మన ఆర్థిక వ్యవస్థకు ప్రపంచం వల్లే ‘ఏడు’పు
‘ద్రవ్యోల్బణ అంచనాలను అంతర్జాతీయ అనిశ్చితి మేఘాలు కమ్మేశాయి. అధిక ద్రవ్యోల్బణాన్ని ఇలాగే వదిలేస్తే.. మరో దుష్ప్రభావాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. గత రెండున్నరేళ్లలో కరోనా మహమ్మారి, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం రూపంలో రెండు భారీ కుదుపులకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోనైంది.
2022-23 వృద్ధి అంచనాల్లో మళ్లీ కోత
7.2% నుంచి 7 శాతానికి తగ్గింపు
కీలక రేట్లు మరో అర శాతం పెంపు
ద్రవ్యోల్బణ అంచనాలు యథాతథం
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష
‘ద్రవ్యోల్బణ అంచనాలను అంతర్జాతీయ అనిశ్చితి మేఘాలు కమ్మేశాయి. అధిక ద్రవ్యోల్బణాన్ని ఇలాగే వదిలేస్తే.. మరో దుష్ప్రభావాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. గత రెండున్నరేళ్లలో కరోనా మహమ్మారి, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం రూపంలో రెండు భారీ కుదుపులకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోనైంది. అంతర్జాతీయ మాంద్యం భయాల నుంచి మన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. అవసరమైతే తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. రూపాయి విలువ ఏ స్థాయిలో ఉండాలనే దాని కంటే కూడా, ఒడుదొడుకుల నియంత్రణపై ఆర్బీఐ దృష్టి సారిస్తుంది.’
- శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నరు
ముంబయి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి తగ్గించింది. 2022-23లో వృద్ధిరేటు 7 శాతంగా నమోదు కావొచ్చని తాజాగా పేర్కొంది. తొలుత 7.8 శాతమని అంచనా వేసినా, గత ఏప్రిల్లో 7.2 శాతానికి తగ్గించిన ఆర్బీఐ.. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుని ఇలా సవరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచే విషయంలో దూకుడు ప్రదర్శిస్తుండటం, అంతర్జాతీయంగా గిరాకీ తగ్గుతున్నందున, మన ఎగుమతులపై ప్రభావం పడి, దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కొంత ఇబ్బందులు కలగవచ్చని ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలను ఆయన శుక్రవారం వెల్లడించారు. నిర్ణయాలివీ..
రెపోరేటు: కీలకమైన రెపో రేటును మరో అర శాతం పెంచి 5.9 శాతానికి చేర్చింది. 2019 ఏప్రిల్ తర్వాత ఇదే అత్యధిక రెపోరేటు కావడం గమనార్హం. ఈ ఏడాది మే నుంచి కీలక రేట్లను పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. అప్పటినుంచి మొత్తంగా 190 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ పెంచింది. ఇందువల్ల తమ ఖాతాదార్ల రుణాలపై బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతాయి. కీలక రేట్ల పెంపునకు ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపోరేటు పెంపునకు ఓటేశారు. ఓ వైపు వృద్ధికి అండగా నిలుస్తూనే.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత లక్ష్య (2- 6% మధ్యలో) శ్రేణిలోకి తీసుకొచ్చేందుకు సర్దుబాటు విధాన వైఖరిని ఉపసంహరించడంపై దృష్టి సారిస్తున్నట్లు దాస్ తెలిపారు. తద్వారా మున్ముందు కూడా కీలక రేట్లను పెంచే అవకాశం ఉందనే సంకేతాలను ఆయన ఇచ్చారు.
జనవరి నుంచి అదుపులోకి ద్రవ్యోల్బణం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాల్లో మార్పు చేయకుండా 6.7 శాతంగానే కొనసాగించింది. 2023 జనవరి నుంచి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. 2022 జనవరి నుంచి ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్య శ్రేణిలోని గరిష్ఠమైన 6 శాతానికి ఎగువన ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో దిగుమతుల భారం వల్లే ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగిందని ఆర్బీఐ గవర్నరు చెప్పారు. ఇటీవల ఆ ఒత్తిడి కొంత తగ్గినా, ఆహార పదార్థాలు, ఇంధన ధరలు ఇంకా అధిక స్థాయుల్లోనే కొనసాగుతున్నాయని అన్నారు. ఆహార పదార్థాల నుంచి మరింత ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఖరీఫ్ పంట దిగుబడి తక్కువగా ఉండొచ్చనే అంచనాలతో, తృణ ధాన్యాలు, గోధుమలు, బియ్యం ధరలు అధికంగా ఉంటున్నాయని వివరించారు.
విదేశీ మారకపు నిల్వల్లో 67% క్షీణత ఎందుకంటే..
ఏప్రిల్ నుంచి విదేశీ మారకపు నిల్వల్లో 67 శాతం క్షీణతకు అమెరికా డాలరు బలోపేతం కారణంగా విలువల్లో వచ్చిన మార్పులు, అమెరికా బాండ్లపై అధిక ప్రతిఫలాలే కారణమని శక్తికాంత దాస్ తెలిపారు. ఏప్రిల్ 2న 606.475 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకపు నిల్వలు.. సెప్టెంబరు 23 కు 537.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7.4 శాతం తగ్గినా, ఇతర వర్థమాన, ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే మెరుగైన స్థితిలోనే ఉందని దాస్ తెలిపారు. రూపాయి మారకపు విలువ ఇంత ఉండాలని ఆర్బీఐ నిర్దేశించడం లేదని, అయితే ఒడుదొడుకులకు లోనైనప్పుడే జోక్యం చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తగినంత విదేశీ మారకపు నిల్వలు కలిగి ఉండాలన్నదే లక్ష్యమని వివరించారు. కరెన్సీ కదలికలు పరపతి విధాన నిర్ణయాలను నిర్దేశించబోవన్నారు.
* టోకనైజేషన్: నేటి (అక్టోబరు 1) నుంచి అమల్లోకి రానున్న టోకనైజేషన్ నిబంధనలకు వ్యవస్థ సిద్ధంగా ఉందని, 35 కోట్ల కార్డులు టోకనైజ్డ్ అయ్యాయని ఆర్బీఐ తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డులపై ఉంటే వివరాల స్థానంలో ‘టోకెన్’గా వ్యవహరించే ప్రత్యామ్నాయ కోడ్ ద్వారా లావాదేవీలు చేసుకునే సౌలభ్యమే టోకనైజేషన్. దీని వల్ల కార్డు లావాదేవీలు మరింత సురక్షితం అవుతాయి.
* కరెంటు ఖాతా లోటు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 3 శాతం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నరు మైఖేల్ పాత్ర చెప్పారు. తొలి అర్ధభాగంలో స్వల్పంగా పెరిగినా, రెండో అర్ధభాగంలో తగ్గుముఖం పట్టొచ్చని అన్నారు.
* రూపాయి వాణిజ్యం: విదేశాల నుంచి దిగుమతులకు, ఇక్కడ నుంచి ఎగుమతులకు సంబంధించిన లావాదేవీలు కూడా మన కరెన్సీలో నిర్వహించేందుకు 4- 5 దేశాల నుంచి మంచి స్పందన లభించిందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నరు టి.రవి శంకర్ చెప్పారు. మరిన్ని విదేశీ బ్యాంకులూ ఆసక్తిగా ఉన్నాయన్నారు.
* నిబంధనలకు అనుగుణంగానే రుణ వసూళ్లు: బ్యాంకులు/ రుణ సంస్థలు రుణ వసూళ్ల బాధ్యతను బయటి సంస్థలకు అప్పగించడాన్ని ఆర్బీఐ వ్యతిరేకించడం లేదని, అయితే చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలనే కోరుకుంటోందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నరు ఎం.కె.జైన్ స్పష్టం చేశారు. రుణ వసూళ్ల కోసం థర్ద్ పార్టీ సంస్థలను నియమించుకోవడంపై మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్పై ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాము తీసుకున్న ఈ చర్య.. ప్రత్యేకంగా ఆ ఒక్క సంస్థపైనే అని ఆయన తెలిపారు.
* దుకాణాలు, విక్రయ కేంద్రాల వద్ద ప్రత్యక్ష (ఫేస్ టు ఫేస్) చెల్లింపులకు వీలు కల్పించే ఆఫ్లైన్ పేమెంట్ అగ్రిగేటర్లను కూడా ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి తీసుకురానుంది. ఆన్లైన్ అగ్రిగేటర్లకు వర్తించే నిబంధనలే వీరికీ వర్తిస్తాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ విక్రయదార్లెవరూ కార్డుదార్ల వివరాలను నిక్షిప్తం చేయడానికి వీలుండదు.
* వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందించే నిమిత్తం గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులకు అర్హతా నిబంధనల పరిమితిని సడలిస్తున్నట్లు దాస్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ బ్యాంకింగ్ను విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని అన్నారు.
* ఎంపీసీ తదుపరి సమావేశం డిసెంబరు 5- 7 తేదీల్లో జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.