బ్లూస్టార్ శ్రీసిటీ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం
ఏసీలు ఉత్పత్తి చేసే సంస్థ బ్లూస్టార్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో కొత్తగా నిర్మించిన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది. 26.5 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మించారు.
రూ.350 కోట్లతో ఏర్పాటు
అత్యాధునిక ఏసీల తయారీ
ఈనాడు, హైదరాబాద్: ఏసీలు ఉత్పత్తి చేసే సంస్థ బ్లూస్టార్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో కొత్తగా నిర్మించిన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది. 26.5 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్లాంటుకు ఏటా 3 లక్షల ఇన్వర్టర్ ఏసీలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా, భవిష్యత్తులో 12 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా సామర్థ్యాన్ని విస్తరిస్తారు. ఇందుకు మరో రూ.200 కోట్లు పెట్టుబడి పెడతారు. ఈ ప్లాంటును అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించినట్లు బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ తెలిపారు. పూర్తి ఆటోమేషన్తో పాటు సౌర విద్యుత్తు యూనిట్, నీటి సంరక్షణ వ్యవస్థ ఇక్కడ ఉన్నాయని అన్నారు. దీనికి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్లాంటులో ప్రస్తుతం 750 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, విస్తరణ తర్వాత ఉద్యోగుల సంఖ్య 2,000కు పెరుగుతుందని అన్నారు.
కొత్త మోడల్ ఏసీలు
వచ్చే వేసవి సీజన్ కోసం ప్రాథమిక, ప్రీమియం, అధిక ప్రీమియం శ్రేణి ఏసీలను వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్లూస్టార్ తెలియజేసింది. మొత్తం 75 మోడళ్లను ఆవిష్కరించినట్లు పేర్కొంది. రూ.29,990 ప్రారంభ ధర నుంచి ఇవి లభిస్తాయని, 3-స్టార్ నుంచి 5-స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీలు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది. కన్వర్టబుల్ కూలింగ్, నానో బ్లూ ప్రోటెక్ట్ టెక్నాలజీ, హైడ్రోఫిలిక్ బ్లూఫిన్ కోటింగ్, ఇంధన పొదుపు లాంటి ప్రత్యేకతలతో ఏసీలను రూపొందించినట్లు వివరించింది. తమ ‘హెవీ డ్యూటీ’ ఏసీలు 56 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతలోనూ పనిచేస్తాయని తెలియజేసింది. నివాస ప్రాంతాలకు అనువైన ఏసీలను 2011 నుంచి బ్లూస్టార్ ఉత్పత్తి చేస్తోంది. 2025 నాటికి ఈ విభాగంలో 15% వాటా సంపాదించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి తగ్గట్లుగా రిటైల్ స్టోర్లలో విక్రయాలు నిర్వహించటంతో పాటు ఆన్లైన్ అమ్మకాలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తోంది.
రెండవ యూనిట్
వాణిజ్య ఏసీల ఉత్పత్తి, కూలింగ్ సేవల యూనిట్ల తయారీ నిమిత్తం శ్రీసిటీలోనే రెండవ యూనిట్ను బ్లూస్టార్ ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.250 కోట్లు పెట్టుబడి దీనికి అవసరం అవుతుంది. రెండవ యూనిట్ కోసం, ప్రస్తుత ప్లాంటు సమీపంలోనే 40 ఎకరాల స్థలాన్ని సేకరించనున్నారు. రెండవ యూనిట్ నిర్మాణ పనులను వచ్చే ఏడాదిలో చేపట్టాలని భావిస్తున్నట్లు త్యాగరాజన్ తెలిపారు. కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, చిన్న- మధ్యస్థాయి పట్టణాల్లోని వినియోగదార్లకు సైతం బ్లూస్టార్ ఉత్పత్తులను దగ్గర చేయాలనేది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?