Stock Market Opening bell: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి...
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. అక్కడ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ధరలు అదుపులోకి వచ్చే వరకు వడ్డీరేట్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఫెడరల్ రిజర్వు అధికారులు సంకేతాలిచ్చారు. దీంతో బుధవారం లభించిన ర్యాలీ గురువారం ఆవిరైంది. మరోవైపు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. దేశీయంగా చూస్తే విదేశీ మదుపర్ల కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ రంగం బలంగా ఉండడం మార్కెట్లకు కలిసొస్తోంది. క్రెడిట్ గ్రోత్, నిరర్థక ఆస్తులు తగ్గడం, బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉండడం బ్యాంకింగ్ రంగ షేర్ల రాణింపునకు దోహదం చేస్తోంది. జూన్ త్రైమాసికంలో బలమైన కార్పొరేట్ ఫలితాలు కూడా మరో కారణం. అయితే, నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో నేడు గరిష్ఠాల వద్ద మదుపర్లు ఉదయం సెషన్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు.
ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్ల నష్టంతో 59,123 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 17,600 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.66 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, మారుతీ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: ఎల్ఐసీ, ఓఎన్జీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్స్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, ఇన్ఫో ఎడ్జ్, హీరో మోటోకార్ప్, ముథూట్ ఫైనాన్స్, సన్ టీవీ, భారత్ డైనమిక్స్, బాలాజీ అమైన్స్
నేడు గమనించాల్సిన స్టాక్స్...
అరబిందో ఫార్మా: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.6,236 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికరలాభం రూ.520.5 కోట్లుగా నమోదైంది.
పేజ్ ఇండస్ట్రీస్: ఈ వస్త్ర తయారీ కంపెనీ జూన్తో ముగిసిన త్రైమాసికంలో బలమైన కార్పొరేట్ ఫలితాలను ప్రకటించింది. నికర లాభాలు వార్షిక ప్రాతిపదికన రూ.10 కోట్ల నుంచి రూ.207 కోట్లకు పెరిగింది. అదే సమయంలో ఆదాయం రెండింతలు పెరిగి రూ.1,341.6 కోట్లకు చేరింది.
అపోలో హాస్పిటల్స్: ఈ సంస్థ లాభాలు తొలి త్రైమాసికంలో 30 శాతం తగ్గి రూ.323.7 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం స్వల్పంగా తగ్గి రూ.3,760.21 కోట్లుగా నివేదించింది.
బాటా ఇండియా: ఈ ప్రముఖ ఫుట్వేర్ కంపెనీ లాభం జూన్ త్రైమాసికంలో 71.82 శాతం పెరిగి రూ.119.37 కోట్లుగా నమోదైంది. ఆదాయం మూడింతలు పెరిగి రూ.943.01 కోట్లకు చేరింది.
గోద్రేజ్ ప్రాపర్టీస్: దిల్లీలోని అశోక్ విహార్లో ఈ ఏడాది కొత్త విలాసవంతమైన హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభించనుంది. దీని ద్వారా రూ.8,000 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆయిల్ ఇండియా: ఈ ప్రభుత్వ రంగ సంస్థ నికర లాభాలు జూన్ త్రైమాసికంలో దాదాపు మూడింతలై రూ.1,555.4 కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434