Hurun Rich List: భారత్లో అంబానీయే అత్యంత ధనవంతుడు
Hurun Rich List: ‘‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’’ను హురున్ విడుదల చేసింది. ఈ జాబితాలో గౌతమ్ అదానీని దాటేసి ముకేశ్ అంబానీ తొలిస్థానంలో నిలిచారు.
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) భారత్లో మళ్లీ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. హురున్ (Hurun) విడుదల చేసిన తాజా కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని దాటేసి అంబానీ ఈ స్థానానికి చేరారు. ఈ ఏడాది ముకేశ్ సంపద రెండు శాతం పెరిగి రూ.8.08 లక్షల కోట్లకు చేరినట్లు ‘‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’’ (360 ONE Wealth Hurun India Rich List 2023) పేర్కొంది. అదే సమయంలో అదానీ సంపద 57 శాతం తరిగి రూ.4.74 లక్షల కోట్లకు కుంగినట్లు వెల్లడించింది.
అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ (Hindenburg) ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ (Adani Group)పై విడుదల చేసిన నివేదిక కారణంగానే గౌతమ్ అదానీ సంపద తగ్గినట్లు హురున్ ఎండీ, ప్రధాన పరిశోధకుడు అనస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. తమ నమోదిత సంస్థల షేర్ల ధరలను పెంచడం కోసం అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. వీటిని ఆ సంస్థ తీవ్రంగా ఖండించినప్పటికీ.. గ్రూప్ కంపెనీల షేర్లు భారీ దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో గౌతమ్ అదానీ నేతృత్వంలోని ప్రమోటర్ ఫ్యామిలీ సంపద సైతం కుంగింది.
ఆగస్టు 30 నాటి సంపద ఆధారంగా దేశవ్యాప్తంగా 1,319 మందితో కూడిన ధనవంతుల జాబితాను హురున్ విడుదల చేసింది. సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన సైరస్ పూనావాలా దేశంలో మూడో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఆయన సంపద 36 శాతం పెరిగి రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. తర్వాత హెచ్సీఎల్ టెక్కు చెందిన శివ్ నాడార్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 23 శాతం ఎగబాకి రూ.2.28 లక్షల కోట్లకు పెరిగింది. గోపిచంద్ హిందుజా, దిలీప్ సంఘ్వీ, లక్ష్మీ నివాస్ మిత్తల్, రాధాకృష్ణన్ దమానీ, కుమార్ మంగళం బిర్లా, నీరజ్ బజాజ్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డిమార్ట్కు చెందిన రాధాకృష్ణ దమానీ సంపద మాత్రం 18 శాతం తగ్గి రూ.1.43 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఆయన జాబితాలో క్రితం ఏడాదితో పోలిస్తే మూడు స్థానాలు కిందకు వచ్చి ఎనిమిదో ర్యాంకులో నిలిచారు.
నైకాకు చెందిన ఫల్గుణి నాయర్ను దాటేసి జోహో కంపెనీ రాధా వెంబు దేశంలో అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. జెప్టోకు చెందిన కైవల్య వోరా ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు. 94 ఏళ్ల వయసులో ప్రెసిషన్ వైర్స్ ఇండియాకు చెందిన మహేంద్ర రతిలాల్ మెహతా హురున్ ధనవంతుల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. భారత్లో గత ఏడాది వ్యవధిలో ప్రతి మూడు వారాలకు ఇద్దరు బిలియనీర్లు పుట్టుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు. గత 12 ఏళ్లలో ఈ సంఖ్య 4.4 రెట్లు పెరిగింది. జాబితాలో ఉన్నవారిలో 51 మంది సంపద వార్షిక ప్రాతిపదికన రెండింతలు పెరిగింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 24గా ఉంది.
అత్యధికంగా ముంబయి నుంచి హురున్ ధనవంతుల జాబితాలో 328 మంది చోటు దక్కించుకున్నారు. తర్వాత దిల్లీ 199, బెంగళూరు 100 మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తొలిసారి తిరుప్పూర్ అత్యధిక సంఖ్యలో ధనవంతులను అందించిన మొదటి 20 నగరాల జాబితాలో చేరింది. కెదారా క్యాపిటల్కు చెందిన మనీశ్ కేజ్రీవాల్ ప్రైవేట్ ఈక్విటీ రంగం నుంచి ధనవంతుల లిస్ట్లో చేరిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఆయన సంపద విలువ రూ.3,000 కోట్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
ICICI Bank: ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్ని శనివారం ప్రకటించింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM