FD: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

ఆర్‌బీఐ రెపోరేటు 0.35% పెంచిన తర్వాత కోటక్‌ మహీంద్రా బ్యాంకు తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది.

Published : 09 Dec 2022 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ (RBI) రెపో రేటును 0.35% పెంచిన తర్వాత కోటక్‌ మహీంద్రా బ్యాంకు (Kotak mahindra bank) ఎఫ్‌డీలపై (FD) వడ్డీ రేట్లను పెంచింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు నేటి (డిసెంబరు 9) నుంచి అమల్లోకి వస్తాయి. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లకు వర్తిస్తాయి. సాధారణ డిపాజిటర్ల కన్నా అన్ని సీనియర్‌ సిటిజన్‌ డిపాజిటర్లకు 0.50% అధిక వడ్డీ రేటు లభిస్తుంది. వివిధ కాలవ్యవధుల డిపాజిట్లపై కనిష్ఠ, గరిష్ఠ వడ్డీ రేట్లు ఈ కింది పట్టికలో ఉన్నాయి. 180 రోజుల కంటే తక్కువ కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై ముందస్తు ఉపసంహరణకు జరిమానా లేదు. 180-364 రోజుల మధ్య కాలవ్యవధి ఉన్న డిపాజిట్ల ముందస్తు ఉపసంహరణపై బ్యాంకు 0.50% జరిమానా విధిస్తుంది. 365 రోజుల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై జరిమానా 1 శాతం ఉంటుంది.

గమనిక: సవరించిన వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని