RIL AGM: రిలయన్స్ నుంచి కీలక ప్రకటన.. బీమా రంగంలోకి జియో ఫైనాన్షియల్
Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీమా రంగంలోకి అడుగుపెట్టనుంది. సాధారణ, ఆరోగ్య బీమా పాలసీలు అందించనుంది. రిలయన్స్ ఏజీఎంలో ఈ మేరకు ప్రకటన వెలువడింది.
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరుపడి ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు (Jio Financial Services) సంబంధించి రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. బీమా రంగంలోకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రవేశించనుందని చెప్పారు. ఈ మేరకు రిలయన్స్ 46వ వార్షిక సాధారణ సమావేశంలో (RIL AGM) దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
‘‘జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీమా విభాగంలోకి అడుగు పెడుతుంది. సాధారణ బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా సేవలను అందిస్తుంది. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో డిజిటల్ వేదికగా ఈ సేవలను అందించనున్నాం’’ అని ముకేశ్ అంబానీ తెలిపారు. ‘‘ఆగస్టు 21న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఒక్కో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుకు గానూ ఒక్కో జేఎఫ్ఎస్ షేరు కేటాయించాం. ఇదీ వాటాదారులకు మినీ బోనస్గా భావిస్తున్నాం’’ అని అంబానీ అన్నారు. ఇది అత్యంత మూలధనంతో కూడుకున్న వ్యాపారమని, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర విలువ రూ.1.2 లక్షల కోట్లని తెలిపారు. జియో, రిలయన్స్ రిటైల్ తరహాలో జియో ఫైనాన్షియల్ వ్యాపారం సైతం రాణిస్తుందని చెప్పారు.
డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ.. వినాయక చవితికి ఎయిర్ఫైబర్
అలాగే, అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయిన బ్లాక్రాక్తో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకున్న రిలయన్స్.. ఆ సంస్థతో కలిసి అసెట్ మేనేజ్మెంట్ సంస్థను నెలకొల్పనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. జాయింట్ వెంచర్గా ఇది ఏర్పాటు అవుతుందని చెప్పారు. మరోవైపు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు మరోసారి నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో 2.10 శాతం నష్టంతో రూ.210.10 వద్ద ముగిశాయి. ఏజీఎంలో ముకేశ్ అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి ప్రస్తావనకు రాగానే షేర్లు ఒక్కసారిగా 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకాయి. కాసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్