Air India: బ్యాంకాక్, సింగపూర్ రూట్లలో ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్లు.. అక్టోబర్ 21 వరకే!
Air India: బ్యాంకాక్, సింగపూర్ రూట్లలో టికెట్లపై ఎయిరిండియా రాయితీలు ప్రకటించింది. ఈ పరిమితకాల ఆఫర్ అక్టోబర్ 21తో ముగియనుంది. ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు వచ్చే ఏడాది మార్చి ముగిసే లోపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
Air India | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇండియా- సింగపూర్ (India- Singapore), ఇండియా- బ్యాంకాక్ (India- Singapore) రూట్లలో టికెట్ల ధరలపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తోంది. అక్టోబర్ 18 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ అక్టోబర్ 21న ముగియనుంది. ఈ ప్రత్యేక సేల్లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మార్చి 2024 ముగిసే లోగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ప్రత్యేక సేల్లో భాగంగా ఇండియా- సింగపూర్ (India- Singapore) వెళ్లిరావడానికి ఎకానమీ టికెట్ ధరను ఎయిరిండియా (Air India) రూ.13,330గా నిర్ణయించింది. బిజినెస్ క్లాస్ అయితే, కనీసం రూ.70,290 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు బ్యాంకాక్ వెళ్లి వచ్చేందుకు అయ్యే టికెట్ ధర రూ.17,045 నుంచి ప్రారంభమవుతోంది. అదే బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.49,120. అయితే, నగరాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కావాలంటే కేవలం వెళ్లడానికే మాత్రమే టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. సింగపూర్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఆఫర్లు వర్తిస్తాయి. అక్కడి కరెన్సీకి అనుగుణంగా ధరలను నిర్ణయించారు.
ఈ ప్రత్యేక ఆఫర్లను ఉపయోగించుకోవడానికి ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల వద్ద కూడా బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయని.. ముందు బుక్ చేసుకున్న వారికి ప్రయోజనం ఉంటుందని పేర్కొంది. ఈ నెల మొదట్లో ఐరోపాలోని పలు నగరాలకూ ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్లకు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎయిరిండియా (Air India) 2023 అక్టోబర్ 23 నుంచి కోల్కతా- బ్యాంకాక్ మార్గంలో రెగ్యులర్ విమాన సేవలను ప్రారంభించనుంది.
ఇండియా- సింగపూర్ టికెట్ల ధరల వివరాలు..
ఇండియా- బ్యాంకాక్ టికెట్ల ధరల వివరాలు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
ICICI Bank: ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్ని శనివారం ప్రకటించింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM