కొవిడ్ చుక్కల మందు టీకాపై క్లినికల్ పరీక్షలు పూర్తి
కరోనా మహమ్మారి నుంచి రక్షణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా- బీబీవీ154 (నాసల్ వ్యాక్సిన్) పై మూడో దశ క్లినికల్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ టీకా సమర్థంగా పనిచేయడమే కాకుండా, ఎంతో సురక్షితమైనదిగా నిర్థారణ అయినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనిపై
సమర్థత, భద్రత నిర్థారణ అయ్యాయి
భారత్ బయోటెక్ వెల్లడి
ఈనాడు బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి నుంచి రక్షణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా- బీబీవీ154 (నాసల్ వ్యాక్సిన్) పై మూడో దశ క్లినికల్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ టీకా సమర్థంగా పనిచేయడమే కాకుండా, ఎంతో సురక్షితమైనదిగా నిర్థారణ అయినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనిపై రెండు డోసుల టీకా (ప్రైమరీ డోసు) పరీక్షలతో పాటు, బూస్టర్ డోసు పరీక్షలను వేరువేరుగా, ఏకకాలంలో పూర్తిచేసినట్లు తెలిపింది. ప్రైమరీ డోసు టీకా పరీక్షలను దేశవ్యాప్తంగా 14 ప్రదేశాల్లో 3,100 మంది వాలంటీర్లపై నిర్వహించారు. బూస్టర్ డోసు పరీక్షలను 9 ప్రదేశాల్లో 875 మందిపై చేపట్టారు. ఈ పరీక్షల సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ మండలికి అందజేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
ముక్కు ద్వారా సులభంగా వేయొచ్చు
చుక్కల మందు టీకాను ముక్కు ద్వారా ఇవ్వడం ఎంతో సులువని భారత్ బయోటెక్ పేర్కొంది. దీనికి అనుమతి లభించిన వెంటనే పెద్దఎత్తున సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. తాము అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాపై క్లినికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభసందర్భంలో వెల్లడించడానికి ఎంతో సంతోషిస్తున్నామని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల అన్నారు. తక్కువ, మధ్య ఆదాయాలు గల దేశాల్లో కొవిడ్ టీకా కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టడానికి ఈ టీకా వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ టీకాను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ- సెయింట్ లూయిస్ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. మనదేశంలో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ సురక్ష కార్యక్రమం కింద సహకారాన్ని అందించింది. టీకాను ఉత్పత్తి చేయడానికి భారత్ బయోటెక్.. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని తన యూనిట్లలో తగిన ఏర్పాట్లు చేసింది. ఈ టీకాను 2- 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. కాబట్టి నిల్వ, రవాణా ఎంతో సులువని కంపెనీ వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు