Economy: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్
Economy: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల నిర్వహణలో విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇలా ప్రతి అంశంలో ప్రభుత్వం ఎలాంటి పురోగతి కనబర్చడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు.
దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ (Indian Economy) నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా అసమర్థంగా వ్యవహరిస్తోందని విమర్శించింది. పైగా గణాంకాలు తారుమారు చేస్తోందని ఆరోపించింది.
అదానీ స్కామ్, కుల గణన, పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation), ఆర్థిక అంతరాల్లో పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. గణాంకాలను ఎంత సవరించినా.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నది మాత్రం వాస్తవమని వ్యాఖ్యానించారు. కొవిడ్-19 మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయం ఆర్బీఐ విడుదల చేసిన 2023 సెప్టెంబర్ బులెటిన్ను చూస్తే స్పష్టమవుతోందన్నారు. 2020 ఫిబ్రవరిలో 43 శాతం మంది ప్రజలు శ్రామిక శక్తిలో ఉన్నారని తెలిపారు. మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా ఆ సంఖ్యలో పెద్దగా మార్పు లేదన్నారు. అజీమ్ ప్రేమ్జీ యూనివర్శిటీ నివేదిక ప్రకారం.. 2021- 22లో 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు.
నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరుగుతున్నాయని జైరాం రమేశ్ అన్నారు. ఇటీవలి వరకు టమాటాల ధరలు నియంత్రణ లేకుండా పెరిగాయని తెలిపారు. జనవరి నుంచి కంది పప్పు ధరలు 45 శాతానికి పైగా పెరిగాయన్నారు. మొత్తంగా పప్పు దినుసుల ద్రవ్యోల్బణం 13.4 శాతానికి చేరిందన్నారు. ఆగస్టు నుంచి పిండి ధరలు 20 శాతం పెరిగాయన్నారు. బెల్లం, చక్కెర ధరలు సైతం ఎగబాకుతున్నాయని తెలిపారు. నిత్యావసరాల ధరలు నియంత్రణ లేకుండా పెరగడమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
మోదీ ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారి విధానం వల్ల ఆర్థిక ఫలాలన్నీ కొన్ని ఎంపిక చేసిన కంపెనీలకే చెందుతున్నాయని జైరాం ఆరోపించారు. ఫలితంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పోటీ పడలేకపోతున్నాయని తెలిపారు. ప్రైవేట్ సెక్టార్కు ఇచ్చే రుణాలే వృద్ధికి ఊతమిస్తాయని తెలిపారు. 2004 నుంచి 2014 మధ్య ఈ రుణాల్లో స్థిర వృద్ధి నమోదైందని వరల్డ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయన్నారు. కానీ, 2014 నుంచి రుణాల మంజూరులో స్తబ్దత నెలకొందని తెలిపారు. 2021లో దేశీయ రుణాల్లోని వృద్ధి 2014తో పోలిస్తే 51 శాతం తగ్గిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు