SBIని దాటేసిన LIC.. ఆ జాబితాలో అగ్రస్థానంలోకి
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా అవతరించింది.
దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) మరో మైలురాయిని అందుకుంది. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా అవతరించింది. ఈ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (SBI) అధిగమించింది. బుధవారం నాటి ట్రేడింగ్లో తొలుత ఎల్ఐసీ షేర్లు 3 శాతం మేర ఎగబాకాయి. ఇంట్రాడేలో రూ.919.45 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరాయి. చివరికి 0.63 శాతం నష్టంతో రూ.886.90 వద్ద ముగిశాయి. అదే సమయంలో ఎస్బీఐ షేర్లు 1.67 శాతం నష్టంతో రూ.626.15 వద్ద ముగిశాయి.
ఈ క్రమంలో మార్కెట్ విలువ పరంగా ఎస్బీఐని ఎల్ఐసీ అధిగమించింది. ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.5,60,964.05 కోట్లు కాగా.. ఎస్బీఐ మార్కెట్ విలువ రూ.5,58,814.58 కోట్లుగా నిలిచింది. రెండు అగ్రగామి సంస్థల మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసం రూ.2,149.47 కోట్లు మాత్రమే. ఇక ఓవరాల్గా చూసుకుంటే అత్యధిక విలువ కలిగిన కంపెనీల జాబితాలో ఎల్ఐసీ తొమ్మిదో స్థానంలో నిలిచింది.
టాప్ -10 కంపెనీలు ఇవే..
- రిలయన్స్ ఇండస్ట్రీస్ - రూ.18,42,160.54 కోట్లు
- టీసీఎస్ - రూ.14,21,230.44 కోట్లు
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ - రూ.11,66,888.98 కోట్లు
- ఐసీఐసీఐ బ్యాంక్ - రూ.6,87,740.99 కోట్లు
- ఇన్ఫోసిస్ - రూ.6,80,631.89 కోట్లు
- భారతీ ఎయిర్టెల్ - రూ.6,10,389.59 కోట్లు
- హిందుస్థాన్ యూనిలీవర్ - రూ.6,02,388.21 కోట్లు
- ఐటీసీ- రూ.5,82,423.61 కోట్లు
- ఎల్ఐసీ- రూ.5,60,964.05 కోట్లు
- ఎస్బీఐ - రూ.5,58,814.58 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!