ఆర్బీఐ చర్యలు ఫలించాయ్
ఏడు రోజుల వరుస నష్టాల తర్వాత సూచీలు శుక్రవారం బలంగా పుంజుకున్నాయి. అంచనాలకు అనుగుణంగా రెపోరేటును అర శాతం పెంచడం, వచ్చే జనవరికి ద్రవ్యోల్బణం అదుపులోకి రావొచ్చన్న అంచనాలు మదుపర్లపై సానుకూల ప్రభావం చూపాయి.
సమీక్ష
ఏడు రోజుల వరుస నష్టాల తర్వాత సూచీలు శుక్రవారం బలంగా పుంజుకున్నాయి. అంచనాలకు అనుగుణంగా రెపోరేటును అర శాతం పెంచడం, వచ్చే జనవరికి ద్రవ్యోల్బణం అదుపులోకి రావొచ్చన్న అంచనాలు మదుపర్లపై సానుకూల ప్రభావం చూపాయి. రూపాయి కోలుకోవడమూ కలిసొచ్చింది. డాలర్తో పోలిస్తే రూపాయి 33 పైసలు బలపడి 81.40 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర 1.19 శాతం పెరిగి 89.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ మినహా మిగతావి నష్టాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 56,240.15 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్లో 56,147.23 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని సూచీ.. ఆర్బీఐ పరపతి నిర్ణయాలు వెలువడిన తర్వాత పరుగులు తీసింది. ఒకదశలో 57,722.63 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 1016.96 పాయింట్ల లాభంతో 57,426.92 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 276.25 పాయింట్లు పెరిగి 17,094.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,747.70- 17,187.10 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్ 672 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 25 రాణించాయి. భారతీ ఎయిర్టెల్ 4.49%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.78%, బజాజ్ ఫైనాన్స్ 3.28%, కోటక్ బ్యాంక్ 3.22%, టైటన్ 2.95%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.93%, బజాజ్ ఫిన్సర్వ్ 2.63%, టాటా స్టీల్ 2.53%, మారుతీ 2.35%, హెచ్డీఎఫ్సీ 2.27%, రిలయన్స్ 2.25%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.22% చొప్పున లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, టెక్ మహీంద్రా స్వల్పంగా నష్టపోయాయి.
* స్టాక్ మార్కెట్లో ఒడుదొడుకుల నేపథ్యంలో రూ.1250 కోట్ల పబ్లిక్ ఇష్యూను వాయిదా వేస్తున్నట్లు స్టెరిలైట్ పవర్ ప్రకటించింది. గతేడాది ఆగస్టులో కంపెనీ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
* శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన 69 ఆస్తులను నవంబరు 1న సెబీ వేలం వేయనుంది. ఇందుకు కనీస ధరగా రూ.30 కోట్లు నిర్ణయించింది. అక్రమ పథకాల ద్వారా ప్రజల నుంచి కంపెనీ వసూలు చేసిన డబ్బులను రాబట్టుకునే చర్యల్లో భాగంగా సెబీ ఆస్తుల వేలం నిర్వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?