AirIndia: ఎయిరిండియాకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా

Air India: పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఎయిరిండియాకు డీజీసీఏ రూ.10లక్షల జరిమానా విధించింది.

Updated : 22 Nov 2023 19:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) రూ.10 లక్షల జరిమానా విధించింది. పౌర విమానయాన నిబంధనలను (CAR) ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానా విధించినట్లు డీజీసీఏ తెలిపింది. దిల్లీ, కోచి, బెంగళూరు విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించామని డీజీసీఏ వెల్లడించింది.

పదేళ్లు దాటినా ఆధార్‌ అప్‌డేట్‌ చేయలేదా? ఉచిత అప్‌డేషన్‌ మరి కొన్నిరోజులే!

విమాన సర్వీసులు ఎటువంటి పరిస్థితుల్లో రద్దైనా, ఆలస్యమైనా, ఏదైనా కారణంచేత ప్రయాణికులను బోర్డింగ్‌కు అనుమతించకున్నా.. విమానయాన సంస్థలు వారికి తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అలాగే, నిర్దిష్ట ప్రమాణాలు లేని సీట్లలో ప్రయాణించిన అంతర్జాతీయ బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికులకు పరిహారం చెల్లింపుల్లో ఎయిరిండియా విఫలమైనట్లు తనిఖీల్లో గుర్తించామని డీజీసీఏ తెలిపింది. దీనిపై నవంబర్‌ 3న ఎయిరిండియాకు షోకాజ్‌ నోటీసు జారీ చేశామని, ఆ  సంస్థ ఇచ్చిన సమాధానం అనంతరం రూ.10లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొంది. సీఏఆర్‌ పాటించనందుకు గతేడాది సైతం ఎయిరిండియా రూ.10 లక్షలు జరిమానా ఎదుర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని