IPO listing: ఐపీఓలపై సెబీ కీలక నిర్ణయం.. ఇక మూడు రోజుల్లోనే లిస్టింగ్
SEBI on IPO: ఐపీఓకు సంబంధించి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఓ లిస్టింగ్ సమయాన్ని మూడు రోజులకు తగ్గించింది.
దిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కు (IPO) సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఓ లిస్టింగ్ సమయాన్ని కుదించింది. ఐపీఓ సబ్స్క్రిప్షన్ తర్వాత ప్రస్తుతం 6 రోజులకు షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేస్తున్నారు. తాజాగా ఆ సమయాన్ని మూడు రోజులకు సెబీ కుదించింది. ఈ మేరకు బుధవారం ఓ సర్క్యులర్ విడుదల చేసింది.
సెప్టెంబర్ 1 తర్వాత పబ్లిక్ ఇష్యూకు వచ్చే అన్ని కంపెనీలూ ఈ విధానం పాటించాల్సి ఉంటుంది. అయితే, అది స్వచ్ఛందమే. డిసెంబర్ 1 తర్వాత పబ్లిక్ ఇష్యూకు వచ్చే కంపెనీలు మాత్రం విధిగా మూడు రోజుల నిబంధన అనుసరించాల్సి ఉంటుంది. అంటే ఇకపై సబ్స్క్రిప్షన్ పూర్తయిన మూడు రోజులకే ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవ్వనున్నాయి. దీనివల్ల అటు కంపెనీలకు, ఇటు ఇన్వెసర్లకూ మేలు చేకూరుతుందని సెబీ తెలిపింది.
ఆన్లైన్లో రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకోండిలా..
‘లిస్టింగ్ సమయాన్ని తగ్గించడం వల్ల సమీకరించిన మొత్తాన్ని కంపెనీలు తమ వ్యాపార అవసరాలకు వినియోగించడం వీలు పడుతుంది. అదే విధంగా ఇన్వెస్టర్లకు సైతం తమ పెట్టుబడులపై షేర్లను, లిక్విడిటీని త్వరితగతిన పొందేందుకు వీలు పడుతుంది. ప్రస్తుతం లిస్టింగ్ సమయాన్ని టి+6 అనుసరిస్తుండగా.. టి+3కి తగ్గిస్తున్నాం’’ అని సెబీ తెలిపింది. ఇక్కడ ‘టి’ అంటే సబ్స్క్రిప్షన్ క్లోజింగ్ డేట్గా పరిగణిస్తారు. ఐపీఓ లిస్టింగ్కు సంబంధించి సెబీ జూన్లో ప్రతిపాదించింది. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాల స్వీకరణ అనంతరం తాజాగా నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!