IIT Bombay: పూర్వ విద్యార్థుల దాతృత్వం.. ‘ఐఐటీ బాంబే’కు రూ.57 కోట్లు అందజేత
‘ఐఐటీ- బాంబే’ 1998 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థకు రూ.57 కోట్ల విరాళం అందజేశారు.
ముంబయి: తాము చదువుకున్న విద్యాసంస్థకు విరాళాలు అందజేసే విషయంలో ఐఐటీ- బాంబే (IIT Bombay) పూర్వ విద్యార్థులు మరోసారి ఆదర్శంగా నిలిచారు. 1998 పాసవుట్ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ‘ఐఐటీ- బాంబే’కు రూ.57 కోట్ల విరాళం అందజేశారు. తమ సిల్వర్ జూబ్లీ రీయూనియన్ సందర్భంగా ఈ సాయానికి ముందుకొచ్చారు. ఒకే బ్యాచ్కు సంబంధించి ఇదే అత్యధిక విరాళం కావడం విశేషం. గతంలో 1971 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు తమ గోల్డెన్ జూబ్లీ సంబరాల సందర్భంగా రూ.41 కోట్లు అందజేశారు.
సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ్ సక్సేనా, పీక్ XV ఎండీ శైలేంద్ర సింగ్, వెక్టార్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ, గూగుల్ డీప్మైండ్కు చెందిన దిలీప్ జార్జ్ తదితర 200 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఇందులో భాగమయ్యారు. ఐఐటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశోధనలకు ఈ విరాళం సాయపడుతుందని ‘ఐఐటీ బాంబే’ డైరెక్టర్ సుభాశీష్ చౌధురి తెలిపారు. 2030 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి 50 విశ్వవిద్యాలయాల్లో ‘ఐఐటీ బాంబే’ను నిలపాలనే లక్ష్యానికి పూర్వ విద్యార్థుల చొరవ దోహదపడుతుందన్నారు.
ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని భూరి విరాళం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, ఇతర పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో ఈ విరాళానికి ముందుకొచ్చినట్లు 1998 బ్యాచ్కు చెందినవారు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ‘ఐఐటీ బాంబే’ను ప్రపంచ ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిపేందుకు, ఇతర పూర్వ విద్యార్థులను కూడా దాతృత్వ సహకారం దిశగా మళ్లించేందుకు తమ ప్రయత్నం సాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. నందన్ నీలేకని గతంలో రెండు సందర్భాల్లో ‘ఐఐటీ బాంబే’కు రూ.315 కోట్లు, రూ.85 కోట్ల చొప్పున విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్