IPO: వచ్చేవారం 4 ఐపీఓలు.. రూ.4500 కోట్ల సమీకరణ
వచ్చేవారం గ్లోబల్ హెల్త్, ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్, డీసీఎక్స్ సిస్టమ్స్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఐపీఓ ప్రారంభం కానుంది. ఈ 4 కంపెనీలు కలిసి రూ.4,500 కోట్లు సమీకరించనున్నాయి.
దిల్లీ: వచ్చేవారం నాలుగు ఐపీఓలు రానున్నాయి. గ్లోబల్ హెల్త్, ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్, డీసీఎక్స్ సిస్టమ్స్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగు కంపెనీలు కలిసి రూ.4,500 కోట్లు సమీకరించనున్నాయి. వీటితో పాటు యూనిపార్ట్స్ ఇండియా, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ కూడా నవంబరులో పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి.
కేబుల్స్, వైర్ హార్నెస్ అసెంబ్లీని తయారు చేసే డీసీఎస్ సిస్టమ్స్ ఐపీఓ అక్టోబరు 31న ప్రారంభమై నవంబరు 2న ముగియనుంది. ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ నవంబరు 2-4 మధ్య జరగనుంది. గ్లోబల్ హెల్త్, బికాజీ ఫుడ్స్ ఐపీఓలను నవంబరు 3 నుంచి నవంబరు 7 మధ్య నిర్వహించనున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. 2022లో ఇప్పటి వరకు 22 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.44,000 కోట్లు సమీకరించాయి. 2021లో 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చి రూ.1.19 లక్షల కోట్లు సేకరించిన విషయం తెలిసిందే.
స్టాక్ మార్కెట్లలోని ఒడుదొడుకుల కారణంగా 2022లో ఐపీఓ మార్కెట్ బలహీనంగా ఉందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగాధిపతి వినోద్ నాయర్ తెలిపారు. అయితే, పబ్లిక్ ఇష్యూకి వచ్చిన వాటికి మాత్రం మదుపర్ల నుంచి స్పందన బాగానే ఉంటోందని పేర్కొన్నారు. హెచ్ఎన్ఐలు, రిటైల్ మదుపర్ల వద్ద ద్రవ్య లభ్యత అధికంగా ఉండడమే దీనికి కారణమన్నారు. ముఖ్యంగా లిస్టింగ్ లాభాల కోసం చాలా మంది ఐపీఓలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. అలాగే సంస్థాగత మదుపర్లు సైతం డైవర్సిఫికేషన్ కోసం నాణ్యమైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.
డీసీఎక్స్ సిస్టమ్స్ రూ.500 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకి వస్తోంది. ధరల శ్రేణిని రూ.197-207గా నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూలో సమీకరించిన నిధులతో రుణ భారం తగ్గించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే అనుబంధ సంస్థ రణీల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు కావాల్సిన మూలధన పెట్టుబడికి మరికొన్ని నిధులను వినియోగించనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ రూ.1,104 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ధరల శ్రేణిని రూ.350- 368గా నిర్ధారించింది.
మేదాంతా పేరిట ఆస్పత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ రూ.2,206 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధరల శ్రేణిని రూ.319-336గా నిర్ణయించింది. రుణ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఐపీఓకి రానున్న మరో కంపెనీ బికాజీ ఫుడ్స్ రూ.1,000 కోట్లు సమీకరించడానికి సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?