Piyush Goyal: ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు మూలస్తంభంగా భారత్!
స్థిరమైన వృద్ధి(Growth)ని ప్రదర్శించడంతోపాటు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా నిలిచిన నేపథ్యంలో.. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ(Economic Revival)కు భారత్ మూలస్తంభంగా...
ఇంటర్నెట్ డెస్క్: స్థిరమైన వృద్ధిని ప్రదర్శించడంతోపాటు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా నిలిచిన నేపథ్యంలో.. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ(Economic Revival)కు భారత్ మూలస్తంభంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. బెంగాల్ ఛాంబర్స్ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా మంత్రి ఆన్లైన్లో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని భాగస్వాములందరూ కర్తవ్య భావంతో కలిసి పనిచేస్తే.. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న జాతీయ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. 2030 నాటికి రెండు ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
‘భారత్ ఇప్పటికే ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కొన్నేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా అన్ని వనరులను సమకూర్చుకుంటోంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రధాని మోదీ విజన్’ అని గోయల్ అన్నారు. వ్యవసాయం, తయారీ, నిర్మాణం తదితర అన్ని రంగాలు మంచి వృద్ధి కనబరుస్తున్నాయని పేర్కొన్నారు. ‘భారత్ సుస్థిరత కలిగిన దేశం. కొవిడ్ సమయంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించింది. స్థిరమైన వృద్ధి మార్గంలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు మూలస్తంభంగా నిలుస్తుంది’ అని మంత్రి అభిప్రాయపడ్డారు.
పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ కేంద్రమని గోయల్ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని, మరిన్నింటినీ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. తయారీ రంగంలో భారత్ గ్లోబల్ హబ్గా ఎదిగేలా.. టైర్- 2, టైర్- 3 నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. సులభతర వ్యాపార నిర్వహణ విషయమై ప్రభుత్వంతో మరిన్ని చర్చలు జరపాలని, ఎఫ్టీఏ(స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) చర్చల్లో చురుకుగా పాల్గొనాలని మంత్రి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?