Hiring: వచ్చే 3 నెలలు ఆచితూచి నియామకాలు!
ద్రవ్యోల్బణం, ఐటీ రంగంలో ఆందోళనలు, ఆర్థిక మందగమనం నేపథ్యంలో కంపెనీలు నియామకాల్లో అప్రమత్తత పాటిస్తున్నాయని ఓ ప్రముఖ సర్వే తెలిపింది.
దిల్లీ: రానున్న మూడు నెలల నియామకాల (hiring)పై భారత్లోని కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని ప్రముఖ సర్వే తెలిపింది. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం ఇంకా కొనసాగుతుండడం, క్రితం త్రైమాసికంలో ఐటీ రంగంలో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో యాజమాన్యాలు ఉద్యోగులను నియమించుకోవడం (hiring)లో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని మ్యాన్పవర్ గ్రూప్ తెలిపింది.
ఈ జనవరి- మార్చి త్రైమాసికంలో నియామకాల (hiring)పై 3,030 పబ్లిక్, ప్రైవేటు కంపెనీల అభిప్రాయాన్ని మ్యాన్పవర్ గ్రూప్ సేకరించింది. 48 శాతం యాజమాన్యాలు తమ సిబ్బందిని పెంచుకుంటామని తెలిపాయి. మరో 16 శాతం నియామకాల (hiring)ను తగ్గించుకుంటామని పేర్కొన్నాయి. 34 శాతం కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగుల నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. నికరంగా 32 శాతం కంపెనీలు మాత్రమే నియామకాలను పెంచుతామని తెలిపాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నియామకాలు 17 శాతం తగ్గాయి.
ఇప్పటికే భారత్కు చెందిన 33 శాతం కంపెనీల సీఈఓలు నియామకాల (hiring)ను నిలిపివేశారని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ తెలిపారు. స్వల్పకాలంలో ఉద్యోగ నియామకాలు నెమ్మదించినప్పటికీ.. రానున్న రోజుల్లో ఆర్థిక వృద్ధికి అనుగుణంగా పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ తొలిసారి జీ20 సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో భారత్లో నియామకాల తీరు రానున్న రోజుల్లో మారుతుందని పేర్కొన్నారు. అత్యధికంగా డిజిటల్ రంగంలో నియామకాలు ఉంటాయని తెలిపారు. ఐటీ, స్థిరాస్తి, ఆర్థిక రంగంలోనూ ఉద్యోగుల నియామకాలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పారు. నైపుణ్యాల కొరత ఇప్పటికీ ఓ సవాల్గా నిలుస్తోందన్నారు. కంపెనీలు, విద్యాసంస్థలు కలిసికట్టుగా ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?