Alphabet: అంచనాలు అందుకోని గూగుల్.. Q4 నియమాకాల్లో కోత!
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet Inc) త్రైమాసిక ఫలితాల్లో నిరాశ పరిచింది. సెప్టెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet Inc) త్రైమాసిక ఫలితాల్లో నిరాశ పరిచింది. సెప్టెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు క్షీణించాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఆల్ఫాబెట్ వ్యయాలను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో నియామకాల్లో కోత పెట్టాలని నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు అలముకొన్న వేళ ప్రజలు ఖర్చులకు వెనకాడే పరిస్థితి ఉన్నందు వల్ల ఆన్లైన్ ప్రకటనల మార్కెట్పై ప్రభావం పడింది. దీంతో ఆల్ఫాబెట్ ప్రకటనల ఆదాయంలో వృద్ధి అంతంత మాత్రంగానే నమోదైంది. గతేడాది ప్రకటనల ద్వారా 53.13 బిలియన్ డాలర్లు ఆర్జించిన ఆ కంపెనీ.. ఈ ఏడాది స్వల్ప వృద్ధితో 54.48 బిలియన్లు మాత్రమే ఆర్జించింది. అలాగే కంపెనీ మొత్తం ఆదాయం 69.09 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది మూడో త్రైమాసికంలో 65.12 బిలియన్ డాలర్లుగా ఉంది. అనలిస్టులు 70 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని అంచనా వేయగా.. అంతకంటే తక్కువగా ఆదాయాలను ఆల్ఫాబెట్ ప్రకటించింది. ముఖ్యంగా వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్ ఆదాయం 7.42 బిలియన్ డాలర్లు అంచనా వేయగా.. 7.07 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చినట్లు ప్రకటించింది. వాస్తవానికి గతేడాది కంటే యూట్యూబ్ ఆదాయం 2 శాతం మేర తగ్గడం గమనార్హం. దీంతో కంపెనీ షేరు విలువ 6 శాతం మేర క్షీణించింది.
నియామకాల్లో కోత
మూడో త్రైమాసికంలో ఆశించిన మేర ఫలితాలు ప్రకటించలేకపోవడంతో వ్యయాలు తగ్గించుకునే పనిలో పడింది ఆల్ఫాబెట్. ముఖ్యంగా ప్రకటనల ఆదాయంలో క్షీణత నేపథ్యంలో రాబోయే త్రైమాసికంతో పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియామకాల్లో వేగం తగ్గించాలని ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ నిర్ణయించారు. వృద్ధికి అవకాశం ఉన్న చోట మాత్రమే వనరులు వినియోగించాలని నిర్ణయించినట్లు కంపెనీ సమావేశంలో చెప్పారు.
క్యూ3లో 12,765 మందిని నియమించుకోవడం ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్యను 1,86,779కి పెంచుకున్న గూగుల్.. క్యూ4లో నియామకాల సంఖ్యను భారీగా కుదించాలని నిర్ణయించింది. క్యూ3లో నియామకాల సంఖ్యలో దాదాపు సగం మాత్రమే చేపట్టాలని నిర్ణయించినట్లు ఆల్ఫాబెట్ సీఎఫ్ఓ రుత్ పోరాట్ తెలిపారు. అయితే, క్రిటికల్ రోల్స్తో పాటు, దృష్టి కేంద్రీకరించిన విభాగాల్లో నియామకాలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే వ్యయాలు తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్ తన తదుపరి తరం పిక్సల్ బుక్ ల్యాప్ట్యాప్ ప్రణాళికను రద్దు చేసింది. ‘ఏరియా 120’ పేరిట గూగుల్ ఏర్పాటు చేసిన స్టార్టప్ ఇంక్యుబేటర్కు ఇచ్చే నిధుల్లో కోత పెట్టింది. ఇప్పటికే డిజిటల్ గేమింగ్ సర్వీస్ స్టడియాను మూసివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం