Fuel Price: ఇంధన ధరల తగ్గింపు ఇప్పట్లో లేనట్లే!
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కంపెనీలకు మార్జిన్లు సానుకూలంగా మారుతున్నాయి.
గత నష్టాలు పూడ్చుకున్నాకే సవరణకు కంపెనీల మొగ్గు
దిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కంపెనీలకు మార్జిన్లు సానుకూలంగా మారుతున్నాయి. అయితే గతేడాది ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చవిచూసిన నష్టాలను పూడ్చుకున్న తర్వాతే, భవిష్యత్తులో ఇంధన రిటైల్ ధరల తగ్గింపు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ గతేడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్కు సంబంధించి రోజువారీ ధరల సవరణను నిలిపివేశాయి. తయారీ వ్యయాలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిం చడమూ ఆపేశాయి. రిటైల్ విక్రయ ధరలతో పోలిస్తే, ముడిచమురు ధరలు అధికంగా ఉన్న సమయంలో వాటిల్లిన నష్టాలను.. కంపెనీలు ప్రస్తుతం భర్తీ చేసుకుంటున్నాయి. 2022 అక్టోబరు-డిసెంబరు నుంచి ప్రభుత్వరంగ మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్పై సానుకూల మార్జిన్లు నమోదు చేస్తున్నాయి. డీజిల్ విక్రయాలపై ఇంకా లాభాలు రావడం లేదు. గత నెలలో డీజిల్పై లీటర్కు రూ.0.50 మార్జిన్ వచ్చినా.. గతంలో ఏర్పడిన నష్టాలను పూడ్చుకునేందుకు ఈ మొత్తం సరిపోదని అధికారులు వెల్లడించారు.
* రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 2022 మార్చిలో అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్కు 139 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఇది 75-76 డాలర్లకు దిగి వచ్చింది. ఒక సమయంలో చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.17.4, డీజిల్పై రూ.27.7 చొప్పున నష్టపోయాయి. గత అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో లీటర్ పెట్రోల్పై రూ.10 చొప్పున ఆర్జించినా, డీజిల్పై మాత్రం లీటరుకు రూ.6.5 కోల్పోయాయి. 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో లీటర్ పెట్రోల్పై రూ.6.8, డీజిల్పై రూ.0.5 మార్జిన్ను ఆర్జించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ పసికందు చనిపోయింది
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!