కొత్త పన్ను విధానంతో మధ్య తరగతికి లబ్ధి
కొత్త పన్ను విధానంతో మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందని, వారి చేతుల్లో మరింత నగదు మిగులుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
‘అదానీ’ అంశం నియంత్రణ సంస్థల చేతుల్లో
సుప్రీంలో ప్రభుత్వం ఏం చెప్పిందన్నది వెల్లడించం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
దిల్లీ: కొత్త పన్ను విధానంతో మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందని, వారి చేతుల్లో మరింత నగదు మిగులుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బడ్జెట్ అనంతరం ఆర్బీఐ కేంద్ర బోర్డుకు ఇచ్చిన ప్రసంగం తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో ప్రజలతో పెట్టుబడులు పెట్టించాల్సిన అవసరం లేదని, పెట్టుబడుల విషయంలో వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ‘బడ్జెట్లో కొత్త పన్ను విధానంలోనూ స్టాండర్డ్ డిడక్షన్ను ప్రతిపాదించాం. ఇదే సమయంలో శ్లాబ్లు, పన్ను రేట్లలో మార్పులు చేశాం. దీంతో పన్ను చెల్లింపుదార్లకు మరింత లబ్ధి చేకూరనుంది. పెట్టుబడులు, వ్యయాల విషయంలో సంపాదించే వ్యక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి’ అని అన్నారు. కొత్త పన్ను చెల్లింపు విధానంలో రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రకటించారు. మధ్య తరగతిపై పన్ను భారం తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ప్రత్యక్ష పన్నులను సులభతరం చేస్తామని ఇచ్చిన హామీ అనుగుణంగా చేపట్టామని వివరించారు. 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 5.3 శాతంగా నమోదుకావొచ్చని, ముడి చమురు ధరలు ఇదే విధంగా ఉంటే మరింత తగ్గొచ్చని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాకు బ్యారెల్ ముడిచమురును 95 డాలర్లుగా లెక్కకట్టామని తెలిపారు. రుణ, డిపాజిట్ రేట్లపై బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. రుణ మంజూరు, జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ (ఎన్ఎఫ్ఐఆర్)ను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
క్రిప్టో నియంత్రణపై జీ20 సమావేశాల్లో చర్చ
క్రిప్టో కరెన్సీ ఆస్తుల నియంత్రణ అంశాన్ని జీ20 సమావేశాల్లో చర్చిస్తామని, ఈ విషయంలో అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ‘క్రిప్టో అనేది పూర్తి టెక్నాలజీ ఆధారితమైనది. మానవ ప్రమేయానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. కేవలం ఒక్కదేశం నిబంధనలు రూపొందించలేదు కాబట్టి అన్ని దేశాలు సంయుక్తంగా నియమావళిని తీసుకురావాల్సి ఉంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపకల్పనపై చర్చించనున్నాం’ అని తెలిపారు.
నియంత్రణ సంస్థలే చూసుకుంటాయ్: అదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించి విషయాన్ని నియంత్రణ సంస్థలు చూసుకుంటాయని, మన నియంత్రణ సంస్థలు చాలా అనుభవం కలిగినవని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదానీ గ్రూప్ షేర్ల పతనం అనంతరం సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘కోర్టులో ప్రభుత్వం ఏం చెప్పిందో నేను వెల్లడించలేను. భారత నియంత్రణ సంస్థలకు చాలా అనుభవం ఉంది. ప్రస్తుతం అదానీ అంశాలను అవి పర్యవేక్షిస్తున్నాయ’ని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434