Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పొద్దున్నే ఏం చదువుతారో తెలుసా?
Sundar Pichai: సుందర్ పిచాయ్ లాంటి ఉన్నత స్థానంలోని వ్యక్తి ఏ వార్తాపత్రికో లేక పుస్తకంతోనో వారి రోజుని ప్రారంభిస్తారని అనుకుంటాం. కానీ, పొద్దున్న లేవగానే ఆయన ఓ వెబ్సైట్ను ఓపెన్ చేస్తారట. అదేంటి? దాన్నే ఎందుకు చూస్తారో తెలుసుకుందాం!
వాషింగ్టన్: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) తన రోజును చదవడంతో ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ సంస్థకు నాయకుడిగా, జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఆయనకు ఈ అలవాటు ఉండడం మనకు సాధారణ విషయంగానే అనిపించొచ్చు. అయితే, పొద్దున్న లేవగానే ఆయన ఏ వార్తాపత్రికనో.. పుస్తకమో చదువుతారని అనుకుంటాం. కానీ, టెక్ వెబ్సైట్ను ఓపెన్ చేసి అప్డేట్లు తెలుసుకుంటారట.
వైర్డ్ వెబ్సైట్తో మాట్లాడుతూ సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇప్పటికీ ‘వెబ్’ అంటే తనకు అమితమైన ఆసక్తి అని వెల్లడించారు. పొద్దున్న లేవగానే ‘టెక్మీమ్’ అనే వెబ్సైట్ను ఓపెన్ చేస్తానని చెప్పారు. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమలో చోటుచేసుకుంటున్న తాజా సమాచారాన్ని హెడ్లైన్ల రూపంలో ఒక దగ్గరకు చేర్చి అందుబాటులో ఉంచుతారు. దీన్ని ఫాలో అవుతుంటామని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరీ గతంలో వెల్లడించారు.
టెక్మీమ్ను 2005లో గేబ్ రివేరా స్థాపించారు. ఇది టెక్ ప్రపంచంలోని అప్డేట్ల సారాంశాలు, అసలు కథనాల లింక్లను సేకరిస్తుంది. ఆయా సమాచారానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి వాటిని ఒక వరుస క్రమంలో ఉంచుతుంది. పైగా సందర్భం, పరిశ్రమలో దాని వినియోగంతో కూడిన వివరాలనూ అందిస్తుంది. ఇలా పరిశ్రమలో చోటుచేసుకుంటున్న అభివృద్ధిని రోజూ సమగ్రంగా మన ముందుంచుతుంది. టెక్ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ప్రాధాన్య వెబ్సైట్ అని చెప్పొచ్చు.
గూగుల్ కొత్త ఏఐ మోడల్ జెమినీ..
వెబ్సెర్చ్ విధానం క్రమంగా మారిపోతోందని పిచాయ్ (Sundar Pichai) వైర్డ్తో అన్నారు. భవిష్యత్ కోసం దీన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిలో భాగంగానే తాము జెమినీ (Gemini AI Model) అనే కృత్రిమ మేధ చాట్బాట్ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తీసుకొచ్చిన బార్డ్ పేరును మార్చి దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఇది త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైళ్లలో యాప్ల రూపంలోనూ రానుందన్నారు. ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఏఐ మోడళ్లకు పోటీగా గూగుల్ దీన్ని తీసుకొస్తోంది.
ఇతర కంపెనీల ఏఐ అసిస్టెంట్లతో పోలిస్తే జెమినీ (Gemini AI Model) భిన్నమైందని పిచాయ్ వివరించారు. తమ మోడల్కు కేవలం టెక్ట్స్లో మాత్రమే కాకుండా ఫొటోలు, ఆడియో, వీడియో, కోడ్.. ఇలా వివిధ రకాల డేటా ఫార్మాట్లతో శిక్షణనిచ్చినట్లు తెలిపారు. దీనివల్ల ఫొటో, వాయిస్, టెక్ట్స్ ఏ రూపంలో ఆదేశాలిచ్చినా స్పందిస్తుందని వివరించారు. నిజానికి ఇలాంటి సాంకేతికతను గూగుల్కు అనుసంధానించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే గూగుల్ లెన్స్ వంటి ఫీచర్లు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జెమినీతో తమ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరబోతోందన్నారు. అయితే, వీటన్నింటికీ ‘వెబ్’ సాంకేతికతే ఆధారమని.. అందుకే ఇప్పటికీ తనకు దానిపై అమితమైన ఆసక్తి అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం