Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆఫీసుల్లో పెరుగుతున్న వినియోగం
ప్రపంచ సగటు 75 శాతం, మనదేశంలో 92 శాతం...
మైక్రోసాఫ్ట్, లింక్డిన్ 2024 వర్క్ ట్రెండ్ ఇండెక్స్ నివేదిక
ఈనాడు - హైదరాబాద్
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 92 శాతం మంది నిపుణులు తమ కార్యాలయాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు తాజాగా ‘మైక్రోసాఫ్ట్, లింక్డిన్ 2024 వర్క్ ట్రెండ్ ఇండెక్స్’ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో ప్రపంచ సగటు 75 శాతం మాత్రమే కావటం గమనార్హం. ఏఐ వినియోగం వల్ల సమయం ఆదా అవుతుందని, సరికొత్త సేవలు ఆవిష్కరించే అవకాశం కలుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏఐ సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు సులువుగా లభిస్తున్నాయి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే ఏ వ్యాపార సంస్థకైనా ఏఐ వినియోగం తప్పనిసరి అని, తాము పనిచేసే కంపెనీలు ఏఐని విస్తృత స్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందని 91 శాతం మంది స్పష్టం చేశారు. తాము పనిచేస్తున్న సంస్థలకు ఏఐ ప్రణాళిక, దూరదృష్టి లేదని 54 శాతం ఉద్యోగులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. మరోపక్క ఉద్యోగుల్లో 72 శాతం మంది తమ సొంత ఏఐ టూల్స్ను తాము పనిచేసే చోట వినియోగిస్తున్నారు. సృజనాత్మకత, అధికోత్పత్తి దీనివల్ల సాధ్యమవుతున్నట్లు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
అన్వేషణ పెరిగింది..
లింక్డిన్ జాబ్ పోస్టింగ్స్లో ఇటీవల కాలంలో ఏఐ ప్రస్తావన అధికంగా ఉంటోంది. ఇటువంటి ఉద్యోగాలు 17 శాతం పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఏఐ సామర్థ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నట్లు, అదే విధంగా ఏఐని అధికంగా వినియోగిస్తున్న కంపెనీలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షిస్తున్నట్లు వివరించింది. ఏఐ సామర్థ్యాలు లేని ఉద్యోగులను తాము ఉద్యోగాల్లోకి తీసుకోవటం లేదని దేశంలోని 75 శాతం కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సగటు 66 శాతం మాత్రమే కావటం గమనార్హం. తగినంత అనుభవం లేకపోయినా.. ఏఐ సామర్థ్యాలు ఉంటే చాలు- అనే రీతిలో కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఏఐ నైపుణ్యం ఉన్న అభ్యర్ధులను తగినంత అనుభవం లేకపోయినా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని 80 శాతం కంపెనీలు తెలిపాయి. కోపైలెట్, చాట్జీపీటీ వంటి ఏఐ సామర్థ్యాలను సంపాదించిన లింక్డిన్ సభ్యుల సంఖ్య గత ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 142 శాతం పెరిగింది. అదేవిధంగా లింక్డిన్ కోర్సులను వినియోగించుకొని ఏఐ నైపుణ్యాలు సాధించిన నాన్-టెక్నికల్ అభ్యర్థుల సంఖ్య 160 శాతం పెరిగింది.
ప్రభుత్వ సంస్థల్లోనూ..
మనదేశంలో ఏఐ పవర్ యూజర్లలో 90 శాతం మంది తమ రోజును ఏఐ టూల్స్తో ప్రారంభిస్తున్నారు. రేపటి కోసం ఈరోజే సిద్ధం అయ్యే వారి సంఖ్య 91 శాతం ఉండటం ప్రత్యేకత. ఏఐ పవర్ యూజర్లకు శిక్షణ, ఇతర కార్యకలాపాల్లో ప్రాధాన్యం లభిస్తోంది. కంపెనీల్లో సీఈఓ నుంచి ప్రాజెక్టు మేనేజర్ల వరకూ ఏఐ నైపుణ్యాలున్న ఉద్యోగులతోనే చర్చిస్తున్నారు.
బీఎఫ్ఎస్ఐ, ఆరోగ్య సేవలు, ఐటీఈఎస్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ఎండీ ఇరినా ఘోష్ వివరించారు. ఏఐ టూల్స్, శిక్షణ, సంబంధిత అంశాలపై దృష్టి కేంద్రీకరించే వ్యాపార సంస్థలు సమీప భవిష్యత్తులో అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉద్యోగుల నైపుణ్యాలను, వ్యాపార సంస్థల సామర్థ్యాన్ని కృత్రిమ మేధ ఎంతగానో ప్రభావితం చేస్తున్నట్లు లింక్డిన్ హెడ్ (ట్యాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్) రుచీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. ఏఐ నైపుణ్యాలకు గత ఏడాదితో పోల్చితే గిరాకీ 17 శాతం పెరిగినట్లు తెలిపారు. కార్యాలయాల్లో జనరేటివ్ ఏఐ వినియోగం గత ఆరు నెలల్లోనే రెట్టింపు అయినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లింక్డిన్ సభ్యులు తమ ప్రొఫైళ్లు, బయోడేటాలకు ఏఐ నైపుణ్యాలను అధికంగా జోడిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఏఐ నైపుణ్యాలు సంపాదించాలనుకునే అభ్యర్థుల కోసం ‘కోపైలెట్ ఫర్ మైక్రోసాఫ్ట్ 365’ లో కొత్త సామర్థ్యాలను జోడించినట్లు, అంతేగాక 50 లెర్నింగ్ కోర్సులు ప్రారంభించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!
-
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్కు మోదీ నివాళులు
-
అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు: విశాఖ కలెక్టర్