హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ బైక్‌ జీ రూ.1,29,738

హీరో మోటోకార్ప్‌ తమ ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ బైక్‌లో కొత్త వెర్షన్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.1,29,738 (ఎక్స్‌-షోరూమ్‌).

Published : 28 Sep 2022 02:15 IST

 

ముంబయి: హీరో మోటోకార్ప్‌ తమ ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ బైక్‌లో కొత్త వెర్షన్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.1,29,738 (ఎక్స్‌-షోరూమ్‌). ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ స్టెల్త్‌ 2.0 దేశ వ్యాప్తంగా హీరో మోటోకార్ప్‌ విక్రయశాలల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌ ‘హీరో కనెక్ట్‌’ అనే స్మార్ట్‌ మొబిలిటీ పరికరంతో కనెక్ట్‌ అయి ఉంటుందని, దీంతో రైడర్లు అనుసంధానమై ఉంటారని పేర్కొంది. లైవ్‌ లొకేషన్‌ను గుర్తించడానికి వారికి ఈ పరికరం అనుమతి ఇస్తుందని వివరించింది. ఈ బైక్‌ 163 సీసీ ఎయిర్‌కూల్డ్‌ బీఎస్‌-6 ఇంజిన్‌తో, అడ్వాన్స్‌డ్‌ ప్రోగామ్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌తో రూపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని