Kia Carnival: కియా కార్నివాల్‌ విక్రయాలు ఇక లేనట్లే!

Kia Carnival: కియా కార్నివాల్‌ భారత్‌లో 2020లో విడుదలైంది. అప్పటి నుంచి దీంట్లో కంపెనీ ఎలాంటి అప్‌గ్రేడ్లు ఇవ్వలేదు.

Published : 22 Jun 2023 12:46 IST

దిల్లీ: కియా ఇండియా తమ ప్రధాన ఎంపీవీ కార్నివాల్‌ (Kia Carnival)ను వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. దీంతో కియా కార్నివాల్‌ (Kia Carnival) విక్రయాలు భారత్‌లో ఇక నిలిచిపోయినట్లే! కంపెనీ మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఇప్పటికే డీలర్లు వీటి బుకింగ్‌లు తీసుకోవడం ఆపేశారు.

2020లో కియా కార్నివాల్‌ (Kia Carnival) భారత్‌లో విడుదలైంది. అప్పటి నుంచి దీంట్లో కంపెనీ ఎలాంటి అప్‌గ్రేడ్లను తీసుకురాలేదు. ఇటీవల అమల్లోకి వచ్చిన బీఎస్‌6 రెండో దశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే కార్నివాల్‌ ఉపసంహరణకు కారణమని తెలుస్తోంది. మరోవైపు కియా ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లో ఎంపీవీ సెగ్మెంట్‌లో కొత్త తరం కేఏ4ను విక్రయిస్తోంది. కార్నివాల్‌ను అప్‌గ్రేడ్‌ చేయడానికి బదులు కేఏ4ను భారత్‌కు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో కియా భారత్‌లో నాలుగో తరం ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ఎంపీవీని విడుదల చేయనుందని వాహన పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని