరిణామంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం బలపడడంతో పాటు తమ గ్రూప్ కంపెనీలకు మూలధన మద్దతు ఉన్నట్లు నిరూపితమైందని పేర్కొంది.
కంపెనీల షేర్ల ధరలను పెంచడం కోసం అదానీ గ్రూప్ (Adani Group) అవకతవకలకు పాల్పడిందంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన షార్ట్సెల్లర్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్లోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ భారీగా కుంగింది. అప్పటి నుంచి ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొనడానికి కంపెనీ అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొన్ని రుణాలను గడువు తీరకముందే చెల్లించేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం