3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు పడేశాయ్
సమీక్ష
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. షేర్ల విలువలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం ప్రభావం చూపింది. లోక్సభ ఎన్నికల మొదటి 3 దశల్లో తక్కువ పోలింగ్ నమోదైందని, అధికార భాజపాకు ఇది ప్రతికూలమన్న విశ్లేషకులు అంచనాలూ ఇందుకు తోడయ్యాయి. నిఫ్టీ సూచీ తన 50 రోజుల సగటు కదలికల స్థాయి దిగువకు చేరింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా, మదుపర్ల సంపద దాదాపు రూ.11 లక్షల కోట్ల మేర ఆవిరైంది. డాలర్తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి 83.51 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 83.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ మినహా మిగతావి రాణించాయి. ఐరోపా సూచీలు లాభపడ్డాయి.
సెన్సెక్స్ ఉదయం 73,973.30 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్లో 74,026.80 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసిన సూచీ, వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 73,259.26 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 383.69 పాయింట్ల నష్టంతో 73,511.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.20 పాయింట్లు కోల్పోయి 22,302.50 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,232.05- 22,499.05 పాయింట్ల మధ్య కదలాడింది.
- మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో మారికో షేరు 9.85 శాతం దూసుకెళ్లి రూ.583.35 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,768.16 కోట్లు పెరిగి రూ.75,491.43 కోట్లకు చేరింది.
- రూ.4,616 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలం కావడంతో జైప్రకాశ్ అసోసియేట్స్ షేరు 5.77% నష్టపోయి రూ.17.64 దగ్గర ముగిసింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 19 డీలాపడ్డాయి. ఆర్ఐఎల్ 1.27%, హెచ్డీఎఫ్సీ 1.08%, పవర్గ్రిడ్ 3.80%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.05%, టాటా మోటార్స్ 2.72%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.61%, హెచ్సీఎల్ టెక్ 2.14%, ఎన్టీపీసీ 2.13%, టాటా స్టీల్ 2.03% నష్టపోయాయి. హెచ్యూఎల్ 5.51%, టెక్ మహీంద్రా 2.37%, నెస్లే 2.06%, టీసీఎస్ 1.47%, ఐటీసీ 1.33%, కోటక్ బ్యాంక్ 1.20%, విప్రో 1.13%, ఇన్ఫోసిస్ 1.05% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి 3.41%, యుటిలిటీస్ 2.85%, కమొడిటీస్ 2.18%, వినియోగ 1.73%, టెలికాం 1.43% నీరసపడ్డాయి. ఐటీ, టెక్ మెరిశాయి. బీఎస్ఈలో 2794 షేర్లు నష్టాల్లో ముగియగా, 1034 స్క్రిప్లు లాభపడ్డాయి. 104 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- ఇండీజీన్ ఐపీఓ రెండో రోజుకు 7.34 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2,88,66,677 షేర్లను ఆఫర్ చేయగా, 21,20,23,944 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
- అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి 20 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసే ఒప్పందానికి శ్రీలంక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 484 మెగావాట్ల పవన విద్యుత్ స్టేషన్లను సంస్థ అభివృద్ధి చేయనుంది.
- లాజిస్టిక్స్ సొల్యూషన్స్ అందించే ప్రీమియర్ రోడ్లైన్స్ ఐపీఓ ఈనెల 10న ప్రారంభమై 14న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.63-67 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.40 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్పై నమోదుకానున్నాయి. రిటైల్ మదుపర్లు కనీసం 2000 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
- అరుదైన నరాల సంబంధిత వ్యాధి చికిత్సలో వినియోగించే జనరిక్ ఎడారవోన్ ఇంజెక్షన్కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఇచ్చిందని గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెటింగ్ భాగస్వామితో కలిసి ఈ ఇంజెక్షన్ను అమెరికాలో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.
- ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు సెబీ అనుమతి లభించినట్లు సంస్టార్ లిమిటెడ్ తెలిపింది. మొక్కల ఆధారిత స్పెషాలిటీ ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ఐపీఓ పరిమాణం రూ.425- 500 కోట్లుగా ఉండొచ్చు.
- డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ వీసా కంట్రీ మేనేజర్ (భారత్)గా సుజయ్ రైనా నియమితులయ్యారు.
నేటి బోర్డు సమావేశాలు: ఎల్ అండ్ టీ, టాటా పవర్, కెనరా బ్యాంక్, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్, భారత్ ఫోర్జ్, బీఎస్ఈ, పిరమాల్ ఎంటర్ప్రైజెస్, విజయ డయాగ్నోస్టిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్గా అందిస్తున్నట్లు ప్రకటించింది. -
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
Pakistan: పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్యం సైతం దెబ్బతింది. తాజాగా దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్.. ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ