భారతీయ కంపెనీల చేతుల్లోనే 5జీ నెట్వర్క్!
దేశంలో 5జీ ప్రధాన నెట్వర్క్ బాధ్యతలు భారతీయ కంపెనీల చేతుల్లోనే ఉండాలని కేంద్ర టెలికాంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. దేశంలో
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
దిల్లీ: దేశంలో 5జీ ప్రధాన నెట్వర్క్ బాధ్యతలు భారతీయ కంపెనీల చేతుల్లోనే ఉండాలని కేంద్ర టెలికాంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. దేశంలో కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికాం సాధనాలతో వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించిన ఆయన, 5జీ టెక్నాలజీ కోసం జరిగే ప్రయోగాల కోసం త్వరలోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
‘ఇప్పటికే 4జీ సాంకేతికతలో వెనుకబడి ఉన్నాం. కానీ, 5జీలో మాత్రం ప్రపంచ దేశాల కంటే ముందుండాలి. ఇందుకోసం ఇప్పటికే పరీక్షావేదికను సిద్ధం చేశాం, త్వరలోనే వీటికి అనుమతులు రానున్నాయి. అయితే, వీటి ప్రధాన నెట్వర్క్ మాత్రం భారతీయ కంపెనీ చేతుల్లోనే ఉండాలి’ అని చెప్పారు. 5జీ అందుబాటులోకి రావడం కేవలం సాంకేతికరంగంలో మార్పులే కాకుండా, ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. అంతేకాకుండా, సమాచార ఆర్థికవ్యవస్థలో భారత్ అతిముఖ్యమైన కేంద్రంగా నిలవాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆకాంక్షించారు.
అయితే, 2019లోనే దేశంలో 5జీ నెట్వర్క్ ప్రయోగాలను చేయాలని నిర్దేశించుకున్న టెలికాం శాఖ, 2020లోనే వీటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించుకుంది. అయితే, రక్షణ శాఖ, అంతరిక్ష విభాగం కూడా 5జీకి గుర్తించిన స్పెక్ట్రమ్లో భాగస్వామ్యం కావడంవల్ల ఆ ప్రక్రియలో కొంత ఆలస్యం అయనట్లు తెలుస్తోంది. ఇక సాంకేతిక రంగ నిపుణుల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా 5జీ నెట్వర్క్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తాజాగా దేశంలో వీటి ప్రయోగాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఇవీ చదవండి..
భారత్లో యాపిల్ రిటైల్ స్టార్లు
దేశం ముంగిట..సాంకేతిక విప్లవం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..