ఉద్యోగుల తప్పిదం.. కంపెనీలకు రూ.8వేల కోట్ల ఫైన్..!
ఉద్యోగులు అనుమతిలేని మెసేజింగ్ యాప్స్ ఉపయోగించినందుకుగానూ అమెరికాలో ఓ ఐదు కంపెనీలు రూ.8000 కోట్ల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది...
వాషింగ్టన్: ఉద్యోగులు అనుమతిలేని మెసేజింగ్ యాప్స్ ఉపయోగించినందుకుగానూ అమెరికాలో ఓ ఐదు కంపెనీలు రూ.8000 కోట్ల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ కమిషన్ (SEC) ఈ మేరకు ఆయా కంపెనీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని సమాచారం. అయితే, దీనిపై స్పందించడానికి ఇటు ఎస్ఈసీ, అటు ఆయా సంస్థలు నిరాకరించాయి.
తాఖీదులు అందుకున్న వాటిలో మోర్గాన్ స్టాన్లీ, జె.పి.మోర్గాన్ అండ్ కంపెనీ, సిటీ గ్రూప్, గోల్డ్మన్ శాక్స్ వంటి బడా కంపెనీలు ఉన్నట్లు సమాచారం. దీంట్లో మోర్గాన్ స్టాన్లీ ఇప్పటికే 200 మిలియన్ డాలర్ల ఫైన్ను చెల్లించినట్లు గురువారం వెల్లడించింది. మిగతా సంస్థల సైతం దాదాపుగా అదే స్థాయిలో జరిమానా చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, జరిమానా తగ్గింపు విషయంలో ఆయా సంస్థలు నియంత్రణా సంస్థలతో చర్చలు జరుపుతున్నాయి. వారు అంగీకరిస్తే పైన తెలిపిన మొత్తం తగ్గే అవకాశం ఉంది. అయితే, నేర తీవ్రత ఎక్కువని ఎస్ఈసీ భావిస్తే జరిమానా మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నిపుణులు తెలిపారు.
ఇలాంటి పొరపాట్లకు ఈ స్థాయిలో జరిమానా విధించిన దాఖలాలు ఎస్ఈసీ చరిత్రలో లేవని అమెరికాలోని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఓ కంపెనీ రికార్డుల నిర్వహణలో అవకతవకలు దొర్లినందుకుగానూ 2006లో 15 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం. దీంతో పోలిస్తే తాజాగా విధించిన ఫైన్లు చాలా ఎక్కువ. అమెరికాలో ఆర్థిక సంస్థలు తమ వ్యాపారానికి సంబంధించిన సమాచార బదిలీని నిశితంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మెసేజింగ్ యాప్ల విషయంలో అనేక అభ్యంతరాలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. అయితే, కొవిడ్ సమయంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోంకు వెళ్లడంతో పర్యవేక్షణ కష్టంగా మారింది.
జేపీ మోర్గాన్కు డిసెంబరులో ఎస్ఈసీ 200 మిలియన్ డాలర్ల ఫైన్ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. కంపెనీకి చెందిన ఎండీలు, సీనియర్ సూపర్వైజర్లు సైతం బిజినెస్కు సంబంధించిన సమాచార మార్పిడికి వాట్సాప్, వ్యక్తిగత ఈ-మెయిళ్లు ఉపయోగించడమే ఫైన్ విధించడానికి కారణమని వివరించింది. మోర్గాన్ స్టాన్లీ అనధీకృత డివైజ్లు వాడినందుకుగానూ జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఐదు కంపెనీలతో పాటు ఎస్ఈసీ మరికొన్ని కంపెనీలకూ నోటీసులు పంపినట్లు సమాచారం. అవి కూడా ఈ జాబితాలో చేరితే జరిమానా మొత్తం రూ.8000 కోట్లను దాటిపోయే అవకాశం ఉంది.
అమెరికాలో కొన్ని బ్యాంకులు ఇప్పటికే తమ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశాయి. మెసేజ్లను డిలీట్ చేయడం నిషిద్ధమని తెలిపాయి. కార్పొరేట్ ఫోన్లలో వాట్సాప్ సహా అన్ని మేసేజ్లను ఆర్కైవ్ చేసే కొత్త సాఫ్ట్వేర్ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం