Amazon Prime: ‘డాల్బీ అట్మోస్ హెచ్డీఆర్’కి అదనపు రుసుము!
అమెజాన్ ప్రైమ్ యూజర్లు యాడ్-ఫ్రీ, డాల్బీ అట్మోస్ హెచ్డీఆర్తో కంటెంట్ను వీక్షించేందుకు అదనపు రుసుము చెల్లించాలని సంస్థ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్( Netflix), డిస్నీ+ హాట్స్టార్(Disney+ Hotstar), అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లు సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు గత ఏడాది కాలంగా సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నాయి. ఇప్పటికే పాస్వర్డ్ షేరింగ్పై నెట్ఫ్లిక్స్ ఆంక్షలు విధించింది. త్వరలో అమెజాన్ ప్రైమ్ ప్రీమియం సర్వీస్లకు అదనపు రుసుము వసూలు చేయనుంది. సాధారణ యూజర్లు యాడ్-ఫ్రీ, డాల్బీ విజన్ హెచ్డీఆర్, డాల్బీ అట్మోస్ ఆడియోతో కంటెంట్ వీక్షించాలంటే అదనంగా 2.99 డాలర్లు చెల్లించాలని సంస్థ అధికార ప్రతినిధి కేటీ బార్కర్ తెలిపారు. ప్రస్తుతం ఈ నిబంధన విదేశాల్లోని యూజర్లకు అమల్లో ఉన్నట్లు ది వెర్గ్ సంస్థ పేర్కొంది. రాబోయే రోజుల్లో భారతీయ యూజర్లకు వర్తింప చేసే అవకాశం ఉందని తెలిపింది.
భారత్లో అమెజాన్ ప్రైమ్ ఏడాది సబ్స్క్రిప్షన్ ధర రూ.1,499 కాగా, నెలవారీ రుసుము రూ.299గా ఉంది. ఇక మూడు నెలల సబ్స్క్రిప్షన్కి రూ.599, యాన్యువల్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్కి రూ.799 చెల్లించాలి. డాల్బీ విజన్ హెచ్డీఆర్, యాడ్-ఫ్రీ నిబంధన అమల్లోకి వస్తే.. ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా సుమారు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు ఓటీటీ సంస్థలు ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే నెట్ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ (నెలకు రూ. 149), అమెజాన్ యాన్యువల్ ప్రైమ్ లైట్లను ప్రవేశపెట్టాయి. డిస్నీ+ హాట్స్టార్ కూడా ఈ ఏడాది నుంచి పాస్వర్డ్ షేరింగ్పై పరిమితి విధించడంతోపాటు, మార్చి నుంచి కొత్త విధివిధానాలను అమలు చేస్తుందని గతేడాది ఆగస్టులో కంపెనీ సీఈవో బాబ్ ఐగర్ ప్రకటించారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పొద్దున్నే ఏం చదువుతారో తెలుసా?
డాల్బీ అట్మోస్ ఎలా పనిచేస్తుందంటే?
సాధారణ ఆడియో టెక్నాలజీలు ఛానెల్స్ ద్వారా సౌండ్ను వ్యాపింప చేస్తాయి. ఏదైనా ఒక ఛానెల్లో సమస్య ఉన్నా.. సౌండ్ క్లారిటీ ఉండదు. డాల్బీ అట్మోస్ సాంకేతికత ఆడియోను ఆబ్జెక్ట్స్గా క్రియేట్ చేసి డివైజ్లకు అనుకూలంగా అందిస్తుంది. ఎత్తు ఆధారంగా ఇది పనిచేస్తుంది. స్పీకర్స్ను ఎత్తులో ఉంచితే.. డాల్బీ అట్మోస్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, టీవీలు, హెడ్ఫోన్స్లో కూడా ఈ టెక్నాలజీని ఇస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ+ హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్తో మూవీస్, వీడియోలను రిలీజ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం