రుణ హమీ పథకం ద్వారా ఎంఎస్‌ఎమ్‌ఈలకు రూ.9000 కోట్లు

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పుచేసిన రుణ హామీ పథకం కింద ఎంఎస్‌ఎమ్‌ఈలకు రూ.9000 కోట్లు కేటాయించారు.

Published : 02 Feb 2023 03:15 IST

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పుచేసిన రుణ హామీ పథకం కింద ఎంఎస్‌ఎమ్‌ఈలకు రూ.9000 కోట్లు కేటాయించారు. రుణాల మంజూరు సమర్థంగా సాగేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిజిస్ట్రీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుత నిబంధనలపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించాలని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలకు నిర్మలా సీతారామన్‌ సూచించారు. క్లెయిమ్‌ చేసుకోని షేర్లను, డివిడెండ్లను తిరిగి క్లెయిమ్‌ చేసుకునేందుకు అనుసంధానిత ఐటీ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని